అన్వేషించండి

Dalitha Bandhu, Huzurabad: హుజూరాబాద్‌లో దళిత బంధు అమలు.. నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు

తెలంగాణ షెడ్యూల్డు కులాల కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కరీంనగర్ జిల్లా షెడ్యూల్డు కులాల కార్పొరేషన్‌ ఛైర్మన్, కలెక్టర్‌కు రూ.500 కోట్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ దళితబంధు పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు ఏకంగా రూ.500 కోట్లను విడుదల చేస్తూ సోమవారం (ఆగస్టు 9) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.500 కోట్లను తెలంగాణ షెడ్యూల్డు కులాల కార్పొరేషన్ (టీఎఎస్‌సీసీడీసీ) వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కరీంనగర్ జిల్లా షెడ్యూల్డు కులాల కార్పొరేషన్‌ ఛైర్మన్, కలెక్టర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇక హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధు అమలు కానుంది. మరోవైపు, ఇదే రోజున కాంగ్రెస్ పార్టీ దళిత దండోరా యాత్రను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే.

Dalitha Bandhu, Huzurabad: హుజూరాబాద్‌లో దళిత బంధు అమలు.. నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు

వాసాలమర్రిలో ఇప్పటికే ప్రారంభం
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వాసాలమర్రిలో దళిత బంధు పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 4న సీఎం కేసీఆర్ వాసాలమర్రి పర్యటన సందర్భంగా అక్కడ దళిత బంధు ప్రకటిస్తున్నట్లుగా ఆయన అనూహ్య ప్రకటన చేశారు. చెప్పినట్లుగానే మర్నాడు ప్రభుత్వం రూ.7.6 కోట్ల నిధులు విడుదల చేసింది. ఆ గ్రామంలో ఉన్న అన్ని దళిత కుటుంబాలకు రూ.10 లక్షల నగదు రేపే విడుదల చేస్తామని సీఎం ప్రకటించగా.. ఆగస్టు 5న దళిత బంధు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున రూ.7.6 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

దళితులకు ఇప్పటికే చాలా పథకాలు అమలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలు కారణంగా అవి వారికి సక్రమంగా చేరడం లేదని భావించిన ప్రభుత్వం ఇకపై వారి సమగ్ర అభివృద్ధి కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దళితల సాధికారత సాధించే దిశగా అడుగు వేయాలన్న ఆకాంక్షతో ఈ స్కీంను అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని సంకల్పించింది. 

సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ... దళిత బంధు పథకాన్ని  అమలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లబ్ధిదారులకు చేరాల్సిన డబ్బులు పక్కదారి పట్టకుండా పక్కా ప్రణాళికతో వారి అభివృద్ధి కోసం ఖర్చు అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అధికారులను, లబ్ధిదారులను ఆ దిశగా ప్రోత్సహించేలా కార్యాచరణ రెడీ చేశారు. ఇప్పటికే వాసలమర్రి ప్రజలతో సమావేశమై... పథకం ఎలా వినియోగించుకోవాలి... ఎలా అభివృద్ధి వైపు అడుగులు వేయాలనే అవగాహన పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు పెట్టే ఛాన్స్ కూడా ఉందంటున్నారు అధికారులు. 

ప్రస్తుతానికి హుజూరాబాద్, వాసలమర్రికే పరిమితమైన ఈ పథకాన్ని త్వరలోనే మరిన్ని నియోజకవర్గాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది ప్రభుత్వం. ఇది ఎన్నికల స్టంట్ అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు చేతలతోనే కౌంటర్ ఇవ్వాలని చూస్తోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Special Trains: ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే
ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే
AP 10th Exams Schedule: ఏపీలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఏరోజు ఏ ఎగ్జామ్ తెలుసుకోండి
ఏపీలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఏరోజు ఏ ఎగ్జామ్ తెలుసుకోండి
Revanth Reddy at WEF:
"మేధస్సే సమస్య మేధస్సే పరిష్కారం" ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ సీఎం కీలక కామెంట్స్
Telugu TV Movies Today: బుధవారం (జనవరి 21)... తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలివే! డోంట్ మిస్!
బుధవారం (జనవరి 21)... తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలివే! డోంట్ మిస్!

వీడియోలు

Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Medaram Jatara Gattamma Thalli History | ఎవరీ గట్టమ్మ తల్లి ? | ABP Desam
WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Special Trains: ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే
ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే
AP 10th Exams Schedule: ఏపీలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఏరోజు ఏ ఎగ్జామ్ తెలుసుకోండి
ఏపీలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఏరోజు ఏ ఎగ్జామ్ తెలుసుకోండి
Revanth Reddy at WEF:
"మేధస్సే సమస్య మేధస్సే పరిష్కారం" ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ సీఎం కీలక కామెంట్స్
Telugu TV Movies Today: బుధవారం (జనవరి 21)... తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలివే! డోంట్ మిస్!
బుధవారం (జనవరి 21)... తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలివే! డోంట్ మిస్!
APSRTC Income: ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
టయోటా ఇబెల్లా vs మారుతి ఈ విటారా: బయటి లుక్‌ నుంచి డ్రైవింగ్‌ రేంజ్‌ వరకు ఏమేం మారాయి?
టయోటా ఇబెల్లా vs మారుతి ఈ విటారా: ఒకే ఫ్లాట్‌ఫామ్‌పై తయారైన ఈ రెండు కార్ల మధ్య తేడాలు ఇవే
Nitin Navin:
"మీరే బాస్, నేను పార్టీ కార్యకర్తను" నితిన్ నవీన్‌తో ప్రధాని మోదీ సంభాషణ వైరల్
Nara Lokesh in Davos: ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
Embed widget