అన్వేషించండి

Srushti Fertility Centre: సృష్టి హాస్పిటల్ కేసులో కీలక పరిణామం- రంగంలోకి దిగిన ఈడీ, పోలీసులకు లేఖ

Srushti Hospital Case: సృష్టి హాస్పిటల్ కేసులో మనీలాండరింగ్ జరిగిందని పోలీసులు గుర్తించడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. కేసు వివరాలను తమకు ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులకు లేఖ రాసింది.

Srushti Fertility Centre In Hyderabad | హైదరాబాద్: సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసు తీవ్రత జాతీయ స్థాయికి చేరింది. డాక్టర్ నమ్రత (Dr Athaluri Namratha)కు చెందిన సృష్టి హాస్పిటల్‌ పెద్ద ఎత్తున నగదు లావాదేవిలు జరపడంతో మనీల్యాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సృష్టి హాస్పిటల్‌ కేసులో  Enforcement Directorate (ఈడీ) రంగ ప్రవేశం చేసింది. తమకు కేసు వివరాలను తెలియజేయాలని ఈడీ అధికారులు హైదరాబాద్ పోలీసులకు లేఖ రాశారు.

8 రాష్ట్రాల్లో కార్యకలాపాలు

డాక్టర్ నమ్రత సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో 8 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగించినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 80 మంది పిల్లలను విక్రయించి రూ.25 కోట్ల వరకు వసూలు చేసినట్లు భావిస్తున్నారు. ఆ డబ్బును డాక్టర్ నమ్రత విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నమ్రతా  బ్యాంక్ ఖాతాలతోపాటు, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ బ్యాంక్ లావాదేవీలను పరిశీలించిన అధికారులు మనీ లాండరింగ్ జరిగిందని గుర్తించారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ నమ్రత ఎనిమిది రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలతో ఈడీ రంగంలోకి దిగింది.

సంతానలేమితో వస్తున్న దంపతులే ఆమె టార్గెట్

సంతానం కలగడం లేదని ఆస్పత్రికి వస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని ఐవీఎఫ్ విధానంలో పిల్లలు పుడతారని నమ్మించి వారి వద్ద నుంచి లక్షల రూపాయాల్లో వసూలు చేసినట్లు డాక్టర్ నమ్రతపై ఆరోపణలున్నాయి. బిక్షాటన చేసేవారు, మద్యం తాగడానికి డబ్బుల కోసం చూసే వారిని తీసుకెళ్లి వారికి వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చి వారి వద్ద నుంచి స్పెర్మ్ కలెక్ట్ చేసి ఐవీఎఫ్ చేశారని సైతం ఆరోపణలు వచ్చాయి. ఆపై నవజాత శిశువులను కొనుగోలు చేసి వారినే ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలు అని డాక్టర్ నమ్రత, హాస్పిటల్ సిబ్బంది ఎందరో దంపతుల నుంచి లక్షల రూపాయల చొప్పున వసూళ్లకు పాల్పడ్డారు.

నిందితులు అరెస్ట్

ఇటీవల విజయవాడ పోలీసులు ఒక నవజాత శిశువును అమ్ముతున్న గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్‌లో అజిత్‌సింగ్ నగర్‌కు చెందిన ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ గ్యాంగ్ హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తూ పిల్లలను అమ్ముతున్నట్లు పోలీసులు  తెలిపారు. విజయవాడలో ఇలాంటి మూడు నుంచి నాలుగు గ్యాంగ్లు క్రియాశీలంగా ఉన్నాయని సమాచారం. ఈ గ్యాంగ్లకు సృష్టి హాస్పిటల్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ గ్యాంగ్ సభ్యులు సృష్టి హాస్పిటల్ హైదరాబాద్ ఆఫీస్, విజయవాడ బ్రాంచ్‌ను సైతం సందర్శించినట్లు పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ కేసులో పోలీసులు ఇదివరకే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. డాక్టర్ నమ్రత కేసు విచారణలో పోలీసులకు సహకరించడం లేదు. పైగా త్వరలోనే బయటకు వచ్చాక తనను ఇబ్బంది పెట్టిన వారి సంగతి చూస్తానని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏపీలో జరిగిన దానికి హైదరాబాద్ లో కేసు నమోదు విచారణ చేపట్టారని ఆమె తరఫు లాయర్లు కోర్టులో పిటిషన్ వేశారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Embed widget