అన్వేషించండి

Amit Shah: బిహార్‌లో బీజేపీ సమావేశాలు- తెలంగాణ నేతలను ఆకాశానికి ఎత్తేసిన అమిత్‌షా

Amit Shah: జాతీయ సమావేశాల్లో తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలు, ఉద్యమాలను జేపీ నడ్డా, అమిత్ షాలు పదే పదే ప్రస్తావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమదే విజయమని జోస్యం చెబుతున్నారు.

Amit Shah: బిహార్ పాట్నాలో జరిగిన వివిధ మోర్చా కార్యక్రమాల్లో, జాతీయ సమావేశాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు తెలంగాణ బీజేపీ చేస్తున్న పోరాటాలు, కార్యక్రమాల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. తెలంగాణలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు చేస్తున్న పోరాటాల స్ఫూర్తితో మోర్చాల నేతలు పని చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల పరిధిలో ఇటీవల జాతీయ నాయకులు 2 రోజులపాటు క్షేత్ర స్థాయిలో పర్యటించిన విషయాన్ని అమిత్ షా, జేపీ నడ్డా ప్రస్తావించారు. 

బండి సంజయ్ యాత్రలు అభినందనీయం...

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పోరాటాలను పదేపడే ప్రస్తావించారు. ఆయన చేస్తున్న పాదయాత్రలు, యాత్రలను గురించి వివరించారు. వారు చేస్తున్నట్లుగానే మోర్చా నాయకులు చేస్తే బీజేపీ గెలుపు కచ్చితంగా సాధ్యం అవుతుందని అన్నారు. జాతీయ కార్యక్రమాల్లో తెలంగాణ ముచ్చట రావడంతో వివిధ మోర్చాలకు చెందిన తెలంగాణ నాయకులు చప్పట్లు కొట్టారు. ఆనందం వ్యక్తం చేశారు. తాము పడుతున్నకష్టాలను జాతీయ నాయకత్వం గుర్తించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకే..

పార్టీలో పైపదవుల్లో ఉన్న వాళ్లు గుర్తించి మెచ్చుకుంటే.. పార్టీ శ్రేణులు మరింత కష్టపడతారని స్పష్టం చేశారు తెలంగాణ బీజేపీ లీడర్లు. అప్పుడే రాబోయే ఎన్నికల్లో గెలిచే వరకు ఉత్సాహంగా పని చేయగలరన్నారు. అది దృష్టిలో పెట్టుకునే అమిత్ షా, జేపీ నడ్డా పదే పదే తెలంగాణ నేతల పేర్లు జాతీయ సమావేశాల్లో తీస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో గెలుపే లక్ష్యంగా జాతీయ స్థాయి నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు పని చేస్తున్నారని అంటున్నారు. బిహార్ లోనూ రెండోసారి విజయవంతంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. బిహార్ రాష్ట్రంలో జూలై 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు జరిగిన వివిధ మోర్చాల జాతీయ సంయుక్త సమావేశాలు జరిగాయి. వీటిలో పాల్గొన్న అమిత్ షా, జేపీ నడ్డాలు తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు అందిరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీ ఎంపీలు నియోజక వర్గాల్లోకి వెళ్లాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించినట్లు అమిత్ షా తెలిపారు. సమావేశాల అనంతరం మూడు రోజులపాటు ఎంపీలు తమ తన నియోకవర్గాల్లో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని హైదరాబాద్‌లో నెల క్రితం జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో అన్నారు. రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టిన అమిత్ షా బంగాల్, తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. ఈ రెండు రాష్ట్రాలు కూడా కమలం అధీనంలోకి తెచ్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Kovvuru Railway Station : కొవ్వూరు ప్రజలకు శుభవార్త; మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్!
కొవ్వూరు ప్రజలకు శుభవార్త; మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్!
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Embed widget