అన్వేషించండి

MMTS Services : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ - చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్ సర్వీస్ లు

MMTS Services : చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్ సర్వీస్ లను నడపనున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రకటించారు. మరి కొన్ని నెలల్లో ఇవి అందుబాటులోకి వస్తాయన్నారు.

MMTS Services : ప్రయాణికులకు దక్షిమ మధ్య రైల్వే ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే చర్లపల్లి నుంచి పలు రైళ్లు నడుస్తుండగా.. త్వరలో ఎంఎంటీఎస్ సర్వీస్ లను మరింత పెంచనున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway) జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రకటించారు. ప్రస్తుతం చర్లపల్లి నుంచి ఒక ఎంఎంటీస్ నడుస్తుండగా.. మరో 4, 5 నెలల్లో ఈ సర్వీసులను మరిన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. సికింద్రాబాద్ - గుంటూరు మార్గంలో డబ్లింగ్ పూర్తయితే మరికొన్ని రైళ్లు నడిపే వెసులుబాటు ఉంటుందని, మరో పక్క ఎక్స్ ప్రెస్ రైళ్లలోనూ జనరల్ బోగీల సంఖ్యను దశలవారీగా పెంచేందుకు పనులు సాగుతున్నాయని తెలిపారు.

ప్రయాణికుల డిమాండ్ కు అనుగుణంగా..

రైల్ నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనుల నేపథ్యంలో 10 జతల రైళ్లను తరలించనున్నామని తెలిపారు. ఈ రైళ్లకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులుంటాయన్నారు. హైదరాబాద్ స్టేషన్, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులతో తలెత్తే ఒత్తిడిని తగ్గించేందుకు మరిన్ని రైళ్లను చర్లపల్లి నుంచి నడపాలని నిర్ణయించామని చెప్పారు. ప్రయాణికుల డిమాండ్ కు అనుగుణంగా చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్ లు నడుపుతామని స్పష్చం చేశారు. చార్మినార్, గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ లను మార్చి నుంచి నడుపుతామని, మే నెలాఖరుకల్లా మరో 8 జతల రైళ్లను నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జైన్ చెప్పారు.

ఘట్ కేసర్ - యాదాద్రి ఎంఎంటీఎస్ లైన్

ఘట్ కేసర్ - యాదాద్రి ఎంఎంటీఎస్ లైన్ కోసం రూ.650 కోట్లు ఖర్చవుతుందని, దీనికి సంబంధించిన డీపీఆర్ ఇప్పటికే సిద్ధం చేశామని జైన్ అన్నారు. త్వరలో ఈ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి, తెలంగాణ ప్రభుత్వం రూ.491 కోట్లు బకాయి పడిందని తెలిపారు. ప్రస్తుతం మౌలాలి నుంచి ఘట్‌కేసర్‌ వరకు ఎంఎంటీఎస్ ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి యాదగిరిగుట్టకు కొత్తగా మూడో లైను వేయాల్సి ఉంది. ఇది పూర్తయితే కేవలం రూ.20 ఛార్జీతో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు చేరుకోవచ్చు. ఇక రాష్ట్రంలో చేపట్టిన అమృత్ స్టేషన్ల (Amrit Stations) అభివృద్ది పనులు వచ్చే ఏడాది చివరి వరకు పూర్తవుతాయన్నారు. పింక్ బుక్ ను పార్లమెంటులో ఇంకా ప్రవేశపెట్టకపోవడంతో రైల్వే బడ్జెట్ కేటాయింపుల వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని జైన్ చెప్పారు. ప్రాజెక్టులు, సర్వేలు, డీపీఆర్ లు, సౌకర్యాలు వంటి అంశాలన్నీ పింక్ బుక్ లోనే ఉంటాయన్నారు.

ఇక ఈ సారి రైల్వే బడ్జెట్ (Railway Budget)లో తెలుగు రాష్ట్రాలకు భారీగానే కేటాయింపులున్నాయి. ఏపీకి రూ.9.417 కోట్లు, తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయించామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే కాజీపేటలో రైల్వే ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు.

Also Read : Ashwini Vaishnav: ఏపీకి రైల్వే శాఖ భారీ శుభవార్త - తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన

టాప్ హెడ్ లైన్స్

Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Breaking News: పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 
పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Asifabad Forest Officials Attack Case: సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Embed widget