అన్వేషించండి

Bandi Sanjay challenges to KTR: ట్యాపింగ్ చేయించలేదని ప్రమాణం చేస్తావా - కేటీఆర్‌కు బండి సంజయ్ సవాల్

Bandi Sanjay : ట్యాపింగ్ చేయించలేదని ప్రమాణం చేయాలని కేటీఆర్‌కు బండి సంజయ్ సవాల్ చేశారు. ఆలయంపై నమ్మకం లేకపోతే చర్చికి, మసీదుకు వెళదామన్నారు.

Bandi Sanjay challenges KTR to swear on Taping: ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ లీగల్ నోటీసులు ఇవ్వడంపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు.  నేను ఏం తప్పు చేప్పిన? సాక్షాత్తు మీ చెల్లెలు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పారు కదా? ఆమెకు లీగల్ నోటీసులిస్తారా? రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో  కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పారు కదా? ఆ విషయం  కోర్టు ముందుంది.  ఆయనకు నోటీసులిస్తావా? అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే కేసీఆర్, ఆయన కొడుకు ఎప్పటికీ జైల్లోనే ఉంటారని అన్నారు.  వాళ్లు తిట్టని తిట్లు లేవు. మాట్లాడని బూతుల్లేవు. చేయని తప్పులు లేవు. జరపని అవినీతి లేదు... నోటీసులిస్తే.. ఏం చేయాలో తనకు తెలుసని బండి సంజయ్ అన్నారు.  

ఒక రాజకీయ నాయకుడివై ఉండి నేరుగా ఎదుర్కొనే దమ్ములేక చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లీగల్ నోటీసులతో బెదిరించాలనుకోవడం అంతకంటే మూర్ఖత్వం లేదని విమర్శించారు.  ఆ  నోటీసులకు భయపడే వ్యక్తిత్వం నాది. అయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లో రాలేదు. దేశం కోసం, ధర్మ రక్షణ కోసం రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసి జైలుకు పోయి వచ్చినోడినని గుర్తు చేశారు.  

ఏ గుడికి అంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా... నువ్వు కూడా నీ భార్యా, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి గుడికి వస్తావా? వచ్చి ఫోన్ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదు? అని ప్రమాణం చేయిస్తావా?... నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నేను, నా కుటుంబ సభ్యులంతా ప్రమాణం చేస్తాం. నీకు ఆలయంపై నమ్మకం లేదంటే మసీదు, చర్చికైనా వెళదాం. ప్రమాణానికి సిద్ధమా? నా సవాల్ కు స్పందించాలని కోరుతున్నానన్నారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు, శరం, రోషం ఉంటే ఆ పార్టీని వదిలి బయటకు రావాలి. ఎందుకంటే ఆనాడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుసహా అందరి ఫోన్లను ట్యాప్ చేశారు. అయినా మీరు ఇంకా ఎట్లా బీఆర్ఎస్ లో ఉంటున్నారో అర్ధం కావడం లేదన్నారు.

ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరిపించాలనే విషయంలో మాకు స్పష్టత ఉంది. ఎందుకంటే సిట్ పరిమితి చాలా తక్కువ. ఎందుకంటే మావోయిస్టుల పేరు చెప్పి రాజకీయ ప్రముఖుల, సినీ తారల, వ్యాపారుల, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్  చేసి వసూళ్లకు పాల్పడ్డారు. ఆ డబ్బుల లావాదేవీలకు సంబంధించి పూర్తిస్థాయి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే.. ఈడీ మాత్రమే విచారణ చేస్తేనే అది సాధ్యమవుతుంది. అట్లాగే టెలికం రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలను ఉల్లంఘించి కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించింది. ఇది పూర్తిగా కేంద్ర పరిధిలోని అంశం... ఎస్ఐబీ చీఫ్ గా ప్రభాకర్ రావును నియమించడం కేంద్ర హోంశాఖ నిబంధనలకు విరుద్ధం. ఎందుకంటే ఎస్ఐబీ చీఫ్ గా నియమితులైన వ్యక్తి ఐజీ స్థాయి అధికారి అయి ఉండాలి. కానీ ప్రభాకర్ రావు అప్పటికే రిటైర్డ్ అయ్యారని గుర్తు  చేశారు.   ప్రభాకర్ రావు ఐజీగా కొనసాగుతున్నారని కేంద్ర హోంశాఖకు కేసీఆర్ తప్పుడు సమాచారమిచ్చి ఎస్ఐబీ చీఫ్ గా నియమించారు. అట్లాగే జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు సిట్ పోలీసులు ఆధారాలతోసహా వెల్లడించారు. జడ్జీలకు నోటీసులిచ్చి పిలిచి స్టేట్ మెంట్ రికార్డ్ చేసే అధికారం సిట్ కు ఉందా? అది జరిగే పనికాదు.   ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రుల ఫోన్లను కూడా గత ప్రభుత్వం ట్యాప్ చేసింది. ఆ ఆధారాలు సిట్ వద్ద ఉన్నాయన్నారు. 

భార్యభార్తల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచులు మీరు. అసలు ఎస్ఐబీ దేని కోసం పనిచేయాలి? మావోయిస్టుల కదలికల కోసం పనిచేయాలి కదా? ఎంతో మంది ఎస్ఐబీ అధికారులు మావోయిస్టుల చేతిలో బలయ్యారని తెలియదా? అని ప్రశ్నించారు.  సిట్ అధికారులపై మాకు నమ్మకం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా ఈ రేసుసహా అనేక కేసుల్లో విచారణ పేరుతో జాప్యం చేస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని  బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కల్వకుంట్ల కవితకు కూడా నోటీసులిచ్చి విచారణ జరపాలని కోరుతున్నానన్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?
నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?
Moinabad Farmhouse Case: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Embed widget