అన్వేషించండి

GHMC Worker Death: ఎట్టకేలకు అంతయ్య మృతదేహం లభ్యం.. డ్రైనేజీలో చిక్కుకున్న ఆరు రోజులకు..

ఆరు రోజుల క్రితం ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు వనస్థలిపురం సమీపంలోని సాహెబ్ నగర్‌లో మ్యాన్ హోల్‌లోకి దిగి శుభ్రం చేస్తుండగా లోపలే చిక్కుకుపోయారు.

ఆరు రోజుల క్రితం మ్యాన్‌హోల్‌లోకి దిగి చిక్కుకుపోయిన జీహెచ్ఎంసీ కార్మికుడు అంతయ్య మృతదేహం ఎట్టకేలకు దొరికింది. సోమవారం మధ్యాహ్నం రెస్క్యూ సిబ్బంది ఆయన మృతదేహం కోసం గాలిస్తుండగా లభ్యమైంది. మ్యాన్‌హోల్‌లో చిక్కుకుపోయిన ప్రదేశం నుంచి దాదాపు 350 మీటర్ల దూరంలో అంతయ్య మృతదేహాన్ని సహాయక సిబ్బంది కనుగొన్నారు.

ఆరు రోజుల క్రితం ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు వనస్థలిపురం సమీపంలోని సాహెబ్ నగర్‌లో మ్యాన్ హోల్‌లోకి దిగి శుభ్రం చేస్తుండగా లోపలే చిక్కుకుపోయారు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు మొదలు పెట్టారు. వీరిలో శివ అనే కార్మికుడి మృత దేహం లభ్యమైంది. కానీ, అంతయ్య జాడ కనిపించలేదు. ఇక అప్పటి నుంచి రెస్క్యూ సిబ్బంది అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో గాలింపు చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు నాలాలను తవ్వి తీసి మరీ గాలించారు. అయినా అంతయ్య జాడ దొరకలేదు. 

Also Read: Hyderabad Realtor Murder: రియల్టర్ హత్య కేసులో మలుపు.. ఓ మాజీ ఎమ్మెల్యే హస్తం..! అసలు సంగతి ఏంటంటే..

చివరికి బెంగళూరుకు చెందిన ఓ సాంకేతికత సాయంతో కెమెరా పరికరాలతో గాలింపు చేపట్టారు. దీంతో మృతదేహం జాడ దొరికింది. కొద్దిసేపటికే పక్కనే ఉన్న మ్యాన్ హోల్ వద్దకి మృతదేహాం వచ్చి ఆగిపోయింది. దీంతో అధికారులు వెంటనే అంతయ్య మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే స్థానికులు అంతయ్య కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని, తగిన పరిహారం ఇప్పించాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు.

Also Read: Tatikonda Rajaiah Meets Anil Kumar: షర్మిల భర్త బ్రదర్ అనిల్‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ.. ఈ సమావేశం అందుకేనా..?

అధికారులకు రేవంత్ రెడ్డి ఫోన్
మరోవైపు, జీహెచ్ఎంసీ కార్మికుడు అంతయ్య మృతదేహం ఆరు రోజులైనా కనిపించకపోవడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఇద్దరు దళితులైన కార్మికులు చనిపోతే అధికారులెవరూ ఘటనా స్థలాన్ని సందర్శించలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం (ఆగస్టు 7) జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలపై అసహనం వ్యక్తం చేశారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం సహా తగిన నష్ట పరిహారాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం కనుక ఆలస్యం చేస్తే మానవత్వం లేనట్లే అవుతుందని ట్వీట్ చేశారు.

Also Read: Dalitha Bandhu, Huzurabad: హుజూరాబాద్‌లో దళిత బంధు అమలు.. నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget