అన్వేషించండి

Rangam Bhavishyavani 2022: కుండపోత వర్షాలకు మీ తప్పులే కారణం, భవిష్యవాణిలో అమ్మవారు ఆగ్రహం - భక్తులకు సూచనలు

Rangam Bhavishyavani 2022: మీరు నా ఆగ్రహానికి గురికావొద్దు. ఇకనుంచి పూజలు సరిగా జరిపించండి. నా రూపాన్ని ఎందుకు మారుస్తున్నారంటూ గర్భాలయ ప్రధాన పూజారులపైనే అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల వేడుక ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా సోమవారం నాడు (జూలై 18న) ఎంతో కీలకమైన వేడుక రంగం నిర్వహించారు. భవిష్యవాణి వినిపించిన జోగిణి స్వర్ణలత కీలక విషయాలు చెప్పారు. మొక్కుబడిగా ఎందుకు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం భక్తుల సంతోషం కోసం పూజలు చేస్తున్నారు కానీ, అమ్మవారిని మనసు పెట్టి పూజలు చేయడం లేదన్నారు. అమ్మవారిని అన్నిరూపాలు ఎందుకు మారుస్తారు, పూజలు ఎందుకు సరిగా చేయడం లేదు ? అన్నారు. తన గర్భాలయంలో శాస్త్రోక్తంగా పూజలు సక్రమంగా జరిపించాలని సూచించారు. ఎన్నితప్పులు చేసినా కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నానని అమ్మవారి భవిష్యవాణిని స్వర్ణలత వినిపించారు.

భవిష్యవాణిలో అమ్మవారి ఆగ్రహం..!!
మిమ్మల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మీరు నా ఆగ్రహానికి గురికావొద్దు. ఇకనుంచి పూజలు సరిగా జరిపించండి. నా రూపాన్ని ఎందుకు మారుస్తున్నారంటూ గర్భాలయ ప్రధాన పూజారులపైనే అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు గర్భిణీలకు ఇబ్బంది లేకుండా చూస్కుంటున్నాను. ప్రతి ఏటా పూజలు ఎలా చేయాలని నన్నే అడుగుతున్నారు. మీరంతా నా బిడ్డలు కనుక నేనుమిమ్మల్ని కాపాడుతున్నానని అమ్మవారి భవిష్యవాణిని స్వర్ణలత వినిపించారు.

అందుకే వర్షాలు..
తన రూపాన్ని ఇష్టం వచ్చినట్లుగా మార్చడం, మీ ఇష్టం ఉన్నట్లు పూజలు నిర్వహించారు. అందుకే నేను మీ కళ్లు తెరిపించేందుకు కుండపోత వర్షాలు కురిపించాననని అమ్మవారు చెప్పారు. ఎన్ని తప్పులు చేసినా నా బిడ్డలేనని క్షమిస్తున్నానని, ఇకనుంచి ఇలాంటి తప్పిదాలు చేయవద్దునని హెచ్చరించారు. పూజలు సరిగా చేయాలని, రూపాలు మార్చవద్దని స్వర్ణలత ద్వారా అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. నా సొమ్మును దొంగలు దోచినట్లు దోచేస్తున్నారు. మీరు నాకు ఇచ్చేది ఏంటి. ఇంతా నాదే. నా దగ్గరి నుంచి మీరు అన్ని దోచుకుంటున్నారంటూ అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇకనైనా కళ్లు తెరవాలని కుండపోత వర్షాలు కురిపించానని చెప్పారు. నా ప్రజలకు ఈ విషయం తెలియాలని, వారంత కళ్లారా వాస్తవం గ్రహించాలని ఇలా చేశానంటూ స్వర్ణలతతో అమ్మవారు చెప్పించారు.

Also Read: Tirumala Important: తిరుమల క్యూలైన్లో భక్తులు అస్వస్థతకు గురైతే ఏం చేయాలి ! ప్రాణాలు ఎలా రక్షించుకోవాలంటే !

బోనాలు సమర్పణ..
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ కుటుంబ సభ్యులు ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మహిళలు, యువతులు నెత్తిన బోనాలతో వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు.  నిన్న ఎమ్మెల్సీ కవిత సైతం బంగారు బోనం సమర్పించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు కవిత చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nani HIT 3 Telugu Trailer Reaction | జనాల మధ్యలో ఉంటే  అర్జున్..మృగాల మధ్యలో ఉంటే సర్కార్ | ABP DesamVirat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీRohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదేKarun Nair vs Bumrah Fight | Dc vs MI IPL 2025 మ్యాచ్ లో బుమ్రా వర్సెస్ కరుణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Shaik Rasheed : మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
New Toll System: టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Pawan Wife: పవన్ సతీమణి భక్తికి అంతా ఫిదా - అన్నా లెజ్‌నోవాకు అంతా  ఫ్యాన్స్ అయిపోయారుగా !
పవన్ సతీమణి భక్తికి అంతా ఫిదా - అన్నా లెజ్‌నోవాకు అంతా ఫ్యాన్స్ అయిపోయారుగా !
Embed widget