అన్వేషించండి

CM Revanth Reddy: చార్మినార్ అగ్ని ప్రమాదంలో 16 మంది మృతి, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

Charminar Tragedy | హైదరాబాద్‌లోని చార్మినార్ గుల్జార్‌ హౌస్‌ సమీపంలో ఓ భవనంలో మంటలు చెలరేగిన ఘటనలో 16 మంది చనిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హైదరాబాద్: నగరంలోని పాత బస్తీ చార్మినార్ గుల్జార్‌ హౌస్‌ సమీపంలో ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదం(Charminar Fire Accident)పై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం ఘటనలో మొదట 8 మంది మృతిచెందారు. చికిత్స పొందుతూ మరో 8 మంది చనిపోగా, మృతుల సంఖ్య 16కి చేరుకుంది. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ను పోలీస్​, ఫైర్​ విభాగం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్​లోని పాత బస్తీలో గుల్జార్‌ హౌస్‌ సమీపంలో జరిగిన  అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులను అడిగి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక కుటుంబాలతో ఫోన్ లో పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడుతామని, మెరుగైన వైద్య చికిత్స చేయిస్తామని భరోసా ఇచ్చారు. అగ్నిప్రమాదం సంభవించి ఏకంగా 16 మంది చనిపోవడం బాధాకరం అన్నారు.


CM Revanth Reddy: చార్మినార్ అగ్ని ప్రమాదంలో 16 మంది మృతి, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

బాధిత కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఐజీ నాగిరెడ్డిని ఆదేశించారు. ఇరుకైన గల్లీ కావడంతో సహాయక చర్యలకు ఇబ్బంది తలెత్తుతుందని సమాచారం.

8  మంది మృతులను ఆరుషి జైన్‌ (17), అభిషేక్‌ మోడీ (30), షీతల్‌ జైన్‌ (37), ఇరాజ్‌ (2), హర్షాలి గుప్తా (7), రాజేందర్‌ కుమార్‌ (67), సుమిత్ర (65), మున్నిబాయి (72)లుగా పోలీసులు గుర్తించారు.


CM Revanth Reddy: చార్మినార్ అగ్ని ప్రమాదంలో 16 మంది మృతి, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి 

మంటల్లో చిక్కుకున్న పలువురిని పోలీసులు, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది బిల్డింగ్ నుంచి బయటకు తీసుకొచ్చి.. వారిని చికిత్స నిమిత్తం మలక్ పేట యశోద, అపోలో, డీఆర్‌డీవో, ఉస్మానియా హాస్పిటల్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కానీ అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. మంటల్లో కాలిపోయి కొందరు, పొగ పీల్చడంతో కొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని పరీక్షించిన వైద్యులు పలువురు చనిపోయినట్లు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్ లోపల 30 మంది వరకు ఉన్నట్టు సమాచారం. ఓవైపు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతూ, మరోవైపు కాలిన గాయాలైన వారిని రెస్క్యూ చేసి అంబులెన్సులలో ఆసుపత్రులకు తరలించారు.

అగ్నిమాపక సిబ్బందికి మెరుగైన శిక్షణ అవసరం: కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గుల్జార్‌హౌస్‌ వద్ద ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఉదయం 6 గంటలకు ప్రమాదం చోటుచేసుకోగా, సహాయక చర్యల్లో జాప్యం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. చిన్న ప్రమాదమే అయినప్పటికీ, ప్రాణ నష్టం అధికంగా ఉందని.. సరైన సమయంలో రెస్క్యూ ఆపరేషన్ చేపడితే మెరుగైన ఫలితాలు వచ్చేవయన్నారు. అగ్నిమాపక సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం సరైన పరికరాలు, మెరుగైన శిక్షణ అందించాల్సి ఉందన్నారు. అగ్నిమాపక శాఖ టెక్నాలజీ మెరుగుపరుచుకోవాలని, సాధ్యమైనంత త్వరగా సహాయక చర్యలు చేపడితే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget