News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Medchal News: నారాయణ కాలేజీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి

Medchal News: మేడ్చల్ జిల్లా బాచుపల్లి నారాయణ కాలేజీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 

FOLLOW US: 
Share:

Medchal News: మేడ్చల్ జిల్లా బాచుపల్లి నారాయణ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డికి చెందిన 16 ఏళ్ల రాగుల వంశిత అనే విద్యార్థిని వారం క్రితమే నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో జాయిన్ చేశారు. అయితే వంశిత ఈరోజు అనుమానాస్పద స్థితిలో కింద పడి మృతి చెందింది. విషయం గుర్తించిన విద్యార్థినులు అక్కడే ఉన్న వార్డెన్లు, ఉపాధ్యాయులకు తెలిపారు. వెంటనే  కళాశాల యాజమాన్యం బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతిపై ఆరా తీస్తున్నారు. వంశిత బిల్డింగ్ పై నుండి దూకిందా, లేక ఇతర కారణాలు వల్ల ఏమైనా చనిపోయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఐదు రోజుల  క్రితమే విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ లోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. భరత్ నగర్ బస్తీలో నవ్య అనే ఇంటర్ సెకండియర్ విద్యార్థి జూన్ ఏడవ తేదీ రాత్రి 7:30 గంటలకు ఉరి వేసుకుని విద్యార్థిని నవ్య ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు స్పందిస్తూ.. తమ కూతురుది ఆత్మహత్య కాదని ఎవరో ప్రతి రోజు రాత్రి ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు చేశారని అందువల్లే తమ కూతురు బలవన్మరణానికి పాల్పడిందని ఆరోపించారు. గత నాలుగు రోజులుగా తమ ఇంటి ముందు నిమ్మకాయలు, అగరుబత్తులు, కొబ్బరికాయలు పెట్టి వెళ్తున్నారని నవ్య కుటుంబ సభ్యుల ఆరోపణలు చేశారు. కేసు నమోదు చేసుకుని కుల్సుంపుర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జూన్ 5వ తేదీ నుంచి బీడీఎస్ స్టూడెంట్ మృతి

వరంగల్ జిల్లాకు చెందిన సముద్రాల మానస ఖమ్మంలో మమతా మెడికల్ కాలేజీలో బీడీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. కాలేజీకి సమీపంలో ఉన్న హాస్టల్ లో ఉంటూ కాలేజీకి వెళ్తోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి హాస్టల్ గదిలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది మానస. ఇది గమనించి విద్యార్థినులు హాస్టల్ నిర్వాహకులకు చెప్పారు. వారు మానస గది తలుపులు బద్దలుకొట్టి  లోపలికి వెళ్లే సమయానికే జరగకూడదని నష్టం జరిగిపోయింది. మంటల్లో కాలిపోయి మానస చనిపోయినట్లు నిర్ధారించారు. హాస్టల్ నిర్వాహకుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఫిబ్రవరిలో వరంగల్ లో ఇలాంటి ఘటనే..

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మెడికో విద్యార్థిని మానస ఓ పెట్రోల్ బంకుకు వెళ్లింది. పెట్రోల్ బంక్ లో మానస పెట్రోల్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా పోలీసులకు ఈ విషయం తెలిసింది. వైద్య విద్యార్థిని మానస స్వస్థలం వరంగల్ కాగా, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో వరంగల్ జిల్లాకే చెందిన వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక తానే పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది ప్రీతి. తొలుత అపస్మారక స్థితిలో గమనించిన తోటి విద్యార్థినులు మేనేజ్ మెంట్ కు సమాచారం అందించగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. పాయిజన్ ఇంజక్షన్ తీసుకున్న తరువాత నాలుదైదు రోజులు చికిత్స పొందిన ప్రీతి చివరకు బ్రెయిన్ డెడ్ అయింది. చివరగా ప్రీతి చనిపోయినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. 

Published at : 13 Jun 2023 01:44 PM (IST) Tags: Hyderabad News Latest Crime News Telangana News Student Death Narayana College Student Death

ఇవి కూడా చూడండి

TSRTC DA: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఒకేసారి 9 డీఏలు మంజూరు

TSRTC DA: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఒకేసారి 9 డీఏలు మంజూరు

Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు

Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు

DK Aruna: ప్రధానిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే, నాలుక మడతపెట్టి కుట్టేస్తా : డీకే అరుణ వార్నింగ్

DK Aruna: ప్రధానిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే, నాలుక మడతపెట్టి కుట్టేస్తా : డీకే అరుణ వార్నింగ్

PGECET Seats: పీజీఈసెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు

PGECET Seats: పీజీఈసెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు

తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్

తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్

టాప్ స్టోరీస్

Cheapest 5G Phone in India: ఐటెల్ పీ55 సేల్ ప్రారంభం - దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.తొమ్మిది వేలలోపే!

Cheapest 5G Phone in India: ఐటెల్ పీ55 సేల్ ప్రారంభం - దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.తొమ్మిది వేలలోపే!

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం