అన్వేషించండి

Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

CM Chandrababu: భారత్‌లో హెచ్ఎంపీవీ కేసులు నమోదైన వేళ మైక్రో బయాలజిస్ట్‌లు, పీడియాట్రిషియన్లు, పల్మనాలజిస్టులు, ప్రివెంటివ్ మెడిసిన్ నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించాలని సీఎం ఆదేశించారు.

AP Government Taskforce Committee On HMPV: భారత్‌లో హెచ్ఎంపీవీ (HMPV) వైరస్ కేసులు నమోదవుతున్న వేళ ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు (CM Chandrababu) సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు నమోదైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. అధికారులు అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. మైక్రో బయాలజిస్ట్‌లు, పీడియాట్రిషియన్లు, పల్మనాలజిస్టులు, ప్రివెంటివ్ మెడిసిన్ నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించాలని నిర్ధేశించారు. హెచ్ఎంపీవీ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2001 నుంచి ఈ వైరస్ ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ ఏపీలో ఎలాంటి హెచ్ఎంపీవీ కేసులు నమోదు కాలేదని తెలిపారు. అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వంటి శ్వాసకోశ వ్యాధులు, ఇన్‌ఫ్లూయెంజా లాంటి కేసుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

'వైరస్ టెస్టింగ్ కిట్లు సిద్ధం చేయాలి'

హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టాస్క్ ఫోర్స్ నుంచి సలహాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. 'ఈ వైరస్ సీజనల్ వ్యాధిగా సంక్రమిస్తున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలోని ఐసీఎంఆర్ అధీకృత వైరాలజీ ల్యాబ్స్ సిద్ధం చేయాలి. వైరస్ టెస్టింగ్ కిట్లను కూడా సిద్ధం చేసుకోవాలి. వెంటనే 3 వేల టెస్టింగ్ కిట్లను తెప్పించాలి.' అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అటు, రాష్ట్రంలో ఔషధాల లభ్యతపైనా సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4.5 లక్షల ఎన్95 మాస్కులు, 13.71 లక్షల ట్రిపుల్ లేయర్డ్ మాస్కులు, 3.52 లక్షల పీపీఈ కిట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అన్ని ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో వీటి సరఫరా పెంచాలని సీఎం ఆదేశించారు. ఆక్సిజన్ సరఫరా, లిక్విడ్ ఆక్సిజన్ సప్లై పైపులైన్లకు సంబంధించి అన్ని ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని తెలిపారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు. కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వినియోగించాలని సూచించారు.

భారత్‌లో వెలుగుచూసిన కేసులు

మరోవైపు, భారత్‌లోనూ హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటకలోని బెంగుళూరులో 2, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 1, కోల్‌కతాలో 1, చెన్నైలో 2 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా చిన్నారులకు ఈ వైరస్ సోకగా వారికి ఎవరికీ ట్రావెల్ హిస్టరీ లేదు. వీరికి ఎలా సోకిందనే దానిపై వైద్య నిపుణులు ఆరా తీస్తున్నారు. చిన్నారులను ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, హ్యుమన్ మెటానిమోవైరస్ (HMPV) వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్రం స్పష్టం చేసింది. హ్యుమన్ మెటానిమోవైరస్ (HMPV).. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో సంభవించే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో 12 శాతం వరకూ ఇదే కారణమవుతోందని అంచనా. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV)ను పోలి ఉండే ఈ వైరస్.. ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే కనిపిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా 11 ఏళ్ల చిన్నారుల్లోనే ఎక్కువగా ఇది కనిపిస్తుండగా.. తొలిసారిగా దీన్ని 2001లో నెదర్లాండ్స్‌లో 28 మంది చిన్నారుల్లో గుర్తించారు.

Also Read: Voters List: సవరించిన ఓటర్ల జాబితా రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం - తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లు ఎంతమందంటే?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం!
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం!
Tirumala Anjaneya Swamy Idol Stolen: తిరుమలలో కలకలం - మొదటి ఘాట్ రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం మాయం!
తిరుమలలో కలకలం - మొదటి ఘాట్ రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం మాయం!
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
Embed widget