అన్వేషించండి

KCR: మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత.. నేడు అంత్యక్రియలకు జహీరాబాద్‌కు సీఎం కేసీఆర్

మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మైనారిటీ నేతగా, ప్రజాప్రతినిధిగా వారు చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు

మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత మహమ్మద్‌ ఫరీదుద్దీన్‌ (64) హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఏఐజీ అస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొన్ని రోజులుగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన డిసెంబరు 15న అస్పత్రిలో చేరారు. ఆయనకు ఆస్పత్రిలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

కేసీఆర్ సంతాపం
మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మైనారిటీ నేతగా, ప్రజాప్రతినిధిగా వారు చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. ఫరీదుద్దీన్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఫరీదుద్దీన్ మృతి పట్ల మంత్రులు హరీశ్ రావు, కొప్పులు ఈశ్వర్, జగదీష్ రెడ్డి, తదితర నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఫరీదుద్దీన్ అంత్యక్రియలు నేడు జహీరాబాద్‌లో జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు.

కాంట్రాక్టర్ నుంచి మంత్రిగా..
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలంలోని హోతి(బి) గ్రామానికి చెందిన ఫరీదుద్దీన్‌ 1959, అక్టోబరు 14న జన్మించారు. ఆయన తండ్రి ఎండీ ఫక్రొద్దీన్‌ ఉపాధ్యాయుడు. బీకాం వరకు చదివిన ఫరీదుద్దీన్‌ 1978లో కాంగ్రె్‌సలో క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు. వృత్తి పరంగా ఫరీదుద్దీన్‌ ఏవన్‌ కాంట్రాక్టర్‌. ఆయన మొదట సర్పంచుగా, అనంతరం జహీరాబాద్‌ వైస్‌ ఎంపీపీగా 1985 నుంచి 90 వరకు పనిచేశారు. 1992-1995 వరకు పీఏసీఎస్‌ ఇప్పెపల్లి సొసైటీకి చైర్మన్‌గా సేవలందించారు. 1990-1999 వరకు కాంగ్రెస్‌ జహీరాబాద్‌ మండలాధ్యక్షుడిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1999, 2004 ఎన్నికల్లో జహీరాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో సీఎం రాజశేఖర్‌రెడ్డి కేబినేట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జహీరాబాద్‌ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌ కావడంతో హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం టీఆర్‌ఎ్‌సలో చేరారు.

2016లో ఎమ్మెల్యేల కోటలో ఫరీదుద్దీన్‌ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఫరీదుద్దీన్‌ ఎమ్మెల్సీ పదవీకాలం 2021, జూలై 3న ముగిసింది. అనంతరం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఫరీదుద్దీన్‌ మరణం పట్ల సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఫరీదుద్దీన్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Also Read: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్నారా ? ఇదిగో ఈ రూల్స్ అన్నింటినీ గుర్తు పెట్టుకోండి..

Also Read: KTR: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
KTR Fires On Revanth Reddy:
"యువకులు ఆ*త్మహత్యలు చేసుకుంటున్నారు, జాబ్‌క్యాలెండర్‌ ఏమైంది?" ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget