అన్వేషించండి

Koppula Eshwar: బీజేపీకి దళితులపై ప్రేమ ఉంటే మేనిఫెస్టోలో ఆ ఒక్కటి చేర్చండి - కొప్పుల ఈశ్వర్

Koppula Eshwar: దళితులపై బీజేపీకి నిజంగా ప్రేమ ఉంటే.. మేనిఫెస్టోలో దళితబంధు పెట్టాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. దేశ వ్యాప్తంగా దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని సూచించారు.  

Koppula Eshwar: దళితులపై బీజేపీ పార్టీలకు, కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ప్రేమ ఉంటే.. దేశ వ్యాప్తంగా ఉన్న దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రకటించబోయే మేనిఫెస్టోలో దళితబంధు పెట్టాలని సూచించారు. ఈ రెండు చేస్తే బీజేపీకి నిజంగానే దళితులపై ప్రేమ ఉందని నమ్ముతానని చెప్పారు. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ ఎల్.రమణతో కలిసి ఆయన మాట్లాడుతూ బీజేపీపై ఫైర్ అయ్యారు. దేశంలో దుర్మార్గ పాలన నడుస్తోందని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. 

మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు.. 
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయని అలాగే సామాజిక బహిష్కరణలు కూడా జరుగుతున్నాయని మంత్రి ఈశ్వర్ తెలిపారు. ఉత్తర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. బీజేపీకి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై ప్రేమ ఉండదని మంత్రి కొప్పుల తెలిపారు. దళిత బంధు నిర్ణయం తీసుకొని సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో దళితబంధుపై సమీక్షలు జరుపుతామని అన్నారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు తెలగాణ విలీన దినోత్సవాన్ని వాడుకోవాలని చూసిందని కొప్పుల విమర్శించారు. 

దిల్లీ నుంచి గల్లీకొచ్చి మోదీ ఫొటో అడుగుతున్నారు.. 
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆరోపించారు. దిల్లీ నుంచి గల్లీకి వచ్చి ప్రధాని మోదీ ఫొటో పెట్టమని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ లో ఆయన ఫొటో పెట్టారా అని ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఉపయోగిస్తే మోదీ ఫొటో పెట్టాల్సిందేనని కేంద్ర మంత్రి మాట్లాడటంలో ఔచిత్యం లేదన్నారు. తెలంగాణకు వచ్చి మూడు విమర్శలు, ఆరు అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేస్తామంటే ఇక్కడి తెలంగాణ సమాజం ఊరుకోదని అన్నారు. కష్టపడి పని చేసే ఐఏఎస్ అధికారిపై పైర్ అవ్వడం సరైన పద్దతి కాదని మెతుకు ఆనంద్ అన్నారు. 

మంత్రి కేటీఆర్ ఫైర్.. 
తెలంగాణ అప్పులపై కేంద్ర ఆర్థికశాఖ నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేంద్రం చేసిన అప్పులపై ఘాటుగా స్పందించిన కేటీఆర్ ట్వీట్ చేశారు. 2014 ముందు 67ఏళ్ల  స్వతంత్ర దేశంలో 14 మంది ప్రధానులు మారినా దేశం అప్పు రూ.56 లక్షల కోట్లు మాత్రమే అన్నారు. కానీ బీజేపీ అధికారం చేపట్టిన గత ఎనిమిదేళ్లలో రూ.100 లక్షల కోట్లకు అప్పు పెరిగిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం వల్ల ప్రతి భారతీయుడిపై రూ.1.25 లక్షల అప్పు ఉందన్నారు. ఆర్థిక విషయాలపై అనర్గళంగా మాట్లాడుతున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్రం అప్పులపై మాట్లాడాలన్నారు.   2022లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు అయితే జాతీయ తలసరి ఆదాయం కేవలం రూ.1.49 లక్షలుగా ఉందన్నారు.  తెలంగాణ జీఎస్‌డీపీ కేవలం 23.5 శాతంగా ఉందన్నారు. దేశ జనాభాలో 2.5 శాతంగా ఉన్న తెలంగాణ దేశ జీడీపీలో ఐదు శాతం వాటా కలిగి ఉందన్నారు.

బీజేపీ పాలిత ప్రాంతాలు తెలంగాణ కన్న మెరుగ్గా పనిచేస్తే భారత్‌ 4.6 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమికి ఎదిగేదని కేటీఆర్‌ చురకలు అంటించారు. తెలంగాణ పన్నుల ద్వారా కేంద్రానికి ఇస్తున్న ప్రతీ రూపాయిలో కేవలం రూ.0.46 పైసలు మాత్రమే తిరిగి ఇస్తున్నారని ఆరోపించారు. మిగిలిన డబ్బులు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారని, ఆ రాష్ట్రాల్లోని పీడీఎస్ షాపుల వద్ద థ్యాంక్స్ టు తెలంగాణ అనే బోర్డులు పెడతారా? అని నిర్మలా సీతారామన్ ను ప్రశ్నించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP CV Anand: తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ నియామకం-క్రికెట్ మైదానం నుంచి పోలీస్‌ బాస్ వరకు ప్రస్థానం ఇదే!
తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ నియామకం-క్రికెట్ మైదానం నుంచి పోలీస్‌ బాస్ వరకు ప్రస్థానం ఇదే!
Telangana SSC Results 2026: వాట్సాప్‌లోనూ తెలంగాణ 10వ తరగతి ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండి
వాట్సాప్‌లోనూ తెలంగాణ 10వ తరగతి ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండి
Ashu Reddy Petition : హైకోర్టుకు అషు రెడ్డి - పోలీసులు వన్ సైడ్‌గా వ్యవహరించారా?
హైకోర్టుకు అషు రెడ్డి - పోలీసులు వన్ సైడ్‌గా వ్యవహరించారా?
Moinabad Farmhouse Drug Case: మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణాం.. రోహిత్‌ రెడ్డికి హైకోర్టు హైకోర్టు బెయిల్
మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణాం.. రోహిత్‌ రెడ్డికి హైకోర్టు హైకోర్టు బెయిల్

వీడియోలు

RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు
Virat Kohli 9000 Runs in IPL | ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ విశ్వరూపం
DC vs RCB IPL 2026 Powerplay | పవర్ ప్లే లో చేతులెత్తేసిన ఢిల్లీ
Mitchell Santner Ruled Out IPL 2026 | ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్
Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Elections 2026:నువ్వు సింగం అయితే నేను పుష్ప! టీఎంసీ నేత, యూపీ పోలీస్ అధికారి మధ్య వార్!
నువ్వు సింగం అయితే నేను పుష్ప! టీఎంసీ నేత, యూపీ పోలీస్ అధికారి మధ్య వార్!
CM Revanth Reddy: గేట్స్, మస్క్ కూడా పెట్టుబడులు పెట్టకపోతే బాధపడతారు - ఫ్యూచర్ సిటీపై రేవంత్ నమ్మకం
గేట్స్, మస్క్ కూడా పెట్టుబడులు పెట్టకపోతే బాధపడతారు - ఫ్యూచర్ సిటీపై రేవంత్ నమ్మకం
Gas Cylinder Booking Rules: మే 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ బుకింగ్‌ రూల్స్‌లో మార్పులు! వీళ్లకు సిలిండర్స్ కట్!
మే 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ బుకింగ్‌ రూల్స్‌లో మార్పులు! వీళ్లకు సిలిండర్స్ కట్!
Amaravati Latest News:ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కేంద్రం! అమరావతి పనులకు డీజిల్ సరఫరాకు రెడ్‌ సిగ్నల్ !
ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కేంద్రం! అమరావతి పనులకు డీజిల్ సరఫరాకు రెడ్‌ సిగ్నల్ !
Life After Breakup : బ్రేకప్ తర్వాత మానసికంగా వీక్ అయ్యారా? మెంటల్‌గా స్ట్రాంగ్‌గా అయ్యేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
బ్రేకప్ తర్వాత మానసికంగా వీక్ అయ్యారా? మెంటల్‌గా స్ట్రాంగ్‌గా అయ్యేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
KCR Students Plan: విద్యార్థులతోనే బీఆర్ఎస్ పునర్‌నిర్మాణం - కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
విద్యార్థులతోనే బీఆర్ఎస్ పునర్‌నిర్మాణం - కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
Bengal election polling: బెంగాల్‌లో రెండో విడత పోలింగ్‌‌కకు సర్వం సిద్ధం - మోదీ వర్సెస్ దీదీ - ఎవరిది పైచేయి?
బెంగాల్‌లో రెండో విడత పోలింగ్‌‌కకు సర్వం సిద్ధం - మోదీ వర్సెస్ దీదీ - ఎవరిది పైచేయి?
TN 2026 OTT: నాలుగు ఓటీటీల్లోకి టీఎన్ 2026... విజయ్‌ను టార్గెట్ చేశారనుకున్నా... కలెక్షన్స్ నిల్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నాలుగు ఓటీటీల్లోకి టీఎన్ 2026... విజయ్‌ను టార్గెట్ చేశారనుకున్నా... కలెక్షన్స్ నిల్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget