అన్వేషించండి

Harish Rao: సొంత జాగా ఉంటే డబ్బులిస్తాం, ఇల్లు కట్టుకోవచ్చు: హరీశ్ రావు, ఎప్పటినుంచంటే

తెలంగాణ రాష్ట్రంలో దసరా నాటికి సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లు కట్టుకునేందుకు నిధులు ఇస్తామని హరీశ్ రావు వెల్లడించారు.

Harish Rao News: తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మందికి పైగా పింఛన్లు ఇస్తున్నామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో ఎంత మంది పెన్షన్లకు అర్హులుగా ఉంటే అంత మందికి పింఛన్లు ఇవ్వాలని సీఎం చెప్పారు. సంగారెడ్డిలో పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో పింఛనుదారులకు స్మార్ట్​ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఏ తోడూ లేని పెద్ద వారికి, ఒంటరి మహిళలకు పింఛను, రేషన్ బియ్యం భరోసా ఇస్తున్నాయని అన్నారు. అలాంటిది ఉచితాలు ఆపేయాలని కేంద్రంలోని బీజేపీ చెబుతోందని అన్నారు. కార్పొరేట్ వ్యాపారులకు రూ.వేల కోట్లు మాఫీ చేస్తూ పేదలకు ఉచిత పథకాలు ఇవ్వొద్దని చెప్తున్నారని విమర్శించారు. అన్ని వస్తువులపై ధరలు పెంచి పేదలపై భారం మోపుతున్నారని విమర్శించారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.వెయ్యి దాటిందని, దాంతో పేదలు వంట గ్యాస్ కొనలేకపోతున్నారని అన్నారు. రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తామని చెప్పిన హామీని నెరవేర్చామని అన్నారు.

ఇంటి స్థలం ఉన్నవారికి నిధులు ఇస్తాం - మంత్రి
తెలంగాణ రాష్ట్రంలో దసరా నాటికి సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లు కట్టుకునేందుకు నిధులు ఇస్తామని హరీశ్ రావు వెల్లడించారు. రూ.3 లక్షలు సొంత స్థలం ఉంటే ఇస్తామని అన్నారు. రైతులకు, నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుంటే, కేంద్రం ఉచితాలు ఇవ్వొద్దని చెబుతుందని హరీశ్ ​రావు విమర్శించారు. ఏడాదిలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. బీజేపీ నాయకులవి మాటలు తప్ప చేతలు లేవని హరీశ్ రావు వ్యాఖ్యలు చేశారు.

ఏ విషయంలో అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట తప్పబోరని మంత్రి హరీష్ రావు అన్నారు. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉన్న కర్ణాటకలో కూడా తెలంగాణలో ఇచ్చినంత పెన్షన్ ఇవ్వడం లేరని అన్నారు. పెన్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

రెండు మూడు రోజుల్లో గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌ వస్తుందని హరీశ్ రావు తెలిపారు. రాబోయే వారం రోజుల్లో 28 వేల ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. ఇప్పటికి 52 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని వెల్లడించారు.

అంతకుముందు, సంగారెడ్డి జిల్లాలోని నందికంది‌ గ్రామంలో గల రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని‌ హరీశ్‌ రావు సందర్శించి పూజలు‌ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 శతాబ్దం నాటి దేవాలయం నంది కొండలో ఉండటం గొప్ప విషయం అని అన్నారు. ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరిక మేరకు 25 లక్షల రూపాయలు తక్షణం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల్లో జీవో కాపీ అందిస్తామని అన్నారు. ఆర్కియాలజీ డిపార్ట్‌ మెంట్‌తో కూడా సమావేశమై ఇంకా ఎలా అభివృద్ధి చేయాలో ప్రణాళికలు రూపొందిస్తామని హరీశ్ రావు అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sunitha Files Nomination | వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూCongress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Embed widget