అన్వేషించండి

CM KCR : మంత్రులు, ఎంపీల నుంచి కవిత వరకూ వచ్చారు- అరెస్టు చేస్తారట, చేయనివ్వండి చూద్దాం- సీఎం కేసీఆర్

CM KCR : దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తారట, చేయనివ్వండని సీఎం కేసీఆర్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏంచేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు.

CM KCR : దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై సీఎం కేసీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులను వేధించారన్నారు. కవితను అరెస్టు చేస్తారట చేయనివ్వండి ఏం చేస్తారో చూద్దామని కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది. కేంద్రం ఏంచేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు. మంత్రులు, ఎంపీల నుంచి కవిత వరకు వచ్చారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసుల పేరుతో బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్నారని ఆరోపించారు. అయినా భయపడే ప్రసక్తే లేదని కేంద్రంపై పోరాటం కొనసాగుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాడం చేస్తామని పార్టీ నేతలనుద్దేశించి కేసీఆర్‌ అన్నారు. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ లో ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చింది. శనివారం విచారణకు రావాల్సిందిగా కోరింది. ఈ మేరకు రేపు ఉదయం ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుకానున్నారు. అయితే కవితకు మద్దతుగా మంత్రి కేటీఆర్‌ కూడా దిల్లీ బయల్దేరివెళ్లారు. దిల్లీలో న్యాయ నిపుణులతో కేటీఆర్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే దిల్లీలోని కవిత నివాసానికి లాయర్ల బృందం చేరుకుంది.  

రేపు ఈడీ ముందుకు కవిత 

 ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ జారీ చేసిన నోటీసుల విషయంలో విచారణకు హాజరయ్యే విషయంలో కవిత సమయం కోరారు.  న్యాయనిపుణులతో సంప్రదించిన తర్వాత తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయని 15వ తేదీ తర్వాత హాజరు కాగలనని లేఖ రాశారు. కానీ ఈడీ నుంచి స్పందన లేదు. ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరే ముందు మరో లేఖ  రాశారు. 11వ తేదీనే విచారణకు హాజరవుతానని ఆమె ఆ లేఖలో పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. దీనికి స్పందించిన ఈడీ 11న విచారణకు హాజరయ్యేందుకు అనుమతి తెలిపింది. 

హైదరాబాద్ కేంద్రంగా దిల్లీ లిక్కర్ స్కామ్ 

దిల్లీ లిక్కర్ స్కామ్ లో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి.  హైదరాబాద్ కేంద్రంగానే లిక్కర్ స్కామ్ జరిగిందని మనీశ్‌ సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. శుక్రవారం దిల్లీ కోర్టులో ఆప్ నేత సిసోడియాను ఈడీ అధికారులు  హాజరుపరిచారు. సిసోడియా రిమాండ్‌ రిపోర్టులో రాజకీయ, ఆర్థిక, నేరపూరిత వ్యవహారాలను ఈడీ బయటపెట్టడింది. లిక్కర్‌ స్కామ్‌ హైదరాబాద్‌ లోనే ప్లాన్ చేశారని తెలిపింది. దినేష్ అరోరాను సౌత్ గ్రూప్ హైదరాబాద్‌కు పిలిపించిందని, ఐటీసీ కోహినూర్‌లోనే కీలక చర్చలు జరిగాయని ఈడీ రిపోర్టులో పేర్కొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు, దిల్లీ సీఎం కేజ్రీవాల్, అప్పటి డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఈ విషయం తెలుసని, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు చెప్పారని ఈడీ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది.  2021 మార్చి 19, 20 తేదీల్లో విజయ్‌నాయర్‌ని ఎమ్మెల్సీ కవిత కలిశారు. కేజ్రీవాల్‌, సిసోదియా తరఫున విజయ్‌నాయర్‌ పనిచేశారని బుచ్చిబాబు తెలిపారని ఈడీ రిపోర్టులో చెప్పింది. ఇండోస్పిరిట్‌ కంపెనీలో 32 శాతం వాటాను అరుణ్ పిళ్లై పేరుతో కవిత కలిగి ఉన్నారని, కవితకు అనుకూలంగా లిక్కర్ పాలసీలో మార్పులు చేస్తే కొంత అమౌంట్ ఆప్‌కు ఇచ్చేందుకు అవగాహన కుదిరిందన్నారు. ఈ విషయాన్ని బుచ్చిబాబు తన వాంగ్మూలంలో తెలిపారని ఈడీ వెల్లడించింది. 2021 జూన్‌లో హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్లో అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్‌, దినేశ్‌ అరోరా భేటీ అయ్యారని చెప్పింది. రూ.100 కోట్ల ముడుపులు ఎలా ఇవ్వాలి, ఎలా దిల్లీకి తరలించాలనే అంశాలపై చర్చించారని ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. 

12 శాతం లాభం వచ్చేలా 

సౌత్‌ గ్రూప్‌ ద్వారా దినేష్ అరోరా రూ.31 కోట్ల నగదు తీసుకుని, ఆ నగదును ఆప్‌ నేతలకు చేరవేశారు. దిల్లీ మద్యం పాలసీ రూపకల్పన సమయంలో సిసోడియా 14 మొబైల్‌ ఫోన్లు మార్చారు. సీబీఐ దాడుల్లో వాటిలో రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని ఈడీ తన రిపోర్టులో వెల్లడించింది. దిల్లీ లిక్కర్ పాలసీ అధికారికంగా విడుదల చేయడానికి రెండు రోజుల ముందే కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకి ఆ వివరాలు చేరాయని తెలిపింది. మద్యం విధానంలో కొన్ని విషయాలను బుచ్చిబాబు ఫోన్ లో గుర్తించామని ఈడీ కోర్టుకు తెలిపింది. మద్యం పాలసీలో 12 శాతం ప్రాఫిట్‌ ఉండేలా మార్చి దానిలో ఆప్‌ నేతలకు 6 శాతం అందించాలని విజయ్‌ నాయర్‌ చెప్పినట్టు దినేష్‌ అరోరా ఈడీ ముందు ఒప్పుకున్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. లిక్కర్ పాలసీపై దిల్లీ ఎల్జీ విచారణ చేపట్టాలని ఆదేశించిన రోజే సిసోడియా ఫోన్ మార్చారని ఈడీ తెలిపింది. ఇతరుల పేర్లతో సిమ్‌ కార్డులు వినియోగించారని,  ముడుపుల ద్వారా రూ.100కోట్లు, ఇండోస్పిరిట్స్‌ లాభాల్లో రూ.192 కోట్లు అందాయని ఈడీ తెలిపింది. ముడుపుల విషయంలో సిసోడియా పొంతనలేని సమాధానాలు ఇచ్చారని,  రూ.292.8 కోట్లు దక్కిన వ్యవహారంలో సిసోడియా కీలకమని ఈడీ రిమాండ్‌ రిపోర్టులో స్పష్టం చేసింది. 

  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy unveils NTR statue: కాంగ్రెస్ సీఎం అయితే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయకూడదా? - ఇందిరమ్మతో పోల్చిన రేవంత్
కాంగ్రెస్ సీఎం అయితే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయకూడదా? - ఇందిరమ్మతో పోల్చిన రేవంత్
Hyderabad land auction Rayadurgam 2026: హైదరాబాద్ రాయదుర్గం రియల్ సంచలనం - ఎకరం రూ.237 కోట్లు.. దేశంలోనే కొత్త రికార్డు!
హైదరాబాద్ రాయదుర్గం రియల్ సంచలనం - ఎకరం రూ.237 కోట్లు.. దేశంలోనే కొత్త రికార్డు!
PM Kisan: రైతుల ఖాతాల్లో ఏటా రూ.6 వేలు.. పీఎం కిసాన్ యోజన అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే!
రైతుల ఖాతాల్లో ఏటా రూ.6 వేలు.. పీఎం కిసాన్ యోజన అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే!
Adilabad Crime News: పార్క్ చేసిన వాహనాలను క్షణాల్లో మాయం చేసే ముఠా అరెస్టు! ఛేజ్ చేసి పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు!
పార్క్ చేసిన వాహనాలను క్షణాల్లో మాయం చేసే ముఠా అరెస్టు! ఛేజ్ చేసి పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు!

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy unveils NTR statue: కాంగ్రెస్ సీఎం అయితే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయకూడదా? - ఇందిరమ్మతో పోల్చిన రేవంత్
కాంగ్రెస్ సీఎం అయితే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయకూడదా? - ఇందిరమ్మతో పోల్చిన రేవంత్
NTR Bharat Ratna resolution Mahanadu 2026: మహానాడులో భారతరత్న తీర్మానం - ఈసారి ఎన్టీఆర్‌కు గౌరవం దక్కేనా? చంద్రబాబు ఏం చేయబోతున్నారు?
మహానాడులో భారతరత్న తీర్మానం - ఈసారి ఎన్టీఆర్‌కు గౌరవం దక్కేనా? చంద్రబాబు ఏం చేయబోతున్నారు?
Sara Khan On EID: బక్రీద్‌కు జంతు బలి ఎందుకు? సారా ఖాన్ పోస్టుపై గరమ్ గరమ్
బక్రీద్‌కు జంతు బలి ఎందుకు? సారా ఖాన్ పోస్టుపై గరమ్ గరమ్
Hyderabad land auction Rayadurgam 2026: హైదరాబాద్ రాయదుర్గం రియల్ సంచలనం - ఎకరం రూ.237 కోట్లు.. దేశంలోనే కొత్త రికార్డు!
హైదరాబాద్ రాయదుర్గం రియల్ సంచలనం - ఎకరం రూ.237 కోట్లు.. దేశంలోనే కొత్త రికార్డు!
Jagan PA KNR liquor scam investigation: ఏపీ లిక్కర్ స్కాంలో జగన్ పీఏ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు - అరెస్టు తప్పదా?
ఏపీ లిక్కర్ స్కాంలో జగన్ పీఏ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు - అరెస్టు తప్పదా?
Why Hot Water Freezes Faster:వేడి నీళ్లు కూల్ వాటర్ కంటే వేగంగా గడ్డకడతాయా? దీని వెనుక ఉన్న సైన్స్ మిస్టరీ ఏంటీ?
వేడి నీళ్లు కూల్ వాటర్ కంటే వేగంగా గడ్డకడతాయా? దీని వెనుక ఉన్న సైన్స్ మిస్టరీ ఏంటీ?
Tips To Happy Marriage : మ్యారేజ్ లైఫ్ సంతోషంగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్.. లేదంటే నరకంగా మారొచ్చు
మ్యారేజ్ లైఫ్ సంతోషంగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్.. లేదంటే నరకంగా మారొచ్చు
Anasuya: షార్ట్స్‌లో అనసూయ... స్టైలిష్‌గా బ్యూటిఫుల్ లేడీ
షార్ట్స్‌లో అనసూయ... స్టైలిష్‌గా బ్యూటిఫుల్ లేడీ
Embed widget