అన్వేషించండి

బిహార్ ఎన్నికలు 2025

(Source:  ECI | ABP NEWS)

Asaduddin Owaisi: ఈ ఎన్నికలతో మోదీ, షాకు మాత్రమే ఇబ్బంది - జమిలి ఎన్నికలపై స్పందించిన ఒవైసీ

Hyderabad News: ఎక్స్ వేదికగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇలా స్పందించారు. ఒకే దేశం - ఒకే ఎన్నికలు ఆచరణాత్మకం కాదని అన్నారు. దీనివల్ల ఫెడరలిజం దెబ్బ తింటుందని అన్నారు.

Asaduddin Owaisi on One nation One Election: కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న దిశగా దేశమంతా ఒకేసారి ఎన్నికలు (జమిలి ఎన్నికలు) నిర్వహించే అంశాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు సంబంధించి కేంద్రం మరో అడుగు వేసిన సంగతి తెలిసిందే. సంబంధిత రిపోర్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికల విషయంలో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్రం ఓ కమిటీని కొద్ది నెలల క్రితం నియమించగా.. తాజాగా నివేదికను సమర్పించింది. ఆ నివేదికను ఆమోదిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నివేదికను గతంలో రాష్ట్రపతికి కూడా రామ్ నాథ్ కోవింద్ సమర్పించారు. ఇందులో వన్ నేషన్, వన్ ఎలక్షన్ విధానాలకు అనుకూలంగా ఆయన ప్రతిపాదనలు చేశారు. తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై బిల్లులు పెట్టి ఆమోదింపచేసుకుంటే.. ఇక జమిలీ ఎన్నికలకు మార్గం సుగమం అవుతుంది.

అయితే, బీజేపీ మిత్ర పక్షాలు అన్నీ జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఉండగా.. విపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. కేబినెట్‌ ఆమోదం పొందిన తర్వాత కాంగ్రెస్‌తోపాటు కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. దేశ ప్రజలు దీన్ని అంగీకరించబోరని చెప్పారు. ఎన్నికల సమస్యలు సృష్టించి ప్రజలను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని ఆరోపించారు. ‘ఒక దేశం-ఒకే ఎన్నికలు’ ఆచరణాత్మకం కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తాజాగా ఒకే దేశం - ఒకే ఎన్నికలు అంశంపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇది ఆచరణాత్మకం కాదని అన్నారు. ఎక్స్ వేదికగా స్పందించిన హైదరాబాద్ ఎంపీ ఇలా స్పందించారు. దేశంలోని ఫెడరలిజాన్ని నాశనం చేయడంతోపాటు ప్రజాస్వామ్యాన్ని రాజీ పడేలా చేయడం వల్లే తాను ఒకే దేశం - ఒకే ఎన్నికను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న వేర్వేరు సమయాల్లో జరిగే ఎన్నికలు మోదీ, షాలకు తప్ప మరెవరికీ ఇబ్బంది కాబోవడం లేదని అన్నారు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నందునే ఇలా చేస్తున్నారని చెప్పారు. సక్రమంగా, ఎప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాస్వామ్య జవాబుదారీతనం కూడా మెరుగుపడుతుందని అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar Election Result 2025:బిహార్‌లో మనసులు గెలిచిందెవరు? మట్టికరిచిందెవరు? పూర్తి విజేతల జాబితా ఇదే!
బిహార్‌లో మనసులు గెలిచిందెవరు? మట్టికరిచిందెవరు? పూర్తి విజేతల జాబితా ఇదే!
Railways News: వచ్చే ఏడు రోజుల పాటు ఈ రైళ్లు రద్దు, ఎక్కడికైనా వెళ్లే ముందు జాబితా తనిఖీ చేయండి
వచ్చే ఏడు రోజుల పాటు ఈ రైళ్లు రద్దు, ఎక్కడికైనా వెళ్లే ముందు జాబితా తనిఖీ చేయండి
Visakhapatnam CII Partnership Summit: 75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
EV Tyres India: ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్‌ వాడాలా? నార్మల్‌ టైర్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్స్‌ వాడాలా? నార్మల్‌ టైర్స్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
Advertisement

వీడియోలు

Jubilee Hills By Election Result | జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సర్వేలకు సైతం అందని భారీ మెజారిటీ
Naveen Yadav Wins in Jubilee Hills By Election | పని చేయని సానుభూతి...జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కాంగ్రెస్ కైవసం
Jubilee Hills By Election Results 2025 | దూసుకుపోతున్న కాంగ్రెస్
Jubilee hills Election Result 2025 | పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ దే ఆధిక్యం...జూబ్లీహిల్స్ పీఠం ఎవరిదో.? | ABP Desam
Ruturaj Gaikwad Century vs South Africa A | ఛాన్స్ దొరికితే సెంచరీ కొట్టి గంభీర్ నే క్వశ్చన్ చేస్తున్న రుతురాజ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Election Result 2025:బిహార్‌లో మనసులు గెలిచిందెవరు? మట్టికరిచిందెవరు? పూర్తి విజేతల జాబితా ఇదే!
బిహార్‌లో మనసులు గెలిచిందెవరు? మట్టికరిచిందెవరు? పూర్తి విజేతల జాబితా ఇదే!
Railways News: వచ్చే ఏడు రోజుల పాటు ఈ రైళ్లు రద్దు, ఎక్కడికైనా వెళ్లే ముందు జాబితా తనిఖీ చేయండి
వచ్చే ఏడు రోజుల పాటు ఈ రైళ్లు రద్దు, ఎక్కడికైనా వెళ్లే ముందు జాబితా తనిఖీ చేయండి
Visakhapatnam CII Partnership Summit: 75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
EV Tyres India: ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్‌ వాడాలా? నార్మల్‌ టైర్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్స్‌ వాడాలా? నార్మల్‌ టైర్స్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
Globetrotter కి పాస్ లు ఉంటేనే రండి  కంగారు పడి వచ్చేయకండి
Globetrotter కి పాస్ లు ఉంటేనే రండి కంగారు పడి వచ్చేయకండి
Vizag CII Summit:  సీఐఐ సదస్సు వేదికగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శ్రీకారం - వర్చువల్‌గా చంద్రబాబు, పీయూష్ గోయల్ శంకుస్థాపన
సీఐఐ సదస్సు వేదికగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శ్రీకారం - వర్చువల్‌గా చంద్రబాబు, పీయూష్ గోయల్ శంకుస్థాపన
Love OTP Review - 'లవ్ ఓటీపీ' రివ్యూ: 'గర్ల్ ఫ్రెండ్'కు రివర్స్ కాన్సెప్ట్... అబ్బాయి భయపడి బ్రేకప్ చెప్పలేకపోతే?
'లవ్ ఓటీపీ' రివ్యూ: 'గర్ల్ ఫ్రెండ్'కు రివర్స్ కాన్సెప్ట్... అబ్బాయి భయపడి బ్రేకప్ చెప్పలేకపోతే?
Pithapuram Pawan Kalyan:  ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం -  రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం - రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
Embed widget