Allu Business Park Controversy: అల్లు ఫ్యామిలీకి మరో షాక్... జీహెచ్ఎంసీ నుంచి నోటీసులు - కేసు ఏమిటంటే?
Allu Arjun Family Latest News: అల్లు కుటుంబానికి మరో షాక్ తగిలింది. ఇటీవల ఆ కుటుంబంలో ఓ మరణం చోటు చేసుకుంది. అది పక్కన పెడితే... జీహెచ్ఎంసీ నుంచి ఆ ఫ్యామిలీకి నోటీసులు వచ్చాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), మెగా నిర్మాత అల్లు అరవింద్ కుటుంబం మరోసారి వివాదంలో చిక్కుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Greater Hyderabad Municipal Corporation) నుంచి వాళ్ళకు నోటీసులు వచ్చాయి. ఎందుకు? అసలు కారణం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
అల్లు బిజినెస్ పార్క్... అక్రమ నిర్మాణం
జూబ్లీహిల్స్ ప్రాంతంలో అల్లు కుటుంబానికి పలు భవనాలు ఉన్నాయి. అందులో అల్లు బిజినెస్ పార్క్ (Allu Business Park Hyderabad) ఒకటి. ఇది కమర్షియల్ బిల్డింగ్. అందులో పలు ఆఫీసులు, కాఫీ షాప్స్, రెస్టారెంట్స్ వంటివి నడుస్తున్నాయి.
అల్లు బిజినెస్ పార్క్ అక్రమ నిర్మాణం అని, దానిని ఎందుకు కూల్చకూడదో చెప్పాలని అల్లు కుటుంబానికి జిహెచ్ఎంసి సర్కిల్ 18 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: నేను బ్రతికే ఉన్నాను... చావలేదు - ఫేక్ న్యూస్పై కాజల్ అగర్వాల్ క్లారిటీ
హైదరాబాద్ ప్రభుత్వ అధికారులతో అల్లు కుటుంబానికి వివాదం ఏర్పడడం ఇది కొత్త ఏమీ కాదు. 'పుష్ప 2' విడుదలకు ముందు సంధ్య థియేటర్ దగ్గర ప్రీమియర్స్ వేసిన సందర్భంలో జరిగిన తొక్కిసలాట పలు వివాదాలకు దారి తీసింది. ఓ నిండు ప్రాణం పోవడంతో ఆ కేసు విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్క రోజు జైలులో ఉండి రావాల్సి వచ్చింది. ఇప్పుడు అల్లు కుటుంబానికి చెందిన మరో భవనంపై హైదరాబాద్ ప్రభుత్వ అధికారులకు కన్ను పడింది. ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.
అల్లు కుటుంబంలో ఇటీవల ఒక మరణం చోటు చేసుకుంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, మెగా నిర్మాత అల్లు అరవింద్ తల్లి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ కనకరత్నం మరణించారు. ఆవిడ ఎంతో గొప్ప జీవితాన్ని గడిపారని అందుకని తుది వీడ్కోలను సంతోషంగా చేస్తున్నామని అల్లు అరవింద్ పేర్కొన్నారు. ఈ సమయంలో జిహెచ్ఎంసి నుంచి నోటీసులో రావడం వాళ్ళను కాస్త ఇబ్బంది పెట్టే విషయం.
ట్రెండింగ్ వార్తలు





















