హైడ్రా భాగ్యనగరంలో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కు స్థలాలను ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. అక్రమార్కులను తొలగించి, ఆస్తులను స్వాధీనం చేసుకుంటోంది.
Hydra Latest News: కబ్జా చెర నుంచి పార్క్, ప్రభుత్వ భూమి కాపాడిన హైడ్రా! 1500 కోట్ల విలువైన ల్యాండ్ సేఫ్!
Hydra Latest News: హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా తన కార్యకలాపాలను మరింత విస్తృతం చేస్తోంది. తాజాగా 1500 కోట్ల విలువైన భూములు కాపాడారు.

Hydra Latest News: భాగ్యనగరంలో ప్రభుత్వ భూములు, చెరువులు, ప్రజా అవసరాల కోసం కేటాయించిన పార్కు స్థలాలను కబ్జా చేస్తూ అక్రమార్కులపై హైడ్రా తన ఉక్కుపాదం మోపుతోంది. అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో కబ్జాకు గురైన ప్రభుత్వ ఆస్తులను వెలికి తీస్తూ, భూ మాఫియాకు గట్టి హెచ్చరికలు పంపుతోంది. తాజాగా నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన భారీ ఆపరేషన్లలో ఏకంగా 1500 కోట్ల రూపాయలకుపైగా విలువ చేసే ప్రభుత్వ భూములను, పార్కు స్థలాలను హైడ్రా అధికారులు ఆక్రమణలు చెర నుంచి విడిపించారు. స్వాధీనం చేసుకున్న ఈ భూముల చుట్టూ తక్షణమే ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతోపాటు , ఇవి ప్రభుత్వ ఆస్తులని తెలిపే బోర్డులను కూడా అధికారులు ఏర్పాటు చేశారు.
జంగంకుంటలో 700 కోట్ల భారీ ఆపరేషన్
హైదరాబాద్లోని ఐటీ కారిడార్కు సమీపంలో ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇదే క్రమంలో ఇక్కడి జంగంకుంట చెరువుపై కబ్జాదారుల కన్ను పడింది. సుమారు నాలుగు ఎకరాల మేర విస్తరించి ఉన్న ఈ కుంటను అక్రమార్కులు మట్టితో పూడ్చి వేసి, చదును చేశారు. ఆ స్థలాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో హైడ్రా రంగంలోకి దిగింది.
రెవెన్యూ అధికారులో కలిసి సంయుక్తంగా నిర్వహించిన శాస్త్రీయ సర్వేలో ఇది ఆక్రమణ అని నిర్దారణ కావడంతో, హైడ్రా అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. సుమారు 700 కోట్ల విలువైన ఈ నాలుగు ఎకరాల భూమిని కబ్జాదారుల నుంచి రక్షించి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి.
✳️శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం - మదీనాగూడ రోడ్డు మార్గం కొండాపూర్లో రూ. 700 కోట్ల విలువైన భూమిని హైడ్రా మంగళవారం కాపాడింది. 4 ఎకరాల జంగం కుంటను పూడ్చేసి.. మట్టితో చదును చేసి ప్లాట్లుగా విక్రయించేందుకు సిద్ధమైన కబ్జాదారుల ఆట కట్టించింది హైడ్రా. ఇటీవల మీడియాలో… pic.twitter.com/CUPu6FMVxI
— HYDRAA (@Comm_HYDRAA) February 10, 2026
కొత్త చెరువుకు పునర్జీవం- అల్వాల్లో 8 ఎకరాల రక్షణ
అల్వాల్ మండల పరిధిలోని కొత్త చెరువు గత కొంతకాలంగా ఆక్రమణల కోరల్లో చిక్కుకుంది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే సుమారు 8 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించి, అక్కడ ప్లాస్టిక్ కంప్రెసివ్ యూనిట్లు, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కేంద్రలను ఏర్పాటు చేశారు. దీని వల్ల చెరువు విస్తీర్ణం తగ్గడమే కాకుండా, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల నీరు తీవ్రంగా కలుషితం అవుతుందని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన హైడ్రా బృందాలు, ఆక్రమణలను పూర్తిగా తొలగించారు. చెరువు శిఖం భూముల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి, 8 ఎకరాల చెరువు భూమిని కాపాడురు.
కాలనీల్లో పార్కు స్థలం స్వాధీనం
ప్రజా మౌలిక సదుపాయాలు, గ్రీనరీ కోసం కేటాయించి పార్కు స్థలాను కూడా వదలని కబ్జాదారులపై హైడ్రా దృష్టి పెట్టింది. ఎల్బీనగర్ పరిధిలోని వనస్థలిపురం జక్కిడి నగర్ కాలనీలో గతంలో జీహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడ్ రూపంలో అప్పగించిన 650 గజాల పార్కు స్థలాన్ని కొదరు వ్యక్తులు ఆక్రమించారు. అక్కడ ప్రహీ గోడ నిర్మించి, రేకుల షెడ్లను కూడా వేశారు. హైడ్రా అధికారులు ఆ నిర్మాణాలను కూల్చివేసి స్థలానికి ఫెన్సింగ్ వేశారు.
మౌలాలి సర్కిల్ పరిధిలోని రాధాకృష్ణ హౌసింగ్ కాలనీలో 450 గజాల పార్కు స్థలాన్ని ఆక్రమణల నుంచి రక్షించారు. ఇక్కడ కూడా స్థానిక ప్రజల అవసరాల కోసం కేటాయించిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించగా, అధికారులు అడ్డుకొని స్వాధీనం చేసుకున్నారు.
✳️ మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలంలోని అల్వాల్ కొత్త చెరువు 8 ఎకరాల మేర ఆక్రమణలను హైడ్రా తొలగించింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ప్లాస్టిక్ కంప్రెసివ్ యూనిట్, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యకలాపాలు నిర్వహిస్తూ చెరువును కలుషితం చేస్తున్నారని స్థానికులు… pic.twitter.com/i2BSwkE4ty
— HYDRAA (@Comm_HYDRAA) February 10, 2026
హైడ్రా చేపట్టిన ఈ ఆపరేషన్లు కేవలం కూల్చివేతలకు పరిమితం కాలేదు. స్వాధీనం చేసుకున్న ప్రతి భూమి చుట్టూ కంచె వేసి, ఇవి ప్రభుత్వ ఆస్తులని బోర్డులు పెట్టడం ద్వారా భవిష్యత్తులో మళ్లీ కబ్జాలకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసే ఆక్రమణలకు సహకరించే వారిపై, కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు వేగవంతం చేశారు.
Frequently Asked Questions
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?
కొత్త చెరువు విషయంలో హైడ్రా ఎందుకు స్పందించింది?
కొత్త చెరువును ఆక్రమించి, ప్లాస్టిక్ వ్యర్థాల కేంద్రాలను ఏర్పాటు చేయడంతో నీరు కలుషితమవుతుందని స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా స్పందించింది. 8 ఎకరాల చెరువు భూమిని స్వాధీనం చేసుకుంది.
జంగంకుంట చెరువు ఆక్రమణపై హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంది?
జంగంకుంట చెరువును మట్టితో పూడ్చి, ప్లాట్లుగా మార్చేందుకు ప్రయత్నించిన అక్రమార్కులను హైడ్రా అడ్డుకుంది. 700 కోట్ల విలువైన 4 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని, క్రిమినల్ కేసులు నమోదు చేయించింది.
పార్కు స్థలాల ఆక్రమణలపై హైడ్రా చర్యలు ఏమిటి?
వనస్థలిపురం, మౌలాలి ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన పార్కు స్థలాలను హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, ప్రభుత్వ ఆస్తులని బోర్డులు ఏర్పాటు చేశారు.























