అన్వేషించండి

Srushti Fertility Centre: సృష్టి హాస్పిటల్ కేసులో కీలక పరిణామం- రంగంలోకి దిగిన ఈడీ, పోలీసులకు లేఖ

Srushti Hospital Case: సృష్టి హాస్పిటల్ కేసులో మనీలాండరింగ్ జరిగిందని పోలీసులు గుర్తించడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. కేసు వివరాలను తమకు ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులకు లేఖ రాసింది.

Srushti Fertility Centre In Hyderabad | హైదరాబాద్: సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసు తీవ్రత జాతీయ స్థాయికి చేరింది. డాక్టర్ నమ్రత (Dr Athaluri Namratha)కు చెందిన సృష్టి హాస్పిటల్‌ పెద్ద ఎత్తున నగదు లావాదేవిలు జరపడంతో మనీల్యాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సృష్టి హాస్పిటల్‌ కేసులో  Enforcement Directorate (ఈడీ) రంగ ప్రవేశం చేసింది. తమకు కేసు వివరాలను తెలియజేయాలని ఈడీ అధికారులు హైదరాబాద్ పోలీసులకు లేఖ రాశారు.

8 రాష్ట్రాల్లో కార్యకలాపాలు

డాక్టర్ నమ్రత సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో 8 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగించినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 80 మంది పిల్లలను విక్రయించి రూ.25 కోట్ల వరకు వసూలు చేసినట్లు భావిస్తున్నారు. ఆ డబ్బును డాక్టర్ నమ్రత విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నమ్రతా  బ్యాంక్ ఖాతాలతోపాటు, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ బ్యాంక్ లావాదేవీలను పరిశీలించిన అధికారులు మనీ లాండరింగ్ జరిగిందని గుర్తించారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ నమ్రత ఎనిమిది రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలతో ఈడీ రంగంలోకి దిగింది.

సంతానలేమితో వస్తున్న దంపతులే ఆమె టార్గెట్

సంతానం కలగడం లేదని ఆస్పత్రికి వస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని ఐవీఎఫ్ విధానంలో పిల్లలు పుడతారని నమ్మించి వారి వద్ద నుంచి లక్షల రూపాయాల్లో వసూలు చేసినట్లు డాక్టర్ నమ్రతపై ఆరోపణలున్నాయి. బిక్షాటన చేసేవారు, మద్యం తాగడానికి డబ్బుల కోసం చూసే వారిని తీసుకెళ్లి వారికి వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చి వారి వద్ద నుంచి స్పెర్మ్ కలెక్ట్ చేసి ఐవీఎఫ్ చేశారని సైతం ఆరోపణలు వచ్చాయి. ఆపై నవజాత శిశువులను కొనుగోలు చేసి వారినే ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలు అని డాక్టర్ నమ్రత, హాస్పిటల్ సిబ్బంది ఎందరో దంపతుల నుంచి లక్షల రూపాయల చొప్పున వసూళ్లకు పాల్పడ్డారు.

నిందితులు అరెస్ట్

ఇటీవల విజయవాడ పోలీసులు ఒక నవజాత శిశువును అమ్ముతున్న గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్‌లో అజిత్‌సింగ్ నగర్‌కు చెందిన ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ గ్యాంగ్ హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తూ పిల్లలను అమ్ముతున్నట్లు పోలీసులు  తెలిపారు. విజయవాడలో ఇలాంటి మూడు నుంచి నాలుగు గ్యాంగ్లు క్రియాశీలంగా ఉన్నాయని సమాచారం. ఈ గ్యాంగ్లకు సృష్టి హాస్పిటల్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ గ్యాంగ్ సభ్యులు సృష్టి హాస్పిటల్ హైదరాబాద్ ఆఫీస్, విజయవాడ బ్రాంచ్‌ను సైతం సందర్శించినట్లు పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ కేసులో పోలీసులు ఇదివరకే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. డాక్టర్ నమ్రత కేసు విచారణలో పోలీసులకు సహకరించడం లేదు. పైగా త్వరలోనే బయటకు వచ్చాక తనను ఇబ్బంది పెట్టిన వారి సంగతి చూస్తానని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏపీలో జరిగిన దానికి హైదరాబాద్ లో కేసు నమోదు విచారణ చేపట్టారని ఆమె తరఫు లాయర్లు కోర్టులో పిటిషన్ వేశారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget