అన్వేషించండి

HYDRA Demolitions: రంగనాథ్ ప్రభుత్వ ఏజెంట్ అని విమర్శలు! అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతాయన్న హైడ్రా కమిషనర్!

HYDRAA Commissioner Ranganath | సంగారెడ్డి అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌లో దాదాపు 15వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాత్ తెలిపారు.

హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలంగాణ ప్రభుత్వానికి ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని సుప్రీంకోర్టు లాయర్ ముఖీమ్ ఆరోపించారు. కుంటలు, చెరువులు, జలాశయాలు ఉంటే వాటి వద్ద FTL, బఫర్ జోన్లు నిర్ణయించి ప్రభుత్వ ఆస్తులను హైడ్రా పరిరక్షించాలి కానీ మిగతా పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైనా ఫిర్యాదులు ఇస్తే పోయి కూలగొట్టడమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. హౌసింగ్ సొసైటీ, హౌసింగ్ లే ఔట్స్ కనిపిస్తే వాటి మీద పడుతున్నారని, వాటితో డబ్బులు కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఇటీవల ఇంటర్వ్యూలో సైతం రంగనాథ్ చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు.

‘నోటీసులు ఇవ్వకుండా చట్టవిరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. మీ ఇల్లు శికం భూముల్లో కట్టారని ఓ ఇంటర్వ్యూలో అడిగితే అది 40 ఏళ్ల కింద మా నాన్న కట్టారని రంగనాథ్ చెబుతున్నాడు. ఒవైసీ సోదరులు ఫాతిమా కాలేజీని చెరువు మధ్యలో కట్టినా చర్యలు తీసుకోవడం లేదు. మీరు అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారు, జైల్లో పెడతారని ఆందోళన చెందవద్దు. ధైర్యంగా ఉండకపోతే మీ భూములు లాక్కుని వ్యాపారం చేయాలని ప్లాన్ చేశారు. హైడ్రా ప్రభుత్వ అధికారిగా కాదు, ఓ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. అమీన్ పూర్, ఐలాపురం, కిష్టారెడ్డిపేటలలో బఫర్ జోన్లు, ఎఫ్‌టీఎల్ ఫిక్స్ చేసిన తరువాత ఆ బిల్డింగ్స్ జోలికి పోవాలని కోర్టు సైతం హైడ్రాను ఆదేశించింది. కోర్టుల్లో కేసు ఉంది విచారణ జరుగుతుందని చెబితే, ఫిర్యాదు వచ్చిందనే సాకుతో కట్టడాలు అక్రమంగా కూల్చివేస్తున్నారని’ సుప్రీంకోర్టు లాయర్ ముఖీమ్ ఆరోపించారు. 

ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టుకున్నందుకే కూల్చివేతలు: రంగనాథ్

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపురంలో శనివారం హైడ్రా  చేపట్టిన కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ఐలాపురంలోని భూములపై 1998 నుంచే హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఉన్నాయని, అయితే వాటిని బేఖాతరు చేస్తూ లాయర్ ముఖీమ్ అనే వ్యక్తి ప్రభుత్వ భూములను ఆక్రమించి ఫాంహౌస్‌ను నిర్మించుకున్నారని రంగనాథ్ తెలిపారు. కేవలం ఒక ఫాంహౌస్‌తో మొదలైన ఈ ఆక్రమణ, కాలక్రమేణా 40 ఎకరాలకు విస్తరించిందని రంగనాథ్ వివరించారు.

గత 20 ఏళ్లుగా ముఖీమ్ తన అనుచరులతో కలిసి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూదందాకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను అక్రమంగా ప్లాట్లుగా మార్చి, ఒక్కో 100 గజాల స్థలాన్ని సుమారు 10 లక్షల రూపాయలకు పేద ప్రజలకు విక్రయించి కోట్ల రూపాయలు గడించినట్లు ఆయన పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే కాకుండా, సామాజిక మాధ్యమాల్లో హైడ్రా చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఐలాపురం కూల్చివేతలపై హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని రంగనాథ్ స్పష్టం చేశారు.

కాగా, శనివారం భారీ పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. ముఖీమ్  నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యమని, ఆక్రమణదారుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Rains In AP and Telangana: రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Telangana Delimitation 2026: తెలంగాణలో డిలిమిటేషన్ ధమాకా - గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా మారబోతున్న రాష్ట్ర రాజకీయం?
తెలంగాణలో డిలిమిటేషన్ ధమాకా - గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా మారబోతున్న రాష్ట్ర రాజకీయం?
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Embed widget