By: ABP Desam | Updated at : 08 May 2023 07:04 PM (IST)
సభలో మాట్లాడుతున్న ప్రియాంక గాంధీ
తెలంగాణలో ప్రతి వ్యక్తిపై వేల కోట్ల రూపాయల అప్పు ఉందని, రాష్ట్ర డబ్బు, సంపద అంతా ఎక్కడికి పోయిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. తెలంగాణలో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, ప్రభుత్వాన్ని ఎన్నుకునేటప్పుడు అప్రమత్తతో ఉండాలని సూచించారు. లేదంటే ప్రజలే నష్టపోతారని చెప్పారు. గడిచిన రెండు వారాలుగా తాను కర్ణాటకలో ప్రచారంలో పాల్గొన్నానని అన్నారు. హైదరాబాద్ సరూర్ నగర్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ యువ సంఘర్షణ సభలో పాల్గొని ప్రసంగించారు.
‘‘ఈ రాష్ట్రం వాళ్ల జాగీరు అనుకుంటున్నారు. జాగీర్దార్లు అనుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఏ ప్రభుత్వం వచ్చినా మంచి జరుగుతుందని అందరూ నమ్మారు. ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం ఇస్తానని అప్పట్లో కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయి. వారిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? గత 9 ఏళ్లలో 12 రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఒక్క ఖాళీని కూడా భర్తీ చేయలేదు. ఒక్క ప్రభుత్వ వర్సిటీలో కూడా ఉద్యోగ నియామకాలు జరగలేదు.’’ అని ప్రియాంక అన్నారు.
జై బోలో తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభం
జై బోలో తెలంగాణ అంటూ ప్రియాంక గాంధీ ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ అంటే ఒక భూమి ముక్క కాదు. మీరు తెలంగాణను తల్లితో సమానంగా చూస్తారు. ఇది అత్యంత పవిత్రమైన అంశం. తెలంగాణ అమరవీరులు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. యువత ఆశలను నెరవేర్చడానికి తెలంగాణ ఏర్పాటు అయింది. నీరు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించారు. రాష్ట్రంలో యువత త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నారు.
నిరుద్యోగ భృతి ఇస్తున్నారా?
బీఆర్ఎస్ ప్రభుత్వం యువకులకు 3 వేల భృతి ఇస్తాం అన్నారు. ఇచ్చారా? 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ లేదు.. భృతి లేదు. చాలా హామీలు ఇచ్చారు. ఒక్కటి నెరవేరలేదు. తక్కువ మంది పాఠశాలలో చేరుతున్నారు. పాఠశాలలో సౌకర్యాలు లేవు. తెలంగాణ మీది. మీ త్యాగాల వల్ల వచ్చింది.. తెలంగాణను బాగు చేస్కోవడం మీమీద ఎక్కువ బాధ్యత ఉంది. మీరు చైతన్యంతో ఉండి పని చేయాలి.. లేకపోతే నష్టపోయేది యువతనే.
Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!
తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!
TS PGECET: జూన్ 8న తెలంగాణ పీజీఈసెట్ ఫలితాల వెల్లడి, రిజల్ట్ టైమ్ ఇదే!
BRS News: బీఆర్ఎస్లో చేరిన 50 మంది మహారాష్ట్ర సర్పంచ్లు, మధ్యప్రదేశ్ కీలక వ్యక్తి కూడా
Civils Coaching: సివిల్స్ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం, వీరు అర్హులు!
YS Viveka Case : వివేకా లెటర్కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి
Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!
Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!
10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!