అన్వేషించండి

E Bikes: స్క్రాప్ నుంచి ఈ-బైక్స్ రూపొందిస్తున్న హైదరాబాదీ, స్పెషాలిటీ తెలిస్తే వావ్ అనాల్సిందే

పాత బైక్‌లను ఎలక్ట్రానిక్ వాహనాలుగా మారుస్తూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మాజ్ అహ్మద్ ఖాన్. గత ఏడాదిన్నర నుంచి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి కృషి చేస్తున్నారు.

Electric Bikes:  మీ దగ్గర ఏదైనా పాత బైక్ ఉందనుకోండి. దాన్ని చాలా మంది త్పరగా తీసేయడానికి ఇష్టపడరు. సెంటిమెంట్ గానో మరొకరికి అమ్మకుండా దాన్నే వాడుతుంటారు. దాంతో ఆ బైక్స్ కాలుష్యానికి కారణం అవుతాయి. అలాంటి స్క్రాప్ కు వెళ్లే బైక్స్ ను ఈ బైక్స్ లా మార్చుకోవచ్చు అంటున్నాడో యువకుడు. పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

Hyderabad  News: హైదరాబాద్ కి చెందిన ఓ ఇంజినీర్ పాత బైక్‌లను ఎలక్ట్రానిక్ వాహనాలుగా మారుస్తూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మాజ్ అహ్మద్ ఖాన్ గత ఏడాదిన్నర నుంచి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి కృషి చేస్తున్నారు. పాత బైక్‌లను పూర్తిగా ఎలక్ట్రిక్ బైక్‌లుగా మార్చాలని నిర్ణయించాడు. ఈ దిశగా అడుగులు వేస్తూ ఇప్పటివరకు ఎన్నో వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేశాడు.

రోజు రోజుకి పెరుగుతున్న వాహనాల సంఖ్య మూలంగా నగరం లో ఇప్పటికే ట్రాఫిక్ సమస్యలు అటు పోలీసులకు, ఇటు వాహనదారులకు సవాలు విసురుతున్నాయి. ట్రాఫిక్ లో వచ్చే పొల్యూషన్ కారణంగా ఈ మధ్య కాలంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భంలో జనాలకు ఒక రకమైన భయం ఉండిపోయింది. అలాంటివారికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ వాహనంలో బ్యాటరీతో ప్రమాదం పొంచి ఉందంటే తక్షణమే ఈ వాహనం ఆగిపోతుంది. ప్రమాదం జరిగే అవకాశం అసలు ఉండదు. ఇదే ఈయన చేస్తున్న వాహనాల ప్రత్యేకత

బ్యాటరీ అప్‌డేట్..
ఈ బ్యాటరీ వెహికల్స్ లో రెండు రకాలుగా అమర్చారు.1. ఇంజిన్, తీసేసి ఆ ప్లేస్ లో బ్యాటరీ ని అమర్చడం, 2. ఇంజిన్ తో పాటు పెట్రోల్ వెసులుబాటు అమర్చడం. దాంతో మనకు కావాలనుకునపుడు పెట్రోల్ లేదా బ్యాటరీతో వాహనం డ్రైవ్ చేయవచ్చు. అయితే బ్యాటరీ బాగా వేడేక్కినా, లేదా ఏదైనా ప్రమాదం పొంచి ఉందంటే గుర్తించి ముందుగానే బండి ఆగిపోతుందని అహ్మద్ ఖాన్ చెబుతున్నారు.

సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఈ వాహనం ధర దాదాపు రూ. 50వేలు ఉంటుంది. ఇది కేవలం ద్విచక్రవాహనమే కాకుండా ఆటో, ఫోర్ వీలర్ తో కూడా మరిన్ని అడుగులు వేస్తున్నారు. దేశ వ్యాప్తంగా నలుమూలల ఈ వాహనంపై ఇప్పటికే ప్రజల్లో అవగాహన మొదలయింది. ఇప్పటివరకు సుమారు 750 వాహనాల ఆర్డర్ లు  వచ్చాయని మాజ్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఇలాంటి వాహనాల వాడకంతో క్రమంగా పెట్రోల్ వాహనాల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఇలా పాత వాటిని రీ మోడల్ చేస్తే కొత్త బైక్ అవసరం ఉండదు. వాటికి రిజిస్ట్రేషన్ చేయాలని పని తప్పుతుంది.

ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ వాహనాలను తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోంది. వీటి వల్ల కాలుష్యం ఉండదు కనుక ప్రభుత్వ రాయితీలు పొందవచ్చు. ఎలక్ట్రిక్ బైక్ లకు రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. డ్రైవింగ్ లెసెన్స్ లేకుండా సైతం ఈ ఎలక్ట్రిక్ స్కూటీ, ఎలక్ట్రిక్ బైక్‌లను వాడేందుకు ప్రభుత్వాలు నూతన విధానాలు తీసుకొస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tragedy in AP: ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం

వీడియోలు

Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tragedy in AP: ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Samantha Raj Nidimoru: భర్త రాజ్ నిడిమోరుతో సమంత... ఈ ఫోటోలు ఇంతకు ముందుకు చూసి ఉండరు
భర్త రాజ్ నిడిమోరుతో సమంత... ఈ ఫోటోలు ఇంతకు ముందుకు చూసి ఉండరు
Vrusshabha Box Office Collection Day 1: వృషభ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ - మోహన్ లాల్ మ్యాజిక్ పనిచేయలేదు... మొదటి రోజు మరీ ఇంత తక్కువా?
వృషభ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ - మోహన్ లాల్ మ్యాజిక్ పనిచేయలేదు... మొదటి రోజు మరీ ఇంత తక్కువా?
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Embed widget