అన్వేషించండి

National Herald: నేషనల్ హెరాల్డ్ కేసు: ఈడీ ముందు హాజరైన మాజీ మంత్రి గీతారెడ్డి

యంగ్‌ ఇండియా లిమిటెడ్‌కు విరాళాలు ఇచ్చిన వారికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసి విచారణ చేస్తోంది.

నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఒక్కొక్కరూ ఈడీ విచారణకు హాజరు అవుతున్నారు. నేడు మాజీ మంత్రి గీతారెడ్డి వంతు వచ్చింది. ఆమె నేడు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అప్పట్లో యంగ్‌ ఇండియా లిమిటెడ్‌కు విరాళాలు ఇచ్చిన వారికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసి విచారణ చేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గీతా రెడ్డితోపాటు గాలి అనిల్ కుమార్ నేడు విచారణకు హాజరయ్యారు. ఈ నెల 3న మాజీ మంత్రి షబ్బీర్ అలీని ఈడీ విచారణ చేసింది.

నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఐదుగురు కాంగ్రెస్ నేతలు ఈడీ నోటీసులు అందుకున్నారు. వారిలో తెలంగాన నేతలు సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, గీతా రెడ్డి, అనిల్ కుమార్‌ ఉన్నారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది.

సెప్టెంబర్‌ 23న నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రులు గీతా రెడ్డి, సుదర్శన్‌ రెడ్డితో పాటు, మాజీ ఎంపీ అంజన్‌ యాదవ్‌, షబ్బీర్‌ అలీ, మాజీ ఎంపీ రేణుకా చౌదరికి కూడా నోటీసులు జారీచేసింది. వీరిని ఒక్కొక్కరుగా ఈడీ విచారణ చేస్తోంది. అక్టోబర్‌ 4న (మంగళవారం) కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ ఈడీ ఎదుటకు రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆయన హాజరు కాలేదు. ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల ఆయన హాజరు కాలేదని తెలుస్తోంది. 

నేషనల్ హెరాల్డ్ కేసులో జాతీయ స్థాయిలో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీని ఈడీ విచారణ చేసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ గాంధీలను ఈడీ ప్రశ్నించింది. మొదట్లో రాహుల్‌ గాంధీని సుదీర్ఘంగా విచారణ చేసి ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ తర్వాత సోనియా గాంధీని విచారణకు పిలిచింది. అయితే, ఆ ఇద్దరి నుంచి ఒకే రకమైన సమాధానాలు రావడంతో మూడో రౌండ్ విచారణ కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈడీ అధికారులు 6 గంటల పాటు సోనియాను ప్రశ్నించింది.

జూన్‌ 13, 14, 15 తేదీల్లో రాహుల్‌ గాంధీని ఈడీ 30 గంటలకు పైగా విచారణ చేసింది. వరుసగా మూడు రోజులు ఈడీ ప్రశ్నలను ఎదుర్కొన్నారు. జూన్‌ 16న కూడా విచారణ జరగాల్సి ఉండగా రాహుల్‌ అభ్యర్థన మేరకు ఈడీ ఒకరోజు విరామమిచ్చింది. ఆస్పత్రిలో ఉన్న తన తల్లి సోనియా గాంధీ బాగోగులు చూసుకోవాల్సి ఉందని కోరడంతో రాహుల్ విచారణ వాయిదా వేసింది. 

ఈ కేసులో సోనియాను కూడా జూన్ 23న ఈడీ విచారణకు పిలిచింది. యంగ్‌ ఇండియన్, ఏజేఎల్, నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారాల్లో రాహుల్‌ కీలక వ్యక్తి గనుక ఆయన వాంగ్మూలం చాలా కీలకమని ఈడీ వర్గాలు అంటున్నాయి. సోనియా గాంధీని మూడు రోజులపాటు రోజుకు మూడు గంటల పాటు ఈడీ ప్రశ్నించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget