అన్వేషించండి

Harish Rao: కాంగ్రెస్ 3 నెలల పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు: హరీష్ రావు ఆరోపణలు

ఇతర పార్టీల నుంచి నేతల చేరికలపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను సైతం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు.

Harish Rao alleged that 180 Farmer Suicide in Congress Rule: హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను తీర్చడంలో విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (BRS MLA Harish Rao) విమర్శించారు. మాజీ మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పెద్ది సుదర్శన్ రెడ్డిలతో క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లినట్లు తెలిపారు. లక్ష్మీభాయి తండాకు వెళ్లినప్పుడు రైతుల కళ్లల్లో కన్నీళ్లు, ఆవేదన తాము ప్రత్యక్షంగా చూశామన్నారు. ఒకరైతు సత్తెమ్మ పొలంలోకి వెల్లి చూడగా 4 బోర్లు వేస్తే చుక్క నీరు పడలేదు. బావుల పూడిక తీసేందుకు క్రేన్లను అద్దెకు తీసుకుంటున్నారు. దాదాపు రూ.4 లక్షల రూపాయాలు అప్పు అయిందని, తమ దృష్టికి వచ్చిందన్నారు హరీష్ రావు.

కేసీఆర్ 10 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి లేదు.. 
లక్ష్మీ అనే రైతు 6 బోర్లు, జంకు 9 బోర్లు, శివశంకర్ 6 బోర్లు, విజయ 4 బోర్లు వేసినా నీళ్లు సరిగా రాక.. మరోవైపు ప్రభుత్వం నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని హరీష్ రావు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని, గత 10 ఏళ్లలో తమకు ఇలాంటి పరిస్థితి తొలిసారి వచ్చిందని తండా వాసులు చెప్పినట్లు గుర్తుచేశారు. హరీష్ రావు మాట్లాడుతూ.. ‘కేవలం 3 నెలల కాంగ్రెస్ పాలన చూస్తే, ప్రజా సమస్యలు వీరికి పట్టవని తేలిపోయింది. కాంగ్రెస్ పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. కానీ ప్రజల దృష్టి మరల్చేందుకు చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ నీటి నిర్వహణ లేక, రైతు బంధు రాకపోవడం, కరెంట్ ఎప్పుడు వస్తదో ఎప్పుడు రాదో తెల్వక రైతులపై ఆర్థిక భారం పడుతుందన్నారు. నీళ్లు లేక పంటలు ఎండపోవడం, వడగళ్ల వాన, అకాల వర్షాలతో మొత్తం 20 లక్షల ఎకరాలకు పైగా పంటలకు నష్టం వాటిల్లింది. రైతులను కలిసిన మంత్రి ఉన్నాడా. లేక రైతులకు ప్రభుత్వం ఉందని అధికారులను పంపించి అయినా భరోసా కల్పించారా.

గత 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో ఒక్కరైతు కూడా బోర్లు వేయలేదు. కానీ కాంగ్రెస్ వంద రోజుల పాలనలో బోర్లు వేసి అప్పులై ఆత్మహత్యలు, కొత్త మోటార్లు కొనుక్కోవడం, క్రేన్లు తీసుకొచ్చి ఖర్చు చేయడం చూస్తున్నాం. డబ్బులు చెల్లించాలని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు పంపిస్తోందని’ ఓ వీడియోను సైతం ప్రదర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి తమకు సంబంధం లేదని అధికారులు చెప్పినట్లుగా ఉన్న వీడియోను హరీష్ రావు మీడియా ఎదుట ప్రదర్శించారు. 
రైతులకు ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదు..
సంగారెడ్డిలో అప్పులు కడతారా, లేక కేసులు పెట్టాలా అని బ్యాంకు అధికారులు ప్రజల్ని, రైతుల్ని వేధిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వకపోవడమే కారణమని చెప్పారు. రైతుల కోసం మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ హామీని కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని హరీష్ రావు ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ మోసం, రైతులకు, కౌలు రైతులకు ఏకరానికి రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12000, వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ పెద్ద దగా అని హరీష్ రావు మండిపడ్డారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Diwali Celebrations: ఉండవల్లి నివాసంలో సతీమణితో కలిసి సీఎం చంద్రబాబు దీపావళి వేడుకలు
ఉండవల్లి నివాసంలో సతీమణితో కలిసి సీఎం చంద్రబాబు దీపావళి వేడుకలు
YSRCP ZPTC Murder: వైసీపీ జడ్పీటీసీ నూకరాజు దారుణహత్య, అల్లూరి జిల్లాలో ఘటన
వైసీపీ జడ్పీటీసీ నూకరాజు దారుణహత్య, అల్లూరి జిల్లాలో ఘటన
Bollywood Beauties Diwali Looks : బాలీవుడ్ హీరోయిన్స్ దీపావళి లుక్స్ 2025.. రష్మిక నుంచి కృతివరకు
బాలీవుడ్ హీరోయిన్స్ దీపావళి లుక్స్ 2025.. రష్మిక నుంచి కృతివరకు
Riyaz Encounter Nizamabad: రియాజ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన డీజీపీ- అందుకే కాల్పులు జరిపినట్టు ప్రకటన 
రియాజ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన డీజీపీ- అందుకే కాల్పులు జరిపినట్టు ప్రకటన 
Advertisement

వీడియోలు

Riyaz encounter news Nizamabad | నిజామాబాద్ లో ఎన్ కౌంటర్..రౌడీ షీటర్ రియాజ్ మృతి | ABP Desam
గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి.. సెమీస్ ఆశలు లేనట్లేనా..?
ఆస్ట్రేలియాతో ఫస్ట్ వన్డేలో ఫెయిలైన కోహ్లీ, రోహిత్.. రిటైర్మెంటే కరెక్టేమో..!
వర్షం కాదు.. ఓవర్ కాన్ఫిడెన్సే ముంచింది
93 ఏళ్లలో ఒకేఒక్కడు.. తెలుగోడా మజాకా..!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Diwali Celebrations: ఉండవల్లి నివాసంలో సతీమణితో కలిసి సీఎం చంద్రబాబు దీపావళి వేడుకలు
ఉండవల్లి నివాసంలో సతీమణితో కలిసి సీఎం చంద్రబాబు దీపావళి వేడుకలు
YSRCP ZPTC Murder: వైసీపీ జడ్పీటీసీ నూకరాజు దారుణహత్య, అల్లూరి జిల్లాలో ఘటన
వైసీపీ జడ్పీటీసీ నూకరాజు దారుణహత్య, అల్లూరి జిల్లాలో ఘటన
Bollywood Beauties Diwali Looks : బాలీవుడ్ హీరోయిన్స్ దీపావళి లుక్స్ 2025.. రష్మిక నుంచి కృతివరకు
బాలీవుడ్ హీరోయిన్స్ దీపావళి లుక్స్ 2025.. రష్మిక నుంచి కృతివరకు
Riyaz Encounter Nizamabad: రియాజ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన డీజీపీ- అందుకే కాల్పులు జరిపినట్టు ప్రకటన 
రియాజ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన డీజీపీ- అందుకే కాల్పులు జరిపినట్టు ప్రకటన 
Anaganaga Oka Raju: ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్లాస్ట్ 'అనగనగా ఒక రాజు' - ఈ సంక్రాంతి వరకూ దీపావళే... ఫస్ట్ సాంగ్ ఎప్పుడో తెలుసా?
ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్లాస్ట్ 'అనగనగా ఒక రాజు' - ఈ సంక్రాంతి వరకూ దీపావళే... ఫస్ట్ సాంగ్ ఎప్పుడో తెలుసా?
Nara Lokesh: పెట్టుబడుల సదస్సు కోసం ఆస్ట్రేలియాలో రోడ్ షో  - పారిశ్రామికవేత్తలతో నారా లోకేష్ చర్చలు
పెట్టుబడుల సదస్సు కోసం ఆస్ట్రేలియాలో రోడ్ షో - పారిశ్రామికవేత్తలతో నారా లోకేష్ చర్చలు
PM Modi Diwali 2025 Celebrates: దీపావళిని నేవీ సిబ్బందితో సెలబ్రేట్ చేసుకున్న పీఎం మోదీ, ఐఎన్ఎస్ విక్రమ్‌తో పాకిస్తాన్‌కు నిద్ర దూరమైందని కామెంట్స్
దీపావళిని నేవీ సిబ్బందితో సెలబ్రేట్ చేసుకున్న పీఎం మోదీ, ఐఎన్ఎస్ విక్రమ్‌తో పాకిస్తాన్‌కు నిద్ర దూరమైందని కామెంట్స్
KL Rahul Luxury Electric Car: లగ్జరీ ఎలక్ట్రిక్ కారు కొన్న కేఎల్ రాహుల్.. 548 కిలోమీటర్ల రేంజ్.. ధర, ఫీచర్లు ఇవే
లగ్జరీ ఎలక్ట్రిక్ కారు కొన్న కేఎల్ రాహుల్.. 548 కిలోమీటర్ల రేంజ్.. ధర, ఫీచర్లు ఇవే
Embed widget