అన్వేషించండి

Hussain Sagar Fire Accident: హుస్సేన్ సాగర్‌లో అగ్నిప్రమాదం ఘటన - చికిత్స పొందుతూ ఒకరు మృతి- ఇంకా లభించని అజయ్ ఆచూకీ

Hyderabad News | హుస్సేన్ సాగర్‌లో ఆదివారం రాత్రి భారతమాతకు హారతిలో పటాసులు పేలి బోట్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన గణపతి చికిత్స పొందుతూ చనిపోయాడు.

Hyderabad Fire Accident: హైదరాబాద్: నగరంలోని హుస్సేన్ సాగర్‌ (Hussian Sagar) లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం ఘటనలో ఒకరు మృతిచెందారు. నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో జరిగిన 'భారత మాతకు మహా హారతి' కార్యక్రమంలో పడవలో బాణసంచా పేలడం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గణపతి సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. గణపతి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి అని సమాచారం. మరోవైపు రెండు రోజులవుతున్నా ఈ ఘటన తరువాత అదృశ్యమైన అజయ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అసలేం జరిగింది..
భారతమాత ఫౌండేషన్​ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో ఆదివారం రాత్రి భారతమాతకు హారతి కార్యక్రమం నిర్వహిస్తుండగా హుస్సేన్​సాగర్‌లో బాణసంచా పేలి రెండు బోట్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో చింతల కృష్ణ, సాయి చంద్, సునీల్, ప్రవీణ్ సహా 8 మందికి కాలిన గాయాలు కాగా, వారిని యశోద, గాంధీ, సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపుగా అంతా హాస్పిటల్స్ నుంచి డిశ్ఛార్జ్ కాగా, గణపతి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. చికిత్స పొందుతూ గణపతి మంగళవారం ఉదయం మృతిచెందడంతో విషాదం నెలకొంది. 

వైజాగ్ వాసి మణికంఠకు క్రాకర్స్ ఈవెంట్  బాధ్యతలు చూసుకుంటున్నాడు. గతంలో హైదరాబాద్ కు చెందిన రాఘవేందర్ కు అతడు క్రాకర్స్ సరఫరా చేశాడు. వాటి నగదు ఇవ్వడానికి రాఘవేందర్ తన ఫ్రెండ్స్​అజయ్, సాయి సందీప్ ను తీసుకుని ఆదివారం నెక్లెస్  రోడ్డుకు వచ్చాడు. మణికంఠ డబ్బులు ఇచ్చిన అనంతరం వారు మరో పడవలో మణికంఠతో పాటు హుస్సేన్ సాగర్​లోకి వెళ్లారు. ప్రమాదం సమయంలో మొత్తం రెండు బోట్లలో 15 మంది వరకు ఉన్నారు. ఒక్కసారిగా టపాసులు పేలడం, బోట్లకు మంటలు అంటుకోవడంతో ప్రాణ భయంతో లైఫ్​జాకెట్లు​వేసుకున్న వారు, ఈత వచ్చిన వారు నీళ్లలోకి దూకేశారు.  వీరిలో అజయ్​అనే యువకుడి ఆచూకీ లభ్యం కావడం లేదు. సోమవారం ఉదయం నుంచి డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, టూరిజం మొత్తం నాలుగు బృందాలు రాత్రి వరకు గాలించినా చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. 

మా కొడుకు ఏమయ్యాడు?
తమ కొడుకు బతికున్నాడా, చనిపోయాడా అంటూ అజయ్ తల్లిదండ్రులు నాగలక్ష్మి, జానకి రామ్ హుస్సేస్ సాగర్ వద్దే సోమవారం మొత్తం కన్నీళ్లు పెట్టుకున్నారు. గీతాంజలి ఇంజినీరింగ్ కాలేజీలో అజయ్ ఫైనలియర్ చదువుతున్నాడు. చదువు పూర్తయి తమకు చేదోడు వాదోడుగా నిలుస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం. కొడుకు ప్రాణాలతో ఉండి ఉంటాడా అని అందర్నీ అడుగుతున్నారు.

Also Read: Crime News: మీర్‌పేట్ మర్డర్ మిస్టరీలో మరో ట్విస్ట్- నిందితుడు కుక్కర్‌ వాడకుండా డెడ్‌బాడీ ఇలా మాయం చేశాడు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rajkot T20 Result: పోరాడి ఓడిన భారత్.. హార్దిక్ పోరాటం వృథా.. ఇంగ్లాండ్ ను గెలిపించిన బౌలర్లు.. 
పోరాడి ఓడిన భారత్.. హార్దిక్ పోరాటం వృథా.. ఇంగ్లాండ్ ను గెలిపించిన బౌలర్లు.. 
Nara Lokesh: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - త్వరలో ప్రతి శనివారం ఇక 'నో బ్యాగ్ డే', మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - త్వరలో ప్రతి శనివారం ఇక 'నో బ్యాగ్ డే', మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు
Meerpet Murder Case:  భార్యను గురుమూర్తి ఎంత కిరాతకంగా చంపాడో చెప్పిన సీపీ సుధీర్ బాబు -  ఇంత ఘోరమా ?
భార్యను గురుమూర్తి ఎంత కిరాతకంగా చంపాడో చెప్పిన సీపీ సుధీర్ బాబు - ఇంత ఘోరమా ?
Thala Trailer: కంఫర్ట్‌ జోన్ వదిలి కొత్తగా ట్రై చేసిన అమ్మ రాజశేఖర్... రక్తంతో ఎరుపెక్కిన 'తల', ట్రైలర్ చూశారా?
కంఫర్ట్‌ జోన్ వదిలి కొత్తగా ట్రై చేసిన అమ్మ రాజశేఖర్... రక్తంతో ఎరుపెక్కిన 'తల', ట్రైలర్ చూశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keslapur Nagaoba Jathara | ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా జాతరకు సర్వం సిద్ధం | ABP DesamG Trisha Century U19 Womens T20 World Cup | టీమిండియాను సెమీస్ కు తీసుకెళ్లిన తెలంగాణ అమ్మాయి | ABPMaha Kumbha Mela 2025 | ప్రయాగరాజ్ కు పోటెత్తుతున్న భక్తులు | ABP DesamChiranjeevi Speech at Experium | ఎక్స్ పీరియమ్ థీమ్ పార్కును ప్రారంభోత్సవంలో చిరంజీవి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajkot T20 Result: పోరాడి ఓడిన భారత్.. హార్దిక్ పోరాటం వృథా.. ఇంగ్లాండ్ ను గెలిపించిన బౌలర్లు.. 
పోరాడి ఓడిన భారత్.. హార్దిక్ పోరాటం వృథా.. ఇంగ్లాండ్ ను గెలిపించిన బౌలర్లు.. 
Nara Lokesh: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - త్వరలో ప్రతి శనివారం ఇక 'నో బ్యాగ్ డే', మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - త్వరలో ప్రతి శనివారం ఇక 'నో బ్యాగ్ డే', మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు
Meerpet Murder Case:  భార్యను గురుమూర్తి ఎంత కిరాతకంగా చంపాడో చెప్పిన సీపీ సుధీర్ బాబు -  ఇంత ఘోరమా ?
భార్యను గురుమూర్తి ఎంత కిరాతకంగా చంపాడో చెప్పిన సీపీ సుధీర్ బాబు - ఇంత ఘోరమా ?
Thala Trailer: కంఫర్ట్‌ జోన్ వదిలి కొత్తగా ట్రై చేసిన అమ్మ రాజశేఖర్... రక్తంతో ఎరుపెక్కిన 'తల', ట్రైలర్ చూశారా?
కంఫర్ట్‌ జోన్ వదిలి కొత్తగా ట్రై చేసిన అమ్మ రాజశేఖర్... రక్తంతో ఎరుపెక్కిన 'తల', ట్రైలర్ చూశారా?
Crime News: చెల్లిపై కోటి 20 లక్షలు ఇన్సూరెన్స్ చేయించి చంపేశాడు - వీడు అన్న కాదు హంతకుడు !
చెల్లిపై కోటి 20 లక్షలు ఇన్సూరెన్స్ చేయించి చంపేశాడు - వీడు అన్న కాదు హంతకుడు !
Canada: కెనడా ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రూబీ ధల్లా  -  బ్యాక్‌గ్రౌండ్ పవర్ ఫుల్ !
కెనడా ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రూబీ ధల్లా - బ్యాక్‌గ్రౌండ్ పవర్ ఫుల్ !
Thandel Trailer: తండేల్‌ ట్రైలర్‌ వచ్చేసింది... నాగ చైతన్య, సాయి పల్లవి ఇరగదీశారుగా
తండేల్‌ ట్రైలర్‌ వచ్చేసింది... నాగ చైతన్య, సాయి పల్లవి ఇరగదీశారుగా
Maha Kumbh Mela 2025: మౌని అమావాస్య స్పెషల్ - మహా కుంభమేళా భక్తులకు కీలక సూచనలు
మౌని అమావాస్య స్పెషల్ - మహా కుంభమేళా భక్తులకు కీలక సూచనలు
Embed widget