అన్వేషించండి

HYDRA Demolitions: 15 వేల కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడుతున్న హైడ్రా, ఐటీ కారిడార్‌కు 10 కి.మీ దూరంలో కబ్జాలు

HYDRA demolitions in gajularamaram | గాజులరామారంలో 15 వేల కోట్ల విలువ చేసే 300 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. సెప్టెంబర్ 21న ఉదయం నుంచే హైడ్రా కూల్చివేతలు చేపట్టింది.

Gajularamaram in Medchal Malkajgiri district | హైదరాబాద్‌: ఐటీ కారిడార్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే గాజులరామారం ప్రాంతంలో ప్రభుత్వ భూములు భారీ స్థాయిలో ఆక్రమణలకు గురయ్యాయని హైడ్రా (HYDRA) గుర్తించింది. మొత్తం 300 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా.. అందులో 100 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. ఆ ఆక్రమించిన భూమిలో కొందరు 60 నుంచి 70 గజాలు, 80 గజాల పరిమాణంలో ఇళ్లు నిర్మించి, రూ.10 లక్షలకు విక్రయిస్తున్నట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. ఆదివారం ఉదయం నుంచి అక్రమ నిర్మాల తొలగింపు పనులు చేపట్టిన హైడ్రా అధికారులు నివాసాల జోలికి వెళ్లకుండా ఆక్రమణల తొలగిస్తున్నట్లు చెప్పారు.

కబ్జాలు, ఆక్రమణలపై తొక్కుకుంటూ పోతున్న హైడ్రా

గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. సర్వే నంబర్ 307లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేసింది. ఆక్రమణదారుల చేతుల్లో దాదాపు రూ.4,500 నుంచి 5000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది, జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసుల సహకారంతో గాజులరామారంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. హైడ్రా అధికారుల చర్యలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము లక్షల్లో డబ్బులు చెల్లించి ఇంటిని కొనుక్కున్నామని, అమ్మినవారిపై చర్యలు తీసుకోవడానికి బదులుగా తమ నివాసాలను కూల్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. హైడ్రా చర్యలను నిరసిస్తూ చిన్న పిల్లలతో కలిసి జేసీబీ వాహనాలకు అడ్డుగా నిలబడి వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. 


HYDRA Demolitions: 15 వేల కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడుతున్న హైడ్రా, ఐటీ కారిడార్‌కు 10 కి.మీ దూరంలో కబ్జాలు

ఐటీ కారిడార్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో
ప్రస్తుతం గాజులరామారంలో మొత్తం 300 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా, ఇందులో 100 ఎకరాలు ఇప్పటికే ఆక్రమణకు గురైనట్లు హైడ్రా స్పష్టం చేసింది. వంద ఎకరాల్లో అక్రమ కట్టడాల కూల్చివేత అనంతరం మిగిలిన 200 ఎకరాల భూమిని సైతం కాపాడేందుకు హైడ్రా రూ.15 వేల కోట్ల విలువ గల 300 ఎకరాల భూమికి కంచె వేయాలని యోచిస్తోంది. గాజులరామారం, ఐటీ కారిడార్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, TGISC, హెచ్ఎండీయే, హౌసింగ్ బోర్డు వంటి సంస్థలకు గత ప్రభుత్వాలు భూములు కేటాయించినా, వాటిని అభివృద్ధి చేయకపోవడంతో కొందరు కబ్జాదారులు గ్రూపులుగా ఏర్పడి ఆ భూములను ఆక్రమించారు. కొందరు నేరుగా ప్లాట్లు విక్రయించగా, కొందరు చిన్న ఇండ్లు కట్టి బడ్జెట్ ధరలలో అమ్మేస్తున్నారు. 

కేవలం 4 ఏళ్లలోనే 100 ఎకరాల భూమి కబ్జా
కేవలం 3, 4 ఏళ్లలోనే 103 ఎకరాల భూమిని ఆక్రమించారని హైడ్రా అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ఎకరా మార్కెట్ విలువ రూ.40 నుండి రూ.50 కోట్లు ఉంది. దాంతో ఆక్రమణలో ఉన్న భూముల విలువ రూ.4,500 నుంచి 5000 కోట్ల మధ్య ఉంటుందని తెలిపారు. కుత్బుల్లాపూర్, గాజులరామారం, చింతల్ పరిసరాల్లో ఉండే వారిని తక్కువ ధర అని ఆకర్షించి సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి అమ్ముతున్నారు. తమకు రెవెన్యూ, విద్యుత్ శాఖలకు చెందిన అధికారుల నుంచి పర్మిషన్ వచ్చిందని, బిల్లులు ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. 

తక్కువ ధరలకే ఇంటిని సొంతం చేసుకోవాలని కొంతమంది అప్పులు చేసి మరీ ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. కబ్జా భూములపై ఫోకస్ చేసిన హైడ్రా అధికారులకు ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో గాజులరామారంలో ప్రభుత్వ భూమి కబ్జా, అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. అయితే వీటిని విక్రయించిన కబ్జాదారులతో పాటు పర్మిషన్లు ఇచ్చిన అధికారులు, సిబ్బందిపై ముందుగా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆ ప్రాంత వాసులు హైడ్రా అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
The Raja Saab Run Time : ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget