అన్వేషించండి

Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

Telangana News : కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా సిటీ ఏర్పాటు చేయడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని రేవంత్ తెలిపారు.

Revanth Reddy has clarified that pharma city will not be established in Kodangal | కొడంగల్ లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని చెప్పారు. కొడంగల్ ఎమ్మెల్యే గా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతా అన్నారు. కాలుష్యరహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని తెలిపారు. భూసేకరణ పరిహారం పెంపు ను పరిశీలిస్తామని చెప్పారు. తనని కలిసిన వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. నియోజకవర్గంలోని లగచర్ల ఘటన పైన వామపక్ష నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

కలెక్టర్, పోలీస్ అధికారులపై లగచర్లలో దాడి

ఇటీవల కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులపై రైతులు దాడి చేయడం సంచలనం రేపింది. ఫార్మా సిటీ కోసం తమ భూములు బలవంతంగా లాక్కునే ప్రయత్నం జరుగుతుందని బాధిత రైతులు ఆరోపించారు. ఆ క్రమంలో రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, డీఎస్పీ, ఇతర పోలీస్ అధికారులు లగచర్లకు వెళ్లారు. బోగమోని సురేష్ అనే వ్యక్తి రైతులు, కొందరు గ్రామస్తులను గుంపుగా పోగుచేసి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేపించారని పోలీసులు తెలిపారు. సురేష్ పిలిచాడన్న కారణంగానే కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు లగచర్లకు వెళ్లగా.. వెంటనే అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారి వాహనాలపై పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేసి వాహనాల అద్దాలు ధ్వంసం చేయడంతో కలకలం రేగింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత అంటూ బీఆర్ఎస్ నేతలు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. 

కుట్రపూరిత దాడిగా ప్రభుత్వం సీరియస్

అధికారులపై కుట్రపూరితంగా దాడి జరిగిందని లగచర్ల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఏ1గా చేర్చగా, ఏ2గా బోగమోని సురేష్ ఉన్నాడు. దాదాపు నరేందర్ రెడ్డిని ఘటన జరిగిన రెండు, మూడు రోజుల్లోనే అరెస్ట్ చేయగా, ఏ2 సురేష్ మాత్రం వారం రోజులపాటు పరారీలో ఉన్నాడు. అతడిపై లుకౌట్ నోటీసులు జారీ అయిన తరువాత కొడంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సురేష్ ను కొడంగల్ కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులపాటు రిమాండ్ విధించారు.

రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు

లగచర్లలో అధికారులపై దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారని పోలీసులు కేసు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర జరిగిందని అభియోగాలున్నాయి. పట్నం నరేందర్ రెడ్డి సూచనలతోనే సురేష్ రైతులను పురమాయించి దాడికి ప్లాన్ చేశాడని పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో మరో వ్యక్తి కీలకంగా మారాడు. పంచాయతీ సెక్రటరీగా చేస్తున్న అతడు రైతులను రెచ్చగొట్టి దాడికి ప్లాన్ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ 26 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. సంగారెడ్డి జైలులో నిందితుల విచారణ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సంగారెడ్డి జైలులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఇటీవల కలిశారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అక్రమ కేసులకు భయపడొద్దని న్యాయ పోరాటం చేద్దామన్నారు.

Also Read: KTR News: కేటీఆర్‌కు బిగ్ షాక్, నాంపల్లి కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు - కారణం ఇదే

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan:
"పిఠాపురంలో రూల్‌బుక్, అభివృద్ధే మాట్లాడాలి" అధికారులకు కీలక ఆదేశాలు! మార్చి 14న భారీ బహిరంగ సభ
Hyderabad Crime News: పీరియడ్స్ కారణంగా కాలేజీకి ఆలస్యం! ప్రూఫ్‌లు అడిగిన లెక్చరర్లు ! మనస్థాపంతో హైదరాబాద్ విద్యార్థిని మృతి
పీరియడ్స్ కారణంగా కాలేజీకి ఆలస్యం! ప్రూఫ్‌లు అడిగిన లెక్చరర్లు ! మనస్థాపంతో హైదరాబాద్ విద్యార్థిని మృతి
Telangana DGP Issue: నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
Andhra Pradesh TET Results 2025: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!

వీడియోలు

Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam
Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan:
"పిఠాపురంలో రూల్‌బుక్, అభివృద్ధే మాట్లాడాలి" అధికారులకు కీలక ఆదేశాలు! మార్చి 14న భారీ బహిరంగ సభ
Hyderabad Crime News: పీరియడ్స్ కారణంగా కాలేజీకి ఆలస్యం! ప్రూఫ్‌లు అడిగిన లెక్చరర్లు ! మనస్థాపంతో హైదరాబాద్ విద్యార్థిని మృతి
పీరియడ్స్ కారణంగా కాలేజీకి ఆలస్యం! ప్రూఫ్‌లు అడిగిన లెక్చరర్లు ! మనస్థాపంతో హైదరాబాద్ విద్యార్థిని మృతి
Telangana DGP Issue: నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
Andhra Pradesh TET Results 2025: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
Mamata Banerjee: 'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు
'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు" నిరసన మార్చ్‌లో మమత నిప్పులు!
Crime News: కూతురి మామగారితో తల్లి లవ్‌! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!
కూతురి మామగారితో తల్లి లవ్‌! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!
US proposing 500 percent tax:500 శాతం సుంకాలంటూ అమెరికా బెదిరింపు - భారత్ రియాక్షన్ అదుర్స్
500 శాతం సుంకాలంటూ అమెరికా బెదిరింపు - భారత్ రియాక్షన్ అదుర్స్
Sabarimala gold theft case: శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడు అరెస్ట్ - గోల్డ్ గోల్ మాల్ కేసులో సంచలనం !
శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడు అరెస్ట్ - గోల్డ్ గోల్ మాల్ కేసులో సంచలనం !
Embed widget