By: ABP Desam | Updated at : 31 Jul 2022 12:24 PM (IST)
సీపీ సీవీ ఆనంద్ (ఫైల్ ఫోటో)
ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తారు? ఎవరైనా పోలీసులను ఆశ్రయిస్తారు. అందుకోసం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లడమో లేక ముందు డయల్ 100 కు కాల్ చేసి ఫిర్యాదు చేయడమో చేస్తారు. ఆ తర్వాత వారు చర్యలు తీసుకుంటుంటారు. అదే సమస్య పోలీస్ బాస్ కి ఎదురైతే, తన సిబ్బందికి చెప్పి క్షణాల్లో సమస్య పరిష్కారం చేయిస్తారు. కానీ, ఇక్కడ మాత్రం ఈ పోలీస్ బాస్ సామాన్యుడిలాగా డయల్ 100 కి ఫిర్యాదు చేశారు. ఆయనెవరో కాదు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం అర్ధరాత్రి డయల్ 100కు కాల్ చేశారు. తన నివాస ప్రాంతంలో సౌండ్ పొల్యూషన్ ఆపాలని డయల్ 100 ద్వారా సీపీ ఈ ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ప్లజెంట్ వ్యాలీలో సీపీ ఆనంద్ నివాసం ఉంటుండగా, ఆ ప్రాంతంలో అర్ధరాత్రి తీవ్రమైన శబ్ద కాలుష్యం ఏర్పడింది. ఎవరో డప్పుల చప్పుడుతో ఆ సమయంలో సంబరాలు చేసుకున్నారు. దీంతో సీపీ సీవీ ఆనంద్ అర్ధరాత్రి డప్పుల హోరుతో శబ్ద కాలుష్యం చేస్తున్నారని డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేశారు.
డయల్ 100 ద్వారా సమాచారం తెలుసుకున్న నైట్ డ్యూటీలో ఉన్న జూబ్లీహిల్స్ డీఐ శ్రీనివాస్, ఇతర సిబ్బంది వెళ్లి విషయం తెలుసుకున్నారు. ఓం నగర్ బస్తీలో తొట్టెలు ఊరేగిస్తూ అర్ధరాత్రి డప్పులతో శబ్ద కాలుష్యం చేసినట్లు గుర్తించారు. వెంటనే నిర్వహకుడు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకొని 70 b కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సీపీ తలచుకుంటే నేరుగా తన సిబ్బందికే ఫోన్ చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చు. కానీ, ఇలా డయల్ 100 కు ఫోన్ చేసి సమస్య పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు.
Also Read: Guntur News: కన్న కొడుకుని చంపి, గుట్టుగా పాతేసిన తల్లిదండ్రులు - ఎందుకో తెలిసి గ్రామస్థులు షాక్!
Vijaya Shanthi: కేసీఆర్ చెప్పేవన్నీ తుపాకి రాముడి కథలే, సీఎం వ్యాఖ్యలపై విజయ శాంతి కౌంటర్
రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్న్యూస్, తెలంగాణ సర్కార్కు షాక్ - కీలక తీర్పు
Telangana Secretariat: కొత్త సెక్రెటేరియట్ వద్దకు సీఎం కేసీఆర్, భవనం మొత్తం పరిశీలన - కీలక ఆదేశాలు
Haritha Haram 2022: 21న తెలంగాణ అంతా హరితహారం, సీఎం కీలక ఆదేశాలు - మంత్రి వెల్లడి
వెయ్యి కిలోమీటర్లు దాటిన "ప్రజాసంగ్రామ యాత్ర"
Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ లీడర్ హత్య కేసులో నిందితుల అరెస్టు
Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!
KCR News: 21న కరీంనగర్కు సీఎం కేసీఆర్, ఆసక్తికరంగా ఆ ఏర్పాట్లు - గతంలో ఎప్పుడూ లేనట్లుగా
AP Teachers : "మిలియన్ మార్చ్" నిర్వీర్యం కోసమే టార్గెట్ చేశారా ? ఏపీ టీచర్లు ప్రభుత్వంపై ఎందుకంత ఆగ్రహంగా ఉన్నారు ?