అన్వేషించండి

Telangana Elections 2023 : కరువు, కర్ఫ్యూ రెండూ కాంగ్రెస్ కవలలు - రెండు జాతీయ పార్టీలు ఒకటే - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

harish Rao : తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని హరీష్ రావు అన్నారు. 44 కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 

Telangana Elections 2023 HarishRao :   తెలంగాణ భవన్‌‌లో మంగళవారం నిర్వహించిన 44 కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్ రావు హాజర్యయారు. గతంలో జీతాలు పెంచాలని ధర్నా చేస్తే ఇనుప బూట్లు, గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని.. కానీ కార్మికుల సమస్యలేంటో తెలుసుకొని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు పెంచిన చరిత్ర కేసీఆర్‌దని తెలిపారు.  ఆటో కార్మికులకు త్రైమాసిక పన్నును రద్దు చేసింది కేసీఆర్ .. ట్రాక్టర్లకు పన్ను రద్దు చేసింది కూడా కేసీఆరేనని తెలిపారు.  ఆటో కార్మికులకు, రవాణా కార్మికుల ట్రాన్స్‌పోర్ట్ బోర్డు ఏర్పాటు డిమాండుని మూడోసారి అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. 

మళ్లీ బీఆర్ఎస్ ని గెలిపిస్తే ఆర్పీలు, వీఏవోల జీతాన్ని రెట్టింపు చేస్తామని.. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఉద్యోగుల జీతాలు ఎక్కువని గుర్తు చేశారు.  కార్మికుల ఉసురుపోసుకున్న పార్టీ బీజేపీ అన్నారు.  రైల్వేలు, రైల్వే లైన్లు, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీలను అమ్మేశారారన్నారు.  అమ్ముడు తప్ప కొత్తగా కంపెనీలు, ఫ్యాక్టరీలు పెట్టడం బీజేపీకి తెలియదన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు తుస్సయిపోయాయని..  రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు చాలు అంటున్నడు, కర్ణాటక డిప్యూటీ సీఎం 5 గంటలు ఇస్తమంటున్నడని ఎద్దేవా చేశారు.  గతంలో పవర్ హాలిడేలు ఉండేవి. పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేసేవారు. ఇప్పుడు 24 గంటల కరెంటు వస్తుందని గుర్తు చేశారు. 
 
తెలంగాణ ఏర్పడంగనే బీజేపీ ఏడు మండలాలను ఆంధ్రలో కలిపేసింది. దాంతో సీలేరు విద్యుత్ ప్రాజెక్టు మనకు దక్కకుండా పోయిందిన్నారు.  తెలంగాణకు బీజేపీ ఇంత అన్యాయం చేసినా కాంగ్రెస్ నాయకులు ఒక్క మాట మాట్లాడలేదని ఆరోపించారు.  కేసీఆర్‌ని తట్టుకోలేక కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటవుతున్నయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు.  
రెండు ఢిల్లీ పార్టీలు దేశమంతా కొట్టుకొని తెలంగాణలో కలిసి పని చేస్తున్నాయని..  బీజేపీ పార్లమెంటులో బిల్లు పెడితే కాంగ్రెస్ మద్ధతిస్తుందన్నారు.  మొన్నటివరకు కాంగ్రెస్‌లో ఉన్నోళ్లు బీజేపీలో, బీజేపీలో ఉన్నోళ్లు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ..  కరువు, కర్ఫ్యూ రెండూ కాంగ్రెస్‌కి పుట్టిన కవలలని విమర్శించారు. 

కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోని కాపీ కొట్టిందన్నారు.  కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారంటీలతో కొన్ని నెలల్లోనే ఆ రాష్ట్రం దివాలా తీసిందని..  కర్ణాటక గబ్బు పట్టిపోయింది. అక్కడి రైతులు లబోదిబోమంటున్నరని తెలిపారు.  మాట తప్పే కాంగ్రెస్ కావాల్నా, మాట మీద నిలబడే కేసీఆర్ కావాల్నా తేల్చుకోవాలని హరీష్ రావు సూచించారు.  తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ఏకైక ఇంటి పార్టీ బీఆర్ఎస్, కేసీఆర్ మాత్రమేనన్నారు.  ఈ మధ్య కాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి డిపాజిట్ లు పోయి బీజేపీ గెలిచింది.  మునుగోడు లో కాంగ్రెస్ డిపాజిట్లు పోయి, బీజేపీ కి ఎక్కువ ఓట్లు పడ్డాయి.  ఈ రెండు పార్టీలు ఒక్కటేనన్నారు. 

నిన్న మొన్నటి దాకా బీజేపీ లో.ఉన్న వివేక్, రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ లో చేరారని..  మనల్ని ఓడించేందుకు ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయన్నారు.  కాంగ్రెస్ గట్టిగ ఉన్న చోట బీజేపీ సపోర్ట్ చేస్తుంది..  బిజెపి గట్టిగ ఉన్న చోట కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందన్నారు.  కాంగ్రెస్ హయాంలో కార్మికులను ఏనాడూ పట్టించుకోలేదు.  గుర్రాలతో తొక్కించి, లాఠీలతో కొట్టించింది కాంగ్రెస్ ఆడవాళ్ళు అని చూడకుండా అర్దరాత్రి వరకు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ దన్నారు.  కానీ కేసిఆర్ మహిళలను పిలిచి వారి సమస్యలు తీర్చి అన్నం పెట్టిన ఘనత కేసిఆర్ దని..  తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
Embed widget