అన్వేషించండి

Hyderabad: 5 రోజుల క్రితం హైదరాబాద్‌లో బాలుడు మాయం! కట్‌చేస్తే ఢిల్లీలో ప్రత్యక్షం, ఏం జరిగిందంటే

ఆరేళ్ల బాలుడు ఉన్నట్టుండి 5 రోజుల క్రితం అదృశ్యం అయ్యాడు. కంగారు పడిపోయిన తల్లిదండ్రులు అన్ని చోట్లా వెతుకుతుండగా ఉన్నట్టుండి ఢిల్లీలో కనిపించాడు.

హైదరాబాద్‌లో సరిగ్గా 5 రోజుల క్రితం కనిపించకుండా పోయిన 5 ఏళ్ల బాలుడు ఢిల్లీలో ప్రత్యక్షమయ్యాడు. ఈ వ్యవహారం ఇప్పుడు పోలీసులకు సవాలుగా మారింది. బాలుడ్ని హైదరాబాద్ పోలీసులు క్షేమంగా ఢిల్లీ నుంచి ఇక్కడికి తీసుకొచ్చినప్పటికీ ఈ వ్యవహారం ఎలా జరిగిందన్నది మాత్రం తేలడం లేదు. నగరంలోని మల్లేపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇవీ.. 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆరేళ్ల బాలుడు ఉన్నట్టుండి 5 రోజుల క్రితం అదృశ్యం అయ్యాడు. కంగారు పడిపోయిన తల్లిదండ్రులు అన్ని చోట్లా వెతుకుతుండగా ఉన్నట్టుండి ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యాడు. అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లోని హబీబ్‌ నగర్‌ పోలీస్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన ఫ్లైట్‌లో ఢిల్లీకి వెళ్లి బాలుణ్ని క్షేమంగా ఇక్కడికి తీసుకొని వచ్చారు. స్టేషన్‌లోనే సాయంత్రం తల్లిదండ్రులకు బాలుడ్ని క్షేమంగా అప్పగించారు. 

మల్లేపల్లిలోని బడీమసీదు ప్రాంతంలో ఉంటున్న కారు డ్రైవర్‌ హనీఫ్‌ కుమారుడు ఆయాన్‌ ఈనెల 17న కనిపించకుండా పోయాడు. పోలీసులు నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిల్లో గాలిస్తున్నారు. అదే సమయంలో బాలుడి వివరాలు ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయగా వాటిని చూసిన ఢిల్లీ నిజాముద్దీన్‌ పోలీసులు ఆదివారం నగర పోలీసులను సంప్రదించారు. 

ఈ క్రమంలో బాలుడు ఆయాన్‌ను తీసుకు వచ్చేందుకు అడిషనల్ ఇన్‌స్పెక్టర్‌ నరసింహ, బాలుడి తండ్రి హనీఫ్‌లు ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. నిజాముద్దీన్‌ పోలీస్ స్టేషన్‌లో ఉన్న బాలుణ్ని తీసుకుని హైదరాబాద్‌కు సోమవారం వచ్చారు. ఈ నెల 19న ఒక అపరిచిత వ్యక్తి నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన ఆధార్‌ వివరాలు నమోదు చేసి ఆయాన్‌ను అప్పగించి వెళ్లాడంటూ నిజాముద్దీన్‌ పోలీసులు చెప్పారు. అయితే, మల్లేపల్లిలో ఉన్న బాలుణ్ని ఆ వ్యక్తే చేరదీసి రైల్లో ఢిల్లీకి తీసుకెళ్లాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. కిడ్నాప్‌ చేసిన వ్యక్తి రైల్లో ఎందుకు తీసుకెళ్లాడు? ఎందుకు ఢిల్లీ పోలీసులకు అప్పజెప్పాడనేది మాత్రం అంతుచిక్కడం లేదు. కిడ్నాప్‌ చేసుంటే ఆధార్‌ కార్డు, వివరాలు పోలీసులకు ఎందుకు ఇచ్చాడని ఆరా తీస్తున్నారు. అయితే, కిడ్నాప్ చేసిన వ్యక్తి ఢిల్లీలో వదిలేయగా.. మరో వ్యక్తి చేరదీసి పోలీస్ స్టేషన్‌లో అప్పగించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

Also Read: Mir Osman Ali Khan: హైదరాబాద్ చివరి రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎలా చనిపోయారో తెలుసా.. ? భారంగా గడిచిన నిజాం 7 చివరి క్షణాలు

Also Read: Bheemla Naiak: నేడే బీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్, ఈ రూట్స్‌లో ట్రాఫిక్ ఆంక్షలు - వీళ్లు మరో మార్గం చూసుకోవాల్సిందే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget