అన్వేషించండి

Maha Kumbh Mela 2025: కుంభమేళాకు వెళ్లే రైలుపై రాళ్ల దాడి - డోర్లు ఓపెన్ చేయలేదని దారుణం, వైరల్ వీడియో

Kumbh Mela 2025: మధ్యప్రదేశ్‌లోని చతర్‌పుర్ రైల్వే స్టేషన్లో ఆగిన కుంభమేళా రైలుపై ప్లాట్ ఫాంపై ఉన్న ప్రయాణికులు రాళ్ల దాడికి దిగారు. లోపల ఉన్న వారు డోర్లు ఓపెన్ చేయడం లేదనే అసహనంతో రాళ్లు రువ్వారు.

Attack On Mahakumbh Mela Train: ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు (Maha Kumbhmela) వెళ్లే రైలుపై మంగళవారం దాడి జరిగింది. మధ్యప్రదేశ్‌లోని చతర్‌పుర్ రైల్వే స్టేషన్‌లో ఆగిన ట్రైన్‌పై ప్రయాణికులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. రైలు రావడం ఆలస్యమైందని.. అయినా లోపల ఉన్న ప్రయాణికులు డోర్లు తీయడం లేదని స్టేషన్లోని ప్రయాణికులు ఆగ్రహంతో ఊగిపోయారు. ప్లాట్ ఫాంపై ఉన్న వ్యక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ రైలుపై రాళ్లు విసిరారు. చతర్‌పుర్, హర్పల్‌పుర్ రైల్వే స్టేషన్లలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, రైళ్లపై దాడి జరిగిన ఘటన గురించి తమకు సమాచారం అందినట్లు జాన్సీ రైల్వే డివిజన్ పీఆర్వో మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. రైలు లోపల ఉన్న ప్రయాణికులు డోర్లు తీయకపోవడంతో ప్లాట్ ఫాంపై ఉన్న ప్రయాణికులు తీవ్ర అసహనంతో రాళ్ల దాడి చేసినట్లు చెప్పారు. అప్పటికే రైలు కిక్కిరిసిపోవడంతో చాలామంది రైలు ఎక్కలేకపోయినట్లు పేర్కొన్నారు.

ప్రత్యేక రైళ్లు..

మరోవైపు, ప్రయాగరాజ్‌లో కుంభమేళా ఘనంగా సాగుతోంది. ఇప్పటికే దాదాపు 8 కోట్ల మంది భక్తులు పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఫిబ్రవరి 26 వరకూ కుంభమేళా జరగనుండగా.. ఈ వేడుక ముగింపు నాటికి 40 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అటు, బుధవారం మౌనీ అమావాస్య సందర్భంగా ఒక్కరోజే సుమారు 10 కోట్ల మంది వస్తారని అధికారులు భావిస్తున్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌ను నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు. సంగంకు వెళ్లే స్థానికులు ఫోర్ వీలర్లు కాకుండా.. టూ వీలర్లు వాడాలని ప్రభుత్వం సూచించింది. అటు, పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలతో నిఘా తీవ్రం చేశారు. మౌనీ అమావాస్య ప్రత్యేకత దృష్ట్యా ఈ నెల 28, 29, 30 తేదీల్లోప్రయాగ్‌రాజ్‌లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

అటు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. భారీగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గంటగంటకూ రైళ్లు నడుపుతోంది. మహా కుంభమేళాకు విచ్చేసే భక్తుల కోసం రైల్వే వివిధ మార్గాల్లో రైళ్లను నడుపుతుండగా, ప్రయాగ్ రాజ్ చుట్టుపక్కల స్టేషన్లలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అత్యంత రద్దీతో కూడిన స్టేషన్లలో ఒకటైన పండిట్ దీన్ దయాళ్ ఉపాద్యాయ్ జంక్షన్ వద్ద పరిస్థితిని నియంత్రించేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ప్యాసింజర్ హాలుతో పాటు స్టేషన్ ఆవరణలో భక్తులకు విశ్రాంతి కోసం హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. స్నానానికి వెళ్లే భక్తులందరినీ వీలైనంత త్వరగా స్నానానికి తీసుకెళ్లి.. అంతే త్వరగా తిరిగి రప్పించేలా గంట గంటకూ సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వే శాఖ చెబుతోంది. 

Also Read: Mona Lisa: పది రోజుల్లో పది కోట్లు సంపాదించిన మోసాలిసా - ఆమె ఏమంటున్నారో తెలుసా?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
SaiKrishna Custodial Death: గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
విజయవాడ గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
Embed widget