అన్వేషించండి

Metro Rail MD NVS Reddy: ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి - మెట్రో రైల్ ఎండీ బాధ్యతల నుంచి తప్పించిన ప్రభుత్వం !

Metro Rail MD: మెట్రో రైల్ ఎండీగా సుదీర్ఘ కాలం నుంచి పని చేస్తున్న ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఆయన స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమించారు.

Government transfers Metro Rail MD NVS Reddy: తెలంగాణ  ప్రభుత్వం మెట్రోరైల్ ఎండీగా ఉన్న ఎన్వీఎస్ రెడ్డిని బదిలీ చేసింది. ఆయన స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్ ను నియమించింది. ఎన్వీఎస్ రెడ్డి ఇప్పటికే రిటైర్ అయినందున ఆయనను సలహాదారుగా నియమించారు. అలాగే హెచ్‌ఎండీఏ సెక్రటరీగా కోట శ్రీవత్స, మహిళాశ శిశు సంక్షేమ డైరక్టర్ గా శృతి ఓజాను బదిలీ చేశారు. 

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్  మేనేజింగ్ డైరెక్టర్ గా నల్లమోతు  వేణు గోపాల్ రెడ్డి  2007 నుంచి  కొనసాగుతున్నారు. ఆ పదవిని ఏర్పాటు చేసినప్పటి నుండి ఆయనే ఉన్నారు. నిర్వహిస్తున్నారు. 1983 బ్యాచ్ సివిల్ సర్వీసెస్ అధికారి అయిన ఆయన, మొత్తం 18 సంవత్సరాలకు పైగా ఈ పదవిలో ఉన్నారు . ఎన్వీఎస్ రిటైర్ అయి కూడా 9ఏళ్లు అవుతోంది. 2016లో రిటైర్మెంట్ తర్వాత మళ్లీ 2017లో రీఅపాయింట్‌మెంట్ అయ్యారు. 2025 మార్చిలో ఆయన పదవి రద్దు చేయాలని ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసినప్పటికీ, ఏప్రిల్ 9న మళ్లీ ఒక సంవత్సరం పొడిగించారు. చివరికి ఇప్పుడు సలహాదారుగా పదవి ఇచ్చి బదిలీ చేసారు. 

2007లో ఎచ్‌ఎమ్‌ఆర్‌ఎల్ ఏర్పాటు తర్వాత మొదటి ఎండీగా నియమితులయ్యారు. 69 కి.మీ. ఫేజ్-1 ప్రాజెక్ట్‌ను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మోడల్‌లో పూర్తి చేశారు. 2017 మార్చిలో మెట్రో సర్వీస్ ప్రారంభం నుంచి ఆయన నాయకత్వంలో 57 స్టేషన్లు, 3 కారిడార్లు (బ్లూ, రెడ్, గ్రీన్ లైన్‌లు) ఆపరేషన్‌లోకి వచ్చాయి. ప్రస్తుతం ఫేజ్-2 (లైన్ 4: జూబ్లీహిల్స్ నుంచి రంగారెడ్డి)  ఓల్డ్ సిటీ విస్తరణలు (చార్మినార్, ఫలాక్‌నుమా) ఆయన పర్యవేక్షణలో జరుగుతున్నాయి. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హ్యామ్‌ఎల్) ఎండీగా కూడా పనిచేశారు. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  మార్చి 27-28, 2025న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏయూడీ) డిపార్ట్‌మెంట్ ఆర్డర్ జారీ చేసి, 177 మంది రిటైర్డ్ అధికారుల పదవులు మార్చి 31, 2025తో రద్దు చేసింది. ఎన్‌వీఎస్ రెడ్డి కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇది రాజకీయ చర్చకు దారితీసింది, ఎందుకంటే ఆయన టెర్మ్ జూన్ 2025 వరకు ఉండాలని ముందు నిర్ణయించారు.  మార్చి ఆర్డర్ తర్వాత కేవలం 10 రోజుల్లోనే, ఏప్రిల్ 9, 2025న తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆర్డర్ జారీ చేసి, ఆయన పదవిని ఏప్రిల్ 1, 2025 నుంచి మరో సంవత్సరం పొడిగించింది. ఇది ఫేజ్-2 ప్రాజెక్టులు, ఎయిర్‌పోర్ట్ మెట్రో విస్తరణల కోసం తీసుకున్న నిర్ణయంగా ప్రభుత్వం చెప్పింది. 

ఇటీవల ఎల్ అండ్ టీ .. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ లేఖ రాసింది. తాము మెట్రోను నిర్వహించలేకపోతున్నామని.. నిర్వహణ పరంగా లాభాలు రావడం లేదని.. పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయని చెప్పింది. నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయాలని కోరింది. గతంలో కూడా ఎల్ అండ్ టీ తాము తమ వాటాని అమ్మేస్తామని కూడా లేఖలు రాసింది.  ఈ వివాదంతో పాటు.. మెట్రో విస్తరణ విషయంలో సర్వీసులో ఉండే అధికారిని నియమించాలనుకున్న ప్రభుత్వం ఎన్వీఎస్ రెడ్డిని సలహాదారుగా నియమించి.. సర్ఫరాజ్ అహ్మద్ ను ఆయన స్థానంలో నియమించింది.    
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Diversion: అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా హైదరాబాద్ లోని US consulate రోడ్ మూసివేత
అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా హైదరాబాద్ లోని US consulate రోడ్ మూసివేత
Telangana News: మార్చురీలో డెడ్‌బాడీని పీక్కుతిన్న కుక్క.. జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో దారుణం
మార్చురీలో డెడ్‌బాడీని పీక్కుతిన్న కుక్క.. జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో దారుణం
Telangana Govt: కూల్చివేతల్లో ప్రజాస్వామ్య దారి మర్చిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం - వ్యతిరేకతను ఎందుకు గుర్తించలేకపోతున్నారు?
కూల్చివేతల్లో ప్రజాస్వామ్య దారి మర్చిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం - వ్యతిరేకతను ఎందుకు గుర్తించలేకపోతున్నారు?
Vijay Deverakonda Rashmika : విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Chinni vs MLA Kolikapudi: కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
Bengal Assembly Elections 2026 : బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
Sabarimala Issue: అయ్యప్ప దేవాలయంలోకి మహిళల్ని అనుమతించం -సుప్రీంకోర్టుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అఫిడవిట్
అయ్యప్ప దేవాలయంలోకి మహిళల్ని అనుమతించం -సుప్రీంకోర్టుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అఫిడవిట్
Iran-Israel War : ఒమన్‌లో ఆయిల్ ట్యాంకర్ లక్ష్యంగా డ్రోన్ దాడి- అటాక్‌లో భారతీయుడు మృతి!
ఒమన్‌లో ఆయిల్ ట్యాంకర్ లక్ష్యంగా డ్రోన్ దాడి- అటాక్‌లో భారతీయుడు మృతి!
Vijay Deverakonda Rashmika : విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
iPhone 17e Launched: 48 MP కెమెరా, శాటిలైట్ ఫీచర్లతో వచ్చిన iPhone 17e.. ధర, పూర్తి వివరాలు
48 MP కెమెరా, శాటిలైట్ ఫీచర్లతో వచ్చిన iPhone 17e.. ధర, పూర్తి వివరాలు
Peddi Song : పెద్ది 'రయ్ రయ్ రా రా' సాంగ్ రిలీజ్ - రామ్ చరణ్ ఎనర్జిటిక్ స్టెప్స్ వేరే లెవల్
పెద్ది 'రయ్ రయ్ రా రా' సాంగ్ రిలీజ్ - రామ్ చరణ్ ఎనర్జిటిక్ స్టెప్స్ వేరే లెవల్
First class admission: 6 ఏళ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో ప్రవేశం - కొన్ని రోజులు మినహాయింపు ఇవ్వాలని తల్లిదండ్రుల డిమాండ్
6 ఏళ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో ప్రవేశం - కొన్ని రోజులు మినహాయింపు ఇవ్వాలని తల్లిదండ్రుల డిమాండ్
Embed widget