అన్వేషించండి

Bhatti Vikramarka: కేటీఆర్‌వి గాలి మాటలు.. ఈటెల కోసం కాంగ్రెస్ పనిచేయడమా..? సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారని.. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను గెలిపించడం కోసం కాంగ్రెస్ ఎందుకు పనిచేస్తుందో చెప్పాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఖండించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ - బీజేపీ కలిసిపోయారు అని కేటీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారని.. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను గెలిపించడం కోసం కాంగ్రెస్ ఎందుకు పనిచేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి పై వ్యాఖ్యలు సరికాదు..
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మతతత్వ పార్టీ కాగా.. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని.. ఇవి ఎన్నటికీ రెండు భిన్న ధృవాలుగా ఉంటాయని హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ భట్టి విక్రమార్క అన్నారు. అయితే కేటీఆర్ రాజకీయ అవగాహన లేకుండా, గాలి మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలు టీఆర్‌ఎస్‌కు పట్టడం లేదని, హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ నేతల మాయ మాటలు నమ్మరన్నారు. ఈటలను రేవంత్ రెడ్డి కలవడంపై కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని, అవగాహన లేకుండా మాట్లాడారని చెప్పారు. ఎన్నికల తరువాత ఈటెల కాంగ్రెస్ లోకి వస్తారని కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. 

Also Read: రేవంత్ రెడ్డిని కలిశాను... తప్పేంటి ? కేటీఆర్‌కు ఈటల కౌంటర్ !

‘టీఆరెఎస్, బీజేపీ నేతల మధ్య లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయి. మాజీ మంత్రి ఈటల అవినీతిపై తెలంగాణ ప్రభుత్వం విచారణ ఎందుకు ఆపివేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలలో బీజేపీ, టీఆర్ఎస్ కలిసి గెలుపు కోసం పోటీపడుతున్నాయి. వీరి దోపిడీని అరికట్టాలంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించాయి. కాంగ్రెస్ నాయకులపై బురదజల్లడాన్ని ప్రజలు నమ్మరు. కేటీఆర్ ఇప్పటికైనా ఇలాంటి చౌకబారు ఆరోపణలు మానుకోవాలి. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ప్రజా సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సరికాదని’ భట్టి విక్రమార్క సూచించారు.

Also Read: హుజూరాబాద్ లో జోరుగా ప్రచారం... సానుభూతి వర్సెస్ అభివృద్ధి.. గెలుపుకోసం ఎత్తుకుపై ఎత్తులు...! 

గాంధీభవన్లో గాడ్సేలు ఉండరు. కేవలం కాంగ్రెస్ భావజాలం ఉన్నవారే ఉంటారు. మా పార్టీ అంతర్గత వ్యవహారాలపై కేటీఆర్ మాట్లాడటం సరికాదు. మా పార్టీలో మా మాట కాకుండా కేటీఆర్ మాట నెగ్గుతుందా. తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ మంతనాలు.. దాని ద్వారా బీజేపీతో కలిసి పనిచేసే సంకేతాలు వెళ్లాయి. మరోవైపు దళిత బంధు పథకంపై బీజేపీ వైఖరి సరిగా లేదు. దళిత బంధును టీఆర్ఎస్, బీజేపీ కలిసి నిలిపివేశాయి. కనుక తమ అభ్యర్థి బాల్ముర్ వెంకట్ ను ప్రజలు గెలిపించాలి. ప్రతిపక్షాల ఫ్లెక్సీలు పెడితే హడావుడి చేసే అధికారులకు టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కనిపించవా అని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ప్రశ్నించారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Embed widget