అన్వేషించండి

Etela Rajender: అప్పుడు మొఘల్ పాలకులు, ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు గుడులు కూల్చుతున్నారు: ఈటెల రాజేందర్

HYDRA News | గతంలో మెఘల్ పాలకులు సనాతన ధర్మంపై దాడికి దిగి ఆలయాలను ధ్వంసం చేశారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలకులు ఆలయాలు కూల్చుతున్నారని ఈటెల రాజేందర్ ఆరోపించారు.

Etela Rajender visits temples in Jagadgirigutta మేడ్చల్: జగద్గిరిగుట్ట డివిజన్‌లో గుట్టపై ఉన్న 17 ఆలయాలను కూల్చివేయానికి హైడ్రా కమిషనర్ నోటీసులు జారీ చేయడం దుమారం రేపుతోంది. పలు సామాజిక వర్గాల వారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ను ఆశ్రయించి, తమ సమస్యను పరిష్కరించాలని కోరడంతో ఆయన శనివారం నాడు జగద్గిరిగుట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం బీజేపీ నేత ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ..  60, 70 ఏళ్ల కిందట పలు ప్రాంతాల నుంచి పొట్ట చేతపట్టుకుని ఇక్కడికి వస్తే ఆశ్రయం ఇచ్చిన గడ్డ జగద్గిరిగుట్ట. కులాల, మతాలు అనే వ్యత్యాసం లేకుండా 30 నుంచి 80 గజాలలో ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. ఇక్కడ వారు ఆయా కులాలు, మతాలకు అనుగుణంగా గుడులు నిర్మించుకుని పూజించుకుంటున్నారు. వారి ఆలయాలను కూల్చివేస్తామని నోటీసులు ఇవ్వడం అత్యంత దారుణం, దుర్మార్గం అని ఈటల వ్యాఖ్యానించారు. 

కూల్చేది ఇటుకలు, సిమెంట్‌ను కాదు..

‘హైడ్రా అధికారులు జగద్గిరిగుట్లలోని ఈ ఆలయాలను కూల్చివేస్తామని నోటీసులు ఇచ్చారు. అయితే అధికారులు నోటీసులు ఇచ్చింది, కూల్చివేయబోతున్నది కేవలం సిమెంట్, ఇటుకలను, గోడల్ని కాదు. ఇవి ప్రజల నమ్మకాలు, ప్రజల విశ్వాసం. ఈ కాంపాండ్ గోడల్ని కూల్చివేయడం అంటే సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులు. మా గుండెలపై జరుగుతున్న దాడి. ఆనాడు ఎక్కడనుంచో విదేశాల నుంచి వచ్చిన మొఘలాలలు మా ఆలయాలపై దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు అదే తీరుగా వ్యవహరిస్తున్నారు.

నోటీసులు వెనక్కి తీసుకోకపోతే అంతే..

పరాయి ప్రాంతాల నుంచి వచ్చిన విదేశీ పాలకులు ఆనాడు సనాతన ధర్మంపై ఎన్నో దండయాత్రలు, మన ఆలయాలు దురాక్రమణ చేసి విధ్వంసానికి పాల్పడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా గుడులకు నోటీసులు ఇచ్చింది. ఈ 17 ఆలయాలకు ఇచ్చిన నోటీసులను ప్రభుత్వం బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. ఇక్కడి ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలపై దాడి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. స్థానిక ఎంపీగా నియోజకవర్గ ప్రజల కోసం పోరాటం చేస్తా. వారి కాళ్లల్లో ముల్లు గుచ్చుకంటే పంటితో పీకేస్తా. వారి కోసం ఎంతదాకైనా వస్తానని’ తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు.

చిన్నారులు ఆలయంలో ఎందుకున్నారని ఆరా..

ఆలయం వద్ద కొందరు బాలురు మంత్రోచ్ఛరణ చేస్తుంటే ఇంత చిన్న వయసులో ఎందుకు ఇక్కడ ఉన్నారని, తల్లిదండ్రులకు ఈ విషయం తెలుసా అని ఎంపీ ఈటల రాజేందర్ ఆలయ అర్చకులను అడిగారు. ఏడో తరగతికి కొందరు బాలురు వచ్చి మంత్రాలు, పూజా విధానం నేర్చుకుంటారని చెప్పారు. వారు వేద పాఠశాలల విద్యార్థులు అని, చాలా ఆలయాలకు ఇదే విధంగా స్కూల్ దశలోనే వారు వచ్చి మంత్రోచ్ఛరణ, పూజల ప్రక్రియ తెలుసుకుంటారని వివరించారు. అనంతరం మళ్లీ వేద పాఠశాలకు వెళ్తే ప్రాక్టికల్స్ నిర్వహిస్తారని.. అలాగ వారి కెరీర్ మొదలవుతుందని ఈటలకు తెలిపారు. సమస్య ఏదైనా ఉంటే తనకు సమాచారం ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చివేతలను ఉపేక్షించేది లేదని.. ఇది సనాతన ధర్మంపై జరుగుతున్న దాడిగా ఈటల రాజేందర్ అభివర్ణించారు.

Also Read: Kishan Reddy Letter to Bhatti Vikramarka: అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget