అన్వేషించండి

కేటీఆర్ ఆ మాట అనడం ముమ్మాటికీ కరెక్ట్, వాళ్లకి అంత ఉలికి పాటు దేనికి - కడియం శ్రీహరి

టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో కడియం శ్రీహరి, ఎంపీ లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ ఎం. ఎస్. ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ వి. జి. గంగాధర్ గౌడ్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

కేంద్రంలో బీజేపీ పాలనకు ఎనిమిదేళ్లు పూర్తి అయిందని, ఈ ఎనిమిదేళ్లలో ఏ ఒక్క రంగం అభివృద్ధి చెందలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన ఎంపీ లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ ఎం. ఎస్. ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ వి. జి. గంగాధర్ గౌడ్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎనిమిది ఏళ్లలో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ నానాటికి పతనమైందని, మోదీ ప్రధాని అయినపుడు డాలర్ విలువ 58 రూపాయలుగా ఉండేదని అన్నారు. ఇపుడు డాలర్ 82 రూపాయలకు చేరిందని విమర్శించారు.

ద్రవ్యోల్భణం పెరిగిపోతోంది.. ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. 2014 లో ఆర్ధిక వృద్ధి రేటు 7 శాతం ఉంటే ఇప్పుడది 5 శాతానికి దిగజారింది. బీజేపీ నేతలు ఒప్పుకోకున్నా ఇవి నిజాలు. గ్లోబల్ హాంగర్ ఇండెక్స్ లో భారత్ స్థాయి 121 దేశాల్లో 107 స్థానంగా ఉంది. 2014 లో హంగర్ ఇండెక్స్ లో 55 వ స్థానంలో ఉన్నాం. ఆసియా దేశాల్లో, పొరుగున ఉన్న దేశాలతో పోలిస్తే హంగర్ ఇండెక్స్ లో భారత్ స్థానం దిగజారి పోయింది. హ్యాపీనెస్ ఇండెక్స్ లో 136వ స్థానంలో ఉన్నాం. 2014లో 117 వ స్థానంలో ఉన్నాం. అసమానతలు తగ్గించే ఇండెక్స్ లో 123 వ స్థానంలో ఉన్నాం. మానవ అభివృద్ధి ఇండెక్స్ లో 133 వ స్థానంలో ఉన్నాం. అన్నింటిలో మోదీ పాలన భారత్ స్థాయిని దిగజార్చింది.

మోదీ పాలనలో నిరుద్యోగం పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయ్యాయి. ఉద్యోగాల భర్తీ తగ్గింది. రుణ ఎగవేత దారులకు 12 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డాలర్ బలపడుతోంది కనుక రూపాయి విలువ పడిపోతోంది అంటున్నారు. రూపాయి విలువ పడిపోతోంది కనుకే డాలర్ విలువ పెరుగుతోంది అని మేమంటున్నాం.. తేడా ఏముంది? చమురు ధరలు పెరిగాయని చెప్పి అధికారంలోకి వచ్చి మోదీ వాటిని తగ్గించారా? దేశంలో పరిస్థితులు దిగజారి పోతుంటే బీజేపీ నేతలు అహో మోదీ ఓహో మోదీ అని జబ్బలు చరచు కుంటున్నారు. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను దిగజార్చారు.

తెలంగాణపై బీజేపీ కక్ష కట్టింది. తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సిన నిధులు కూడా బీజేపీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. తెలంగాణ బీజేపీ నేతలు చవటలు దద్దమ్మలుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలకు బాధ్యత లేదా? బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటారా? తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే బండి సంజయ్ ఏం చేస్తున్నారు? బీజేపీకి బడుగు బలహీన వర్గాలంటే బీజేపీకి గిట్టదు. పేదవర్గాలకు అన్యాయం చేసేందుకే బీజేపీ రిజర్వేషన్లు, సబ్సిడీలు ఎత్తివేసే కుట్ర చేస్తోంది. ప్రశ్నించే వాళ్ళను అర్బన్ నక్సల్స్ గా ముద్ర వేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై ఈడీ, సీబీఐలను వాడుకుని బీజేపీ వేధిస్తోంది’’

‘‘బీజేపీ అధికార దాహం, రాజగోపాల్ రెడ్డి అహంకారం మునుగోడు ఉపఎన్నికకు కారణమయ్యాయి. కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీ కోవర్టుగా పని చేశానని 18 వేల కాంట్రాక్టు దక్కింది నిజమేనని రాజగోపాల్ రెడ్డి అంగీకరించారు. రాజగోపాల్ ది కోవర్టు చర్య కాక మరేమిటి? కోవర్టు అంటే రాజగోపాల్ కు ఎందుకు ఉలికి పాటు? కోమటి రెడ్డి వెంకట రెడ్డికి ఇవన్నీ తెలియవా? తన పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో ఎన్నికలు జరుగుతుంటే కోమటి రెడ్డి ఎందుకు ప్రచారానికి వెళ్ళరు? కోమటి రెడ్డి వెంకట రెడ్డి కోవర్టు కాక మరేమిటి? కోమటి రెడ్డి సోదరులను కోవర్టు సోదరులు అని కేటీఆర్ అనడం ముమ్మాటికీ కరెక్ట్. డబ్బు ఉందనే అహంకారంతో కోమటి రెడ్డి బ్రదర్స్ విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారు.’’ అని కడియం శ్రీహరి అన్నారు.

బూర నర్సయ్య చేసే ఆరోపణలు అన్నీ అబద్ధాలు - ఎంపీ బడుగుల
‘‘మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కు కేసీఆర్ వల్లే రాజకీయంగా గుర్తింపు వచ్చింది. 2014, 2019 లో ఎంపీగా పోటీ చేసే అవకాశం టీఆర్ఎస్ బూర నర్సయ్యకు ఇచ్చింది. 2019 లో ఎంపీగా ఓడిపోయినా బూరకు కేసీఆర్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. మా కంటే ఎక్కువగా బూర కేసీఆర్ ను కలిశారు. ఇటీవల సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించినపుడు బూరకు అన్నింటా ప్రాధాన్యత లభించింది. వెనకబడిన వర్గాలకు టీఆర్ఎస్ ప్రాధాన్యం ఇవ్వడం లేదని బూర చేసిన ఆరోపణలు శుద్ధ అబద్ధం. రాజ్యసభ సభ్యులుగా ముగ్గురు బీసీలకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. గొర్లు కాచుకునే నాకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశమిచ్చారు కేసీఆర్.. ఇది బీసీ లకు గౌరవం లభించినట్టు కాదా? ఇన్నేళ్లలో బీసీలకు లభించని గౌరవం కేసీఆర్ ఈ ఎనిమిదేళ్ల పాలనలో లభించింది.’’ అని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget