అన్వేషించండి

MMTS Services : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ - చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్ సర్వీస్ లు

MMTS Services : చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్ సర్వీస్ లను నడపనున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రకటించారు. మరి కొన్ని నెలల్లో ఇవి అందుబాటులోకి వస్తాయన్నారు.

MMTS Services : ప్రయాణికులకు దక్షిమ మధ్య రైల్వే ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే చర్లపల్లి నుంచి పలు రైళ్లు నడుస్తుండగా.. త్వరలో ఎంఎంటీఎస్ సర్వీస్ లను మరింత పెంచనున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway) జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రకటించారు. ప్రస్తుతం చర్లపల్లి నుంచి ఒక ఎంఎంటీస్ నడుస్తుండగా.. మరో 4, 5 నెలల్లో ఈ సర్వీసులను మరిన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. సికింద్రాబాద్ - గుంటూరు మార్గంలో డబ్లింగ్ పూర్తయితే మరికొన్ని రైళ్లు నడిపే వెసులుబాటు ఉంటుందని, మరో పక్క ఎక్స్ ప్రెస్ రైళ్లలోనూ జనరల్ బోగీల సంఖ్యను దశలవారీగా పెంచేందుకు పనులు సాగుతున్నాయని తెలిపారు.

ప్రయాణికుల డిమాండ్ కు అనుగుణంగా..

రైల్ నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనుల నేపథ్యంలో 10 జతల రైళ్లను తరలించనున్నామని తెలిపారు. ఈ రైళ్లకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులుంటాయన్నారు. హైదరాబాద్ స్టేషన్, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులతో తలెత్తే ఒత్తిడిని తగ్గించేందుకు మరిన్ని రైళ్లను చర్లపల్లి నుంచి నడపాలని నిర్ణయించామని చెప్పారు. ప్రయాణికుల డిమాండ్ కు అనుగుణంగా చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్ లు నడుపుతామని స్పష్చం చేశారు. చార్మినార్, గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ లను మార్చి నుంచి నడుపుతామని, మే నెలాఖరుకల్లా మరో 8 జతల రైళ్లను నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జైన్ చెప్పారు.

ఘట్ కేసర్ - యాదాద్రి ఎంఎంటీఎస్ లైన్

ఘట్ కేసర్ - యాదాద్రి ఎంఎంటీఎస్ లైన్ కోసం రూ.650 కోట్లు ఖర్చవుతుందని, దీనికి సంబంధించిన డీపీఆర్ ఇప్పటికే సిద్ధం చేశామని జైన్ అన్నారు. త్వరలో ఈ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి, తెలంగాణ ప్రభుత్వం రూ.491 కోట్లు బకాయి పడిందని తెలిపారు. ప్రస్తుతం మౌలాలి నుంచి ఘట్‌కేసర్‌ వరకు ఎంఎంటీఎస్ ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి యాదగిరిగుట్టకు కొత్తగా మూడో లైను వేయాల్సి ఉంది. ఇది పూర్తయితే కేవలం రూ.20 ఛార్జీతో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు చేరుకోవచ్చు. ఇక రాష్ట్రంలో చేపట్టిన అమృత్ స్టేషన్ల (Amrit Stations) అభివృద్ది పనులు వచ్చే ఏడాది చివరి వరకు పూర్తవుతాయన్నారు. పింక్ బుక్ ను పార్లమెంటులో ఇంకా ప్రవేశపెట్టకపోవడంతో రైల్వే బడ్జెట్ కేటాయింపుల వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని జైన్ చెప్పారు. ప్రాజెక్టులు, సర్వేలు, డీపీఆర్ లు, సౌకర్యాలు వంటి అంశాలన్నీ పింక్ బుక్ లోనే ఉంటాయన్నారు.

ఇక ఈ సారి రైల్వే బడ్జెట్ (Railway Budget)లో తెలుగు రాష్ట్రాలకు భారీగానే కేటాయింపులున్నాయి. ఏపీకి రూ.9.417 కోట్లు, తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయించామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే కాజీపేటలో రైల్వే ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు.

Also Read : Ashwini Vaishnav: ఏపీకి రైల్వే శాఖ భారీ శుభవార్త - తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
Harish Rao vs Revanth Reddy: హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
Diet for Weight Loss : ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ డైట్ ఇదే.. కానీ నెలలో 5 నుంచి 10 కేజీల బరువు తగ్గిస్తుందట, ఎందుకంటే
ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ డైట్ ఇదే.. కానీ నెలలో 5 నుంచి 10 కేజీల బరువు తగ్గిస్తుందట, ఎందుకంటే
Bihar CM: బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
Embed widget