అన్వేషించండి

Maha Kumbh Mela 2025: మౌని అమావాస్య స్పెషల్ - మహా కుంభమేళా భక్తులకు కీలక సూచనలు

Kumbh Mela 2025: కుంభమేళాలో బుధవారం జరిగే మౌని అమావాస్యను పవిత్ర దినంగా భావిస్తారు. దాదాపు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తోన్న అధికారులు తాజాగా అడ్వైజరీ జారీ చేశారు.

Maha Kumbh Mela 2025 Latest Advisory Ahead Of Mauni Amavasya: ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా (Maha Kumbh Mela 2025) ఘనంగా సాగుతోంది. బుధవారం మౌనీ అమావాస్య సందర్భంగా చేసే నదీ స్నానం విశేషమైంది. అమావాస్య రోజున నిర్వహించే స్నానాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇప్పటికే దాదాపు 15 కోట్ల మంది త్రివేణి సంగమానికి వచ్చి పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మౌని అమావాస్య రోజున సుమారు 10 కోట్ల మంది పుణ్యస్నానాల కోసం రానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం భారీ భద్రత ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం.. భక్తులకు తాజా అడ్వైజరీ జారీ చేశారు. భద్రతా నియమాలు పాటిస్తూ.. అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

భక్తులకు సూచనలివే..

  • నిర్దేశించిన మార్గాల్లోనే ఘాట్లకు వెళ్లాలి. స్నానాల తర్వాత అక్కడ ఎక్కువ సేపు ఉండొద్దు. పార్కింగ్ ప్రదేశాలు లేదా బస చేసే ప్రాంతాలకు భక్తులు తిరిగి చేరుకోవాలి.
  • బారికేడ్లు వద్ద, పాంటూన్ బ్రిడ్జిలపై నిదానంగా వెళ్లాలి. తొందరపాటు చర్యలతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
  • ఆరోగ్య సమస్యలు ఎదురైతే ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెక్టార్ ఆస్పత్రులకు వెళ్లాలి. సంగమం వద్ద ఉన్న అన్ని ఘాట్లు పవిత్రమైనవే. తొలుత ఎక్కడికి చేరుకుంటే అక్కడే స్నానాలు చేయడం మంచిది.
  • సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల్లో వచ్చే వదంతులను నమ్మొద్దు. సౌకర్యాలు, ఏర్పాట్ల గురించి చేసే అసత్య ప్రచారాలను నమ్మొద్దు.
  • అనుక్షణ అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన చోట పోలీసులు, అధికారులు సాయం తీసుకోవాలి. భక్తుల రద్దీ నియంత్రణ నిబంధనలు పాటిస్తూ.. పోలీసులకు సహకరించాలి.
  • సాధారణ, ట్రాఫిక్ పోలీసులతో పాటు ఏదైనా అత్యవసర కేసుల్లో సాయం అందించేందుకు వైద్య నిపుణుల బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అధికారుల సూచనలు కచ్చితంగా పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

నెట్ వర్క్ చింతే లేదు..

అటు, కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నా ప్రజలకు ఎలాంటి అంతరాయ లేకుండా కాల్స్‌కు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా.. మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయి. ఈ మేరకు స్థానిక యంత్రాంగంతో కలిసి టెలికాం కంపెనీలు చర్యలు చేపట్టాయి. ఈ ప్రాంతంలో దాదాపు అన్ని టెలికాం సంస్థలు ఈ ప్రాంతంలో తమ సేవల్ని పెంచుకున్నాయని ఇంటిగ్రేటేడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లో కొత్తగా 328 టవర్లు, మొత్తం 328 బీటీఎస్‌లు ఏర్పాటు చేశారు. ఎయిర్‌టెల్ కొత్తగా 287 సైట్స్ (టవర్స్), 78 సెల్స్ ఆన్ వీల్స్ ఏర్పాటు చేసింది.

Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళాకు వెళ్లే రైలుపై రాళ్ల దాడి - డోర్లు ఓపెన్ చేయలేదని దారుణం, వైరల్ వీడియో

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget