అన్వేషించండి

Telangana: కాంగ్రెస్‌లో చేరేందుకు క్యూ కడుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు- రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటీ?

BRS MLAs Join Congress:కేటీఆర్ కోరుకున్నదే జరుగుతోంది. ఆయన చెప్పినట్టే సీఎం రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో చేరుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది.

Hyderabad News: బీఆర్‌ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే 14 మంది ప్రజాప్రతినిధులు పార్టీ మారగా... ఇప్పుడు మరికొందరు అదే లైన్‌లో ఉన్నారు. ఇవాళ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శనివారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హస్తం గూటికి చేరనున్నారు. ఇదే బాటలో మరో ఆరేడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారనే టాగ్ బలంగా వినిపిస్తోంది. 

పార్టీ నేతల వలస కట్టడికి బీఆర్‌ఎస్ అధినాయకత్వం చేస్తున్న కట్టడి ఎలాంటి ఫలితం ఇవ్వడం లేదు. ఫిరాయింపులు నిరోధించేందుకు కోర్టుల్లో పోరాటం, నేతలను బుజ్జగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ప్రభావం చూపడం లేదు. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న వారంతా ఇప్పుడు పార్టీ ఫిరాయించడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. 

తాజాగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని ఎమ్మెల్యేలంతా పార్టీ మారడానికి సిద్ధపడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ చేరికను కన్ఫామ్ చేశారు. అదే బాటలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఉన్నారు. వచ్చే వారంలో రోజుల్లో వలస తీవ్ర మరింత ఎక్కువగా ఉంటుందని ఇరు పార్టీల నాయకులు అంటున్నారు. 

పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యేలు తమ సన్నిహితులతో మాట్లాడుతున్నారు. ఫోన్‌లలో ప్రత్యేక మీటింగ్‌లు పెట్టుకొని పార్టీ మార్పు, ఇతర పరిణామాలపై చర్చించుకుంటున్నారు. వారి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ కాంగ్రెస్‌లో చేరారు. ఎంపీ స్థానానికి కేకే రాజీనామా చేయడం ఆమోదం కూడా జరిగిపోయింది. మిగతా వాళ్లు మాత్రం రాజీనామాలపై నోరు ఎత్తడం లేదు. 

ఈ మధ్య కాలంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ అధికార పార్టీ అక్రమంగా తమ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుంటుందని ఆరోపించారు. గతంలో తాము పార్టీ ఎల్పీలను మాత్రమే పార్టీలో విలీనం చేశామని ఎమ్మెల్యేలను చేర్చుకోలేదని అది ఫిరాయింపు కాదని అంటున్నారు. అదే సూత్రాన్ని కాంగ్రెస్‌ పాటించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 12 మందిని చేర్చుకొని సీఎల్పీని విలీనం చేసుకున్నారు. ఇప్పుడు అదే ఫార్ములాను రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారట. 

ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 38 ఎమ్మెల్యేలను గెలిచింది. వీరిలో ఇప్పటికే ఏడుగురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇప్పుడు మరో ఆరేడుగురు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇలా 26 మందిని అంటే 2/3 వంతును కాంగ్రెస్‌లో చేర్చుకొని బీఆర్‌ఎస్‌ ఎల్పీని విలీనం చేయించాలని చూస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, ఆ బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, నిర్వాసితుల బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
HYDRA: రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు -  హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు - హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
Tamilnadu Politics :  విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
New DSC In Telangana: కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనంతమిళనాడు డిప్యుటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్, ప్రకటించిన డీఎమ్‌కేకేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, ఆ బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, నిర్వాసితుల బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
HYDRA: రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు -  హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు - హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
Tamilnadu Politics :  విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
New DSC In Telangana: కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Virus Attack: ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం- విజయవాడ, గుంటూరు, విశాఖలో కేసులు
ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం- విజయవాడ, గుంటూరు, విశాఖలో కేసులు
Mithun Chakraborty: బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు... అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు... అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం
Tesla Workers : సిక్ ‌లీవులు పెడితే ఇంటికి మేనేజర్లు - టెస్లా ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్న ఎలన్ మస్క్
సిక్ ‌లీవులు పెడితే ఇంటికి మేనేజర్లు - టెస్లా ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్న ఎలన్ మస్క్
Mohammed Siraj Catch: కళ్లు చెదిరిపోయాయ్ వర్మ, సిరాజ్ మియా! అదరగొట్టావయ్యా
కళ్లు చెదిరిపోయాయ్ వర్మ, సిరాజ్ మియా! అదరగొట్టావయ్యా
Embed widget