అన్వేషించండి

Huzurabad By Election: అసెంబ్లీలో 'ఆర్ఆర్ఆర్' సీఎం కేసీఆర్ కు సినిమా చూపిస్తారు... బీజేపీ గెలిస్తే కేసీఆర్ రాజీనామా చేస్తారా అని బండి సవాల్... తనపై దాడికి కుట్ర చేస్తున్నారని ఈటల కామెంట్స్

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతే సీఎం కేసీఆర్ రాజీనామా చేస్తారా అని బండి సంజయ్ సవాల్ చేశారు. అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ కేసీఆర్ కు సినిమా చూపిస్తారన్నారు. తనపై దాడి జరిగే అవకాశం ఉందని ఈటల అన్నారు

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో జరిగిన బీజేపీ ఎన్నికల శంఖారావం సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడిన బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంగ్రామ పాదయాత్ర విజయవంతమైందని బండి సంజయ్ అన్నారు. అందుకే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని వచ్చాన్నారు. హుజురాబాద్ లో కాషాయ జెండాను గెలిపించాలని కోరుకున్నానని తెలిపారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. ఇక్కడ కరెన్సీ నోటుకు, కమలం పువ్వుకు పోటీ జరుగుతోందన్నారు. ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడని కానీ కేసీఆర్ ఉద్యమంలో చేసిందేమీలేదన్నారు. ఆయన మధ్యలోనే నిమ్మరసం తాగి దీక్ష విరమిస్తే విద్యార్థులు ఉద్యమించారని బండి సంజయ్ అన్నారు. విద్యార్థుల భయానికే ఆయన దీక్ష కొనసాగించారన్నారు. తెలంగాణ రావడం కేసీఆర్ కు ఇష్టం లేదన్న ఆయన.. మరో 10 ఏళ్లపాటు ఉద్యమం పేరుతో డబ్బులు సంపాదించుకోవాలనుకున్నారని ఆరోపించారు. ఇన్నేళ్లుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన ఈటలను గెలిపించేందుకు బీజేపీ కార్యకర్తలు, నాయకులు బాధ్యతలు తీసుకోవాలన్నారు.  

టీఆర్ఎస్ ఓడిపోతే సీఎం రాజీనామా చేస్తారా: బండి సంజయ్

ప్రతి ఒక్కరూ ఒక్కో ఈటల రాజేందర్, మోదీలే పనిచేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఏ రాజకీయ నాయకుడైనా తాను ప్రజలకు సేవచేయాలనే రాజకీయాల్లోకి వస్తాడని బండి అన్నారు. కేవలం డబ్బులకు అమ్ముడుపోయి, తమ రాజకీయ భవిష్యత్తును కొందరు ప్రశ్నార్థకం చేసుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ బరితెగింపు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని బండి సంజయ్ అన్నారు. కేవలం వాళ్లు డిపాజిట్ కోసమే ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.  హుజూరాబాద్  లో టీఆర్ఎస్ ఓడిపోతే సీఎం రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ఎన్నికలు వాయిదా వేయాలని కేసీఆర్ లేటర్ల మీద లేటర్లు రాశారని ఆయన అన్నారు. కానీ ఎన్నికల కమిషనర్ కేసీఆర్ జేబు సంస్థ కాదన్నారు. ఆయన అక్కడున్నప్పుడే ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించిందన్నారు. దుబ్బాకలో గెలిచినా, మరోచోట ఓడినా ప్రజాస్వామ్య యుతంగా పోరాడుతామని బండి సంజయ్ తెలిపారు.  గెలిచే అవకాశం ఉన్నచోట కేటీఆర్ ను, ఓడిపోయే చోట హరీశ్ రావును ఇంఛార్జ్ గా పెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. దళితబంధును బీజేపీ వ్యతిరేకించలేదని తెలిపారు.  ఇచ్చిన రూ. పది లక్షలు ఏమైనా చేసుకోవచ్చని చెప్పి ఇప్పుడు దళితబంధుపై ఆంక్షలు పెట్టారన్నారు. అకౌంట్లో వేసిన డబ్బులు ఫ్రీజింగ్ చేశారన్నారు. 

Also Read:  రసవత్తరంగా హుజూరాబాద్ ఉపఎన్నిక... అభ్యర్థిని ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ... అభ్యర్థి ఎవరంటే..?

బీసీల బంధు ఎందుకు ప్రకటించలేదు?

బీసీల బంధు ఎందుకు ప్రవేశపెట్టరని ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. అగ్రవర్ణాల్లో కూడా పేదలున్నారన్న ఆయన.. వాళ్లకు కూడా రూ.పది లక్షలు ఇవ్వాలన్నారు. సీఎం కేసీఆర్ గిమ్మిక్కులతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మరోసారి ఈటల రాజేందర్ ఘనవిజయం సాధిస్తారన్నారు. ఇప్పటికే రాజాసింగ్, రఘునందన్ రావు రూపంలో డబుల్ ఆర్ అసెంబ్లీలో ఉన్నారన్నారు. ఈటల రాజేందర్ గెలుపుతో అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ అవుతారన్నారు. కేసీఆర్ కు త్రిబుల్ ఆర్ సినిమా చూపిస్తారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.  2023లో 119 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలుస్తారన్నారు.  

Also Read: ముగిసిన బండి సంజయ్ తొలిదశ పాదయాత్ర... సీఎం కావాలని పాదయాత్ర చేయడంలేదన్న సంజయ్... వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ధీమా 

నాపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నారు : ఈటల రాజేందర్

ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యంగా రెండు పనులు చేశానన్న ఆయన... ఒకటి హుజూరాబాద్ అభివృద్ధి అయితే, రెండోవది బీసీలలో ఉన్న కులాలతో అసెంబ్లీలో మీటింగ్ పెట్టీ వారికి ఏం కావాలో ప్రతిపాదనలు చేసినన్నారు. రజకులకు రూ.250 కోట్లతో  డ్రై క్లీనింగ్ మిషన్ లు కొనివ్వాలని ప్రతిపాదన చేస్తే డబ్బులు లేవని కేసీఆర్ ఆపేశారన్నారు. తాను రాజీనామా చేస్తేనే ఇన్ని వస్తే గెలిస్తే ఇంకా ఎన్ని వస్తాయో అన్నారు. ఓటుకి రూ.20 వేలు ఇస్తారని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఒక్క బీసీ బిడ్డ కూడా సీఎం కాలేదన్నారు. మీటింగ్ కి వస్తే కరెంటు కట్ చేశారని ఆరోపించారు. బీజేపీ మీటింగ్ కి పోవద్దని దావత్ లు ఇస్తున్నారని, బెదిరిస్తున్నారన్నారు. తమ సహనానికి పరీక్ష పెట్టవద్దన్నారు. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి నియంతృత్వాన్ని ప్రజలపై రుద్దుతున్నారని ఈటల ఆరోపించారు. 13, 14 తేదీల్లో తనపై దాడి చేయించేందుకు ఓ మంత్రి, ఎమ్మెల్యే కుట్రలు చేస్తున్నారన్నారు. జరిగే పరిణామాలకు సీఎం కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలన్నారు. మాజీ ఎమ్మెల్యేలకు 2+2 గన్ మెన్ ఉంటారన్నారు. కానీ తనకు మాత్రం ఒక్కరినే ఇచ్చారన్నారు.  హుజురాబాద్ లో బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగితే చాలు గెలుస్తామన్నారు. 

Also Read: బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై మంత్రి గంగుల విమర్శలు.. అభివృద్ధి ఎక్కడంటూ మాజీ మంత్రికి కౌంటర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget