అన్వేషించండి

Minister Indrakaran Reddy: అటవీ సంరక్షణ,  పునరుద్దరణ పనుల్లో మనమే ముందున్నాం - ఇంద్రకరణ్ రెడ్డి

Minister Indrakaran Reddy: తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉందని దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

Minister Indrakaran Reddy: తెలంగాణ రాష్ట్రం దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని... యూపీ అటవీ శాఖ మంత్రి కుడా తెలంగాణలోని పచ్చదనాన్ని చూసి అబ్బురపడ్డారని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉందని దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని, తెలంగాణలో పర్యటించిన కేంద్ర మంత్రులు, సీఎం లు, ఇతర రాష్ట్రాల మంత్రులు, ప్రతినిధులు పచ్చదనం పెంపుకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయంటూ కితాబునిస్తున్నారని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిన్న తెలంగాణలో పర్యటించిన ఉత్తర ప్రదేశ్ అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్... హరిత హారంలో నాటిన మొక్కలు, అటవీ పునరుద్ధరణ పనులు  బాగున్నాయని అభినందించారని తెలిపారు. 

అమరవీరులకు మంత్రి నివాళి.. 
అడవులను, వణ్యప్రాణులను కాపాడే క్రమంలో అటవీశాఖ సిబ్బంది కనబరిచిన త్యాగాలకు విలువ కట్టలేమని మంత్రి అన్నారు. అట‌వీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా  మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అమ‌రుల‌కు ఘనంగా నివాళి అర్పించారు. అటవీ అభివృద్ది సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతి కుమారి, పీసీసీఎఫ్‌ ఆర్, ఎం. డొబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైశ్వాల్,  అటవీ శాఖ సలహాదారు ఆర్.శోభ, రిటైర్డ్ పీసీసీఎఫ్ లు పీ. మల్లిఖార్జున్ రావు, మునీంద్ర,  ఇతర అధికారులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్  పార్కు వ‌ద్ద స్మారక చిహ్నంపై పుష్పగుచ్చాలు ఉంచి అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. అమరులైన అటవీ అధికారుల సేవలను గుర్తు చేసుకున్నారు.

ధైర్య సాహసాలతో విధుల నిర్వహణ.. 
1984వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 21 మంది అటవీ అధికారులు ధైర్య సాహసాలతో, అంకిత భావంతో ప‌ని చేస్తూ అటవీ సంపదను కాపాడటంలో తమ ప్రాణాలు కోల్పోయారని మంత్రి అన్నారు. ప్రకృతి వనరులను రక్షించడంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నిరంతర సేవలందిస్తున్నారని తెలిపారు. వన్య ప్రాణులు, స్మగ్లర్లు అడవుల్లో ఉన్నప్పటికీ, భూ ఆక్ర‌మ‌ణ‌దారులు దాడులు జ‌రుపుతున్న‌ప్ప‌టికీ భయపడకుండా, అన్నింటినీ ఛాలెంజ్‌ గా తీసుకుని తమ ప్రాణాల‌ను సైతం లెక్క చేయకుండా అట‌వీ అధికారులు, సిబ్బంది పనిచేస్తుండటం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రకృతి వనరులను కాపాడ‌టం, వ‌న్య‌ ప్రాణుల‌ సంరక్షణకు వారు ఎంతో ‌శ్ర‌మిస్తున్నారని, ఈ క్రమంలో ఎంతో మంది అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బంది తమ ప్రాణాలను సైతం కొల్పోయారని వెల్లడించారు. వారందరికీ అటవీ శాఖ తరపున నివాళులర్పిస్తున్నానని ప్రకటించారు.

అటవీ సంపద కాపాడేందుకు నిబ్ధతతో కృషి.. 
అటవీ సంరక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఇప్పటికే అటవీ సంపదను కాపాడే విషయంలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేస్తున్నారని అభినందించారు. అమరులైన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అటవీశాఖ పనితీరును మంత్రి వివరించారు. 2021- 2022వ‌ సంవత్సరంలో అటవీ అధికారులు అటవీ రక్షణలో భాగంగా మొత్తం 11,669 కేసులను నమోదు చేసి, రూ.14.07 కోట్ల జరిమానాను విధించారు. రూ. 7.31 కోట్ల విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్నారు. 1634 వాహనాలను జప్తు చేశారు. 1133 అటవీ భూ ఆక్రమణ కేసులు నమోదు చేశారని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

అటవీ శాఖను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగుల‌ను, సిబ్బంది నియామ‌కాల‌ను ఎప్ప‌టికప్పుడు భ‌ర్తీ చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ సంవ‌త్స‌రం 92 ఫారెస్ట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్లు (FSO's) 14 ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్లు (FROs), 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీస‌ర్ల (FBO's) ఉద్యోగాల నియామకాల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తినిచ్చింది. అంతే కాకుండా అటవీ అధికారులు, సిబ్బందికి 2173 వాహనాలను అందజేసింది. జంగిల్ బచావో - జంగిల్ బడావో నినాదం ద్వారా ఇప్పటికే ఉన్న అడవుల రక్షణతో పాటు క్షీణించిన అడవుల పునరుజ్జీవనం కొరకు ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో పెద్ధ ఎత్తున చర్యలు తీసుకొంటున్నామని మంత్రి తెలిపారు.

ఇప్పటివరకు 268.75 కోట్ల మొక్కలు.. 
ముఖ్యమంత్రి  కె.చంద్ర‌శేఖ‌ర్ రావు మార్గనిర్దేశనం మేర‌కు పోలీస్ శాఖ స‌హ‌కారంతో అడవుల రక్షణ మరియు స్మగ్లింగ్ కార్యకలాపాలను అరికట్టడం కోసం అనేక సమగ్ర చర్యలు ప్రారంభించబడ్డాయని మంత్రి వెల్లడించారు. అడ‌వుల ర‌క్ష‌ణ‌తో పాటు తాగు నీటి కోసం వన్యప్రాణులు జనారణ్యంలోకి రాకుండా ప‌టిష్ట‌మైన‌ చర్యలు తీసుకుంటున్నాం. శాఖాహార జంతువుల‌ కోసం గ‌డ్డి క్షేత్రాల‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అడవి సరిహద్దులు సరి చూసుకొని పెంపుడు జంతువులు, పశువులను నియంత్రించే కందకాలను 10,732 కి.మీ పొడవున త్రవ్వి దీనిపై గచ్చకాయ మొక్కలు నాటుట ద్వారా అడవి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రపంచంలోనే పచ్చదనం పెంపుదలలో మూడవ అది పెద్ద మానవ ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన  “తెలంగాణకు హరితహారం పథకం” ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు  268.75 కోట్లకు పైగా మొక్కలను నాటామని మంత్రి వెల్లడించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Desam Smart Ed Conclave 2026: స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
ABP Desam Smart Ed Conclave 2026: AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
Telangana Latest News: సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget