అన్వేషించండి

Family Survey Applications: రోడ్డు పక్కన కుప్పలుగా సమగ్ర కుటుంబ సర్వే దరఖాస్తు ఫారాలు, గతంలో ప్రజాపాలన అప్లికేషన్లు!

Telangana News | గతంలో ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై దర్శనమివ్వడం తెలిసిందే, తాజాగా సమగ్ర కుటుంబ సర్వే దరఖాస్తుల ఫారాలు మేడ్చల్ జిల్లాలో రోడ్డు పక్కన కుప్పలుగా కనిపించాయి.

Hyderabad News | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే అధికారుల వద్ద ఉండాల్సిన సమగ్ర సర్వే దరఖాస్తు ఫారాలు రహదారి పక్కన దర్శనమిచ్చాయి. అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు తాము చేపట్టామని చెప్పిన సర్వేకు సంబంధించిన ఫారాలు రోడ్డు పక్కన కుప్పలుగా కనిపించడంతో వాటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

రోడ్డు పక్కన సమగ్ర సర్వే దరఖాస్తులు
కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దరఖాస్తు ఫారాలు మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలోని 44వ జాతీయ రహదారిపై కనిపించాయి. పేదలకు, అన్ని వర్గాలకు మేలు చేయడం కోసమే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే మొదలుపెట్టింది. కానీ సమగ్ర సర్వే ఫారాలు రోడ్డు పక్కన కుప్పలుగా కనిపించడంతో అంతా షాకయ్యారు. సమాచారం అందుకున్న మేడ్చల్ మునిసిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని దరఖాస్తులు పరిశీలించారు. తమ సిబ్బందితో కలిసి సమగ్ర కుటుంబ సర్వే దరఖాస్తులను కారులో అక్కడి నుంచి ఆఫీసుకు తరలించినట్లు సమాచారం. 

గతంలో ప్రజాపాలన దరఖాస్తులు, ఇప్పుడు సమగ్ర సర్వే ఫారాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం. ప్రజలకు ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల పక్కన దర్శనమివ్వడం తెలిసిందే. ప్రజల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని చెప్పిన నేతలు.. ఇలా రోడ్లపై ఎలా పడేస్తారని అప్పట్లోనే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు ఫారాలను అన్ లైన్ లో అప్‌లోడ్ చేసేందుకు తీసుకెళ్తుండగా పొరపాటుగా రోడ్డుపై పడిపోయి ఉంటాయని అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు మేడ్చల్ జిల్లాలో రహదారి పక్కన పడేసినట్లు స్థానికులు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమాచారంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడుతున్నారు. 

తెలంగాణలో తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కచ్చితంగా కులగణన చేపడతామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. నిజామాబాద్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ సైతం ఇదే విషయాన్ని హామీ ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారం తాము సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. అందులో భాగంగా తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు పలుమార్లు వెల్లడించారు. సమగ్ర సర్వే కాదని, అది బోగస్ సర్వే అని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఆరు గ్యారంటీలు, రైతులకు రైతు బంధు, రైతు భరోసా నిధులు విడుదల చేయకుండా కాంగ్రెస్ సర్కార్ కాలయాప చేస్తుందని ఆరోపిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group 1 Results Cancel: టీజీపీఎస్సీకి ఎదురుదెబ్బ.. గ్రూప్ 1 ఫలితాలు రద్దు చేసిన హైకోర్టు, ఇదెక్కడి ట్విస్ట్!
టీజీపీఎస్సీకి ఎదురుదెబ్బ.. గ్రూప్ 1 ఫలితాలు రద్దు చేసిన హైకోర్టు, ఇదెక్కడి ట్విస్ట్!
PK Vs Revanth:  రేవంత్ రెడ్డిపై పగబట్టిన ప్రశాంత్ కిషోర్ - వదిలేది లేదని హెచ్చరిక - అసలేం జరిగిందంటే?
రేవంత్ రెడ్డిపై పగబట్టిన ప్రశాంత్ కిషోర్ - వదిలేది లేదని హెచ్చరిక - అసలేం జరిగిందంటే?
Pawan Kalyan News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించవచ్చా? పిటిషన్ విచారణ వాయిదా వేసిన హైకోర్టు
పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించవచ్చా? పిటిషన్ విచారణ వాయిదా వేసిన హైకోర్టు
Allu Business Park Controversy: అల్లు ఫ్యామిలీకి మరో షాక్... జీహెచ్‌ఎంసీ నుంచి నోటీసులు - కేసు ఏమిటంటే?
అల్లు ఫ్యామిలీకి మరో షాక్... జీహెచ్‌ఎంసీ నుంచి నోటీసులు - కేసు ఏమిటంటే?
Advertisement

వీడియోలు

Nandamuri Balakrishna Rings The Bell At NSE | నేషనల్ స్టాంక్ ఎక్స్ఛేంజ్ గంట కొట్టిన బాలయ్య | ABP Desam
Space Time and Space Fabric Explained | ఐన్ స్టైన్ ఎంత జీనియస్సో ప్రూవ్ అయిన సందర్భం | ABP Desam
Rohit Virat in Australia ODI Series | ఆస్ట్రేలియా సిరీస్ లో రో-కో ?
South Africa vs England ODI | సౌతాఫ్రికా ఘోర పరాజయం
India Won Hockey Asia Cup 2025 | హాకీ ఆసియా కప్ విజేతగా భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group 1 Results Cancel: టీజీపీఎస్సీకి ఎదురుదెబ్బ.. గ్రూప్ 1 ఫలితాలు రద్దు చేసిన హైకోర్టు, ఇదెక్కడి ట్విస్ట్!
టీజీపీఎస్సీకి ఎదురుదెబ్బ.. గ్రూప్ 1 ఫలితాలు రద్దు చేసిన హైకోర్టు, ఇదెక్కడి ట్విస్ట్!
PK Vs Revanth:  రేవంత్ రెడ్డిపై పగబట్టిన ప్రశాంత్ కిషోర్ - వదిలేది లేదని హెచ్చరిక - అసలేం జరిగిందంటే?
రేవంత్ రెడ్డిపై పగబట్టిన ప్రశాంత్ కిషోర్ - వదిలేది లేదని హెచ్చరిక - అసలేం జరిగిందంటే?
Pawan Kalyan News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించవచ్చా? పిటిషన్ విచారణ వాయిదా వేసిన హైకోర్టు
పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించవచ్చా? పిటిషన్ విచారణ వాయిదా వేసిన హైకోర్టు
Allu Business Park Controversy: అల్లు ఫ్యామిలీకి మరో షాక్... జీహెచ్‌ఎంసీ నుంచి నోటీసులు - కేసు ఏమిటంటే?
అల్లు ఫ్యామిలీకి మరో షాక్... జీహెచ్‌ఎంసీ నుంచి నోటీసులు - కేసు ఏమిటంటే?
Tirupati-Shirdi Train: తిరుపతి-షిర్డీ మధ్య ప్రతి రోజూ ట్రైన్- చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
తిరుపతి-షిర్డీ మధ్య ప్రతి రోజూ ట్రైన్- చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
Kajal Aggarwal Accident News: నేను బ్రతికే ఉన్నాను... చావలేదు - ఫేక్ న్యూస్‌పై కాజల్ అగర్వాల్ క్లారిటీ
నేను బ్రతికే ఉన్నాను... చావలేదు - ఫేక్ న్యూస్‌పై కాజల్ అగర్వాల్ క్లారిటీ
Andhra Pradesh Latest News: కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియా - చంద్రబాబు కీలక ఆదేశాలు- దర్నాకు సిద్ధమైన వైసీపీ 
కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియా - చంద్రబాబు కీలక ఆదేశాలు- దర్నాకు సిద్ధమైన వైసీపీ 
AP IPS Transfer: టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ - ఏపీలో సీనియర్ అధికారుల బదిలీలు -పూర్తి డీటైల్స్
టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ - ఏపీలో సీనియర్ అధికారుల బదిలీలు -పూర్తి డీటైల్స్
Embed widget