అన్వేషించండి

Kishan Reddy On KCR: 2024లో ప్రధాని అయ్యేది ఆయనే- కేసీఆర్ వల్ల ఏమీ కాదన్న కిషన్ రెడ్డి

తెలంగాణలో కేసీఆర్ పాలన అంతం కాబోతుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. బండి సంజయ్‌ యాత్రకు మద్దతు చెప్పారాయన.

తెలంగాణ(Telangana) ప్రజలు కేసీఆర్(KCR) పాలనపట్ల విసిగిపోయారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన పోవడం.... బీజేపీ(BJP) అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్(TRS) అవినీతి పాలన ఎండగడుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్న ప్రజా సంగ్రామ యాత్ర(Praja Sangram Yatra) చేస్తున్న బండి సంజయ్‌కు(Banmdi Sanjay Kumar) మద్దతు పలకాలని కోరారు. 

జోగులాంబ గద్వాల్(Jogulamba Gadwal) జిల్లాలో రెండోరోజు పాదయాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇమాంపేట నుంచి లింగన్ వాయి మీదుగా బూడిదపాడు సెంటర్, ఉండవల్లి వరకు నడిచారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna)సహా పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ సీనియర్ నేతలు పాదయాత్రలో నడిచారు. అనంతరం లింగన్ వాయి గ్రామంలో ప్రజల గోస-బీజేపీ భరోసా(Prajala Gosa BJP Bharosa) పేరిట నిర్వహించిన రచ్చబండలో కిషన్ రెడ్డి మాట్లాడారు. 

Kishan Reddy On KCR: 2024లో ప్రధాని అయ్యేది ఆయనే- కేసీఆర్ వల్ల ఏమీ కాదన్న కిషన్ రెడ్డి

కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం అందిస్తోందని వివరించారు కిషన్ రెడ్డి. గ్రామాల్లోని పేద ప్రజల ప్రాణాలు కాపాడేందుకు దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు కొవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందించడంతోపాటు ఔషధాలు ఇస్తోందన్నారు. 

నరేంద్ర మోదీ(Modi) నాయకత్వంలో గ్రామాభివృద్ధి కోసం ఠంచనుగా నిధులిస్తోందని.. గ్రామంలో రోడ్లకు, వీధిలైట్లు, పారిశుద్ధ్యం పనులు అన్ని కేంద్రం ఇస్తున్న నిధులతోనే పని చేస్తున్నాయన్నారు కిషన్‌రెడ్డి. పేదలకు మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధులు, గ్రామాలకు దూరంగా జీవనం సాగిస్తున్న పేదలకు ఉచితంగా కరెంటు, ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్లు కేంద్రమే ఇస్తోందన్నారు. 

Kishan Reddy On KCR: 2024లో ప్రధాని అయ్యేది ఆయనే- కేసీఆర్ వల్ల ఏమీ కాదన్న కిషన్ రెడ్డి

పేద ప్రజలకు అండగా ఉండాలని సంవత్సరానికి రూ. 5లక్షల విలువైన ఆయుష్మాన్ భారత్ పథకం తీసుకొస్తే దానికి  కేసీఆర్ సర్కారు మోకాలడ్డుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు. రైతుల కోసం సమగ్రమైన పంట బీమా పథకం తీసుకొస్తే దాన్నీ అడ్డకుంటున్నారన్నారు. తెలంగాణకు ఇళ్లు మంజూరు చేస్తే కేసీఆర్ మాత్రం అవి పేదలకు అందకుండా చేశారని విమర్శించారు. తెలంగాణలో పావలా వడ్డీ రుణాలు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని.. దీనికి కేసీఆరే కారణమని ధ్వజమెత్తారు. 

కౌలు రైతులకు రైతుబంధు రావడం లేదన్న కిషన్ రెడ్డి... కౌలు రైతులను మోదీ ప్రభుత్వం డబ్బులిస్తున్నా కేసీఆర్ అడ్డుకుంటున్నారన్నారు. కేసీఆర్ మాటలు ప్రగతి భవన్ దాటడం లేదని విమర్శించారు. పెండింగ్ పనులు ముందుకు సాగాలంటే రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం రావాలని ప్రజలకు తెలిపారు. 

నిజాయితీ పార్టీ రావాలన్నా, ప్రజాస్వామ్య పాలన రావాలన్నా... కుటుంబ, నిజాం నియంతృత్వ పాలన పోవాలన్నారు కిషన్‌ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా సహా ప్రతి జిల్లా సశ్యశ్యామలం కావాలంటే భారతీయ జనతా పార్టీ రావాల్సిందేనన్నారు. బండి సంజయ్ కుమార్ ప్రజాసంగ్రామ యాత్రకు అందరు కలిసి రవాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. తెలంగాణలో అవినీతిరహిత పాలనను అందుకోవాలన్నారు. కేసీఆర్ నియంతృత్వ, అచారక, కుటుంబ పాలన పోవడం ఖాయం బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 

బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరును సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి. కేసీఆర్ ఎన్ని విష ప్రచారాలు చేసినా అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని జోష్యం చెప్పారు. చాలా మందిని నియంతలను చూశామని... కేసీఆర్ సహా ఏదీ శాశ్వతం కాదన్నారు కిషన్ రెడ్డి. 

తెలంగాణలో ఇష్టారాజ్య పాలన జరుగుతోందని... లిక్కర్, మైనింగ్, ల్యాండ్ మాఫియాతో దోచుకుంటున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి. అవినీతి మచ్చలేకుండా నరేంద్రమోదీ పాలిస్తుంటే...  ఏనాడూ ఆఫీస్‌కు రాకుండా పాలిస్తున్న నేత కేసీఆర్‌ అన్నారు. సెక్రటేరియట్ లేని రాష్ట్రం తెలంగాణేయే అన్నారు. 

కేసీఆర్ పీఠాలు కదులుతున్నాయని అభిప్రాయపడ్డారు కిషన్ రెడ్డి. అందుకే కేసీఆర్ బయటకొచ్చి తిరుగుతున్నారని విమర్శించారు. బీజేపీని బంగాళాఖాతంలో కలపాలని చెబుతున్నారని... అయితే 2024లో ఈ దేశానికి ప్రధాని అయ్యేది మళ్లీ నరేంద్రమోదీ మాత్రమేనన్నారు కిషన్ రెడ్డి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP Congress Game:  అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
Telangana Ration Card Latest News : కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Tuni Municipality Vice Chairman: టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
Telangana Group 2 Result: ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల- కటాఫ్ ఎంత ఉండొచ్చు!
ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల- కటాఫ్ ఎంత ఉండొచ్చు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP Congress Game:  అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
Telangana Ration Card Latest News : కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Tuni Municipality Vice Chairman: టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
Telangana Group 2 Result: ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల- కటాఫ్ ఎంత ఉండొచ్చు!
ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల- కటాఫ్ ఎంత ఉండొచ్చు!
FASTag New Rules: బ్లాక్‌ లిస్ట్‌ నుంచి బయటకురాకపోతే 'డబుల్‌ ఫీజ్‌' - టోల్‌గేట్ల దగ్గర ఈ రోజు నుంచి కొత్త రూల్స్‌
బ్లాక్‌ లిస్ట్‌ నుంచి బయటకురాకపోతే 'డబుల్‌ ఫీజ్‌' - టోల్‌గేట్ల దగ్గర ఈ రోజు నుంచి కొత్త రూల్స్‌
Nara Lokesh At Prayagraj: మహా కుంభమేళాలో మంత్రి నారా లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు - త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు
మహా కుంభమేళాలో మంత్రి నారా లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు - త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు
Vijay Devarakonda: కుంభమేళాలో తల్లితో కలిసి విజయ్ దేవరకొండ - అల్లు అర్జున్, వంశీ పైడిపల్లి ఫ్యామిలీలు కూడా.. ఫోటోలు వైరల్
కుంభమేళాలో తల్లితో కలిసి విజయ్ దేవరకొండ - అల్లు అర్జున్, వంశీ పైడిపల్లి ఫ్యామిలీలు కూడా.. ఫోటోలు వైరల్
Producer SKN: 'వినోదం కన్నా వివాదంపైనే ఇంట్రెస్ట్.. ఏం చేస్తాం' - ఆ కామెంట్స్‌పై 'బేబీ' నిర్మాత క్లారిటీ!
'వినోదం కన్నా వివాదంపైనే ఇంట్రెస్ట్.. ఏం చేస్తాం' - ఆ కామెంట్స్‌పై 'బేబీ' నిర్మాత క్లారిటీ!
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.