అన్వేషించండి

Minister Jagadish Reddy : తెలంగాణ ప్రజలు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తారు, ప్రధాని మోదీకి మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్

Minister Jagadish Reddy : సీఎం కేసీఆర్ పై విషం చిమ్మేందుకే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించారని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు.

Minister Jagadish Reddy : తెలంగాణ పర్యటకు వచ్చిన ప్రధాని మోదీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీత ప్రభుత్వాన్ని కూలదోస్తామన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పై విషం చిమ్మేందుకే మోదీ తెలంగాణకు వచ్చారన్నారు. మునుగోడులో ఓట‌మి పాలైనందుకు మోదీ టీఆర్ఎస్ పై అక్కసును వెళ్లగ‌క్కార‌ని విమర్శించారు. వ‌డ్డీతో స‌హా ఇస్తార‌న్న మీకే ప్రజ‌లు తిరిగి చెల్లిస్తారన్నారు. బ్యాంక్ లోన్లు రాకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుని, టీఆర్ఎస్ పార్టీలో అలజడి చేసేందుకు కుట్రలు చేస్తున్నార‌ని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోవడానికి గుజరాత్ ప్రజల్లాంటి వారు కాద‌న్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఇతర పార్టీల నాయకులను భయపెట్టి ఎదురు లేకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుంద‌న్నారు. సీఎం కేసీఆర్‌పై విషం కక్కినా తెలంగాణ ప్రజలు హంసల్లాంటి వారని, నీళ్లు, పాలు వేరు చేసినట్లు విషాన్ని కూడా వేరు చేస్తారన్నారు. బీజేపీ వదిలించుకునేందుకు కేసీఆర్ నాయకత్వంలో మరింతగా ముందుకు వెళ్తా్మన్నారు. అబద్ధాల పునాదుల మీద పార్టీ విస్తరణకు ప్రధాని మోదీ ప్రయ‌త్నం చేస్తున్నార‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి విమర్శించారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ  ఏమన్నారంటే? 
 
 తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బేగంపేటలో బీజేపీ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన... తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని కూలదోస్తామన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని టీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. అవినీతి పాలనపై బీజేపీ కార్యకర్తలు పోరాటం చేస్తున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకోవడం సంతోషకరంగా ఉందన్నారు.  బీజేపీ కార్యకర్తలు పోరాటం చేస్తున్నారని, వారిని చూసి తానేంతో ప్రభావితం అయ్యానన్నారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు ఒక యుద్ధం చేస్తున్నారన్నారు.  తెలంగాణ పేరుతో కొందరు అధికారం పొంది తమ జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో త్వరలోనే అంధకారం పోతుందని హామీ ఇచ్చారు. కొత్త సూర్యోదయం రాబోతుందన్నారు.  తెలంగాణ ప్రజలకు కొందరు నాయకులు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. 

తెలంగాణ ప్రజకు మాటిస్తున్నా

"ఎప్పుడు చీకటి కమ్ముకుంటుందో, నలుదిక్కులా చిమ్మచీకట్లు ముసురుకుంటాయో అప్పుడు కమలం వికసిస్తుంది. బీజేపీ కార్యకర్తల పోరాటంతో తెలంగాణలో చీకట్లు తొలగిపోతున్నాయి.  మునుగోడులో బీజేపీ కార్యకర్తలు ఎంతో వీరోచితంగా పోరాడారు. కష్టకాలంలో బీజేపీని తెలంగాణ ప్రజలు వదిలిపెట్టలేదు. 1984లో బీజేపీ కేవలం ఇద్దరు ఎంపీలే ఉన్నప్పుడు, హన్మకొండ నుంచి జంగారెడ్డిని గెలిపించారు.  రాష్ట్ర ప్రభుత్వమే మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తుంది. తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నాను.. అవినీతి ప్రభుత్వాన్ని కూలదోస్తాం. కొందరు భయంతో మోదీని బూతులు తిడుతున్నారు, ఆ బూతులను నేను పట్టించుకోను. నన్ను తిట్టినా పట్టించుకోను కానీ తెలంగాణ ప్రజలను తిడితే ఊరుకునేది లేదు."- ప్రధాని మోదీ  

పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్ 

తెలంగాణ ప్రజలకు ఎవరైనా అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించనని ప్రధాని మోదీ అన్నారు. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలతో ఆడుకుంటే ప్రతిఫలం తప్పదన్నారు. తెలంగాణలో ప్రధానిమంత్రి ఆవాస్‌ యోజన కింద ఇళ్లు నిర్మించకుండా అడ్డుకున్నారని మోదీ అన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ పేరుతో ఇళ్లు ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. బీజేపీ యువకుల పార్టీ అని, పేదలకు అండగా నిలబడి మంచి పాలన అందిస్తుందన్నారు. తెలంగాణను కుటుంబ పాలన, అవినీతి నుంచి విముక్తి చేయడం బీజేపీ ధ్యేయమని ప్రధాని మోదీ అన్నారు. 

 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget