అన్వేషించండి

Jithender Reddy: బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన జితేందర్ రెడ్డి - వెంటనే కీలక పదవి, ఉత్తర్వులు జారీ

Telangana News: మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఆయనకు కేబినెట్ ర్యాంకు పదవి ఇచ్చింది.

Former MP Jitender Reddy joined the Congress party: హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీకి షాకిచ్చారు. బీజేపీకి రాజీనామా చేసిన జితేందర్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. మహబూబ్ నగర్ ఎంపీ సీటు ఆశించి భంగపడ్డ జితేందర్ రెడ్డి కాషాయ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. డీకే అరుణకు బీజేపీ అధిష్టానం ఛాన్స్ ఇవ్వడంతో కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్న ఆయన.. బీజేపీని వీడి కుమారుడు మిథున్ రెడ్ఢిలో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇటీవల జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించడంతో హస్తం గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ లో చేరిన కొన్ని గంటల్లోనే ఆయనను కీలక పదవి వరించింది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా (క్రీడా వ్యవహారాలు) రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం (మార్చి 15న) రాత్రి జారీ చేశారు. మల్లు రవి ఇటీవల ఆ పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. దాంతో పార్టీలో చేరిన వెంటనే పాలమూరు జిల్లాకే చెందిన మరోనేత జితేందర్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం పదవి ఇచ్చింది. క్యాబినేట్ ర్యాంక్‌తో తెలంగాణ ప్రభుత్వ క్రీడా వ్యవహరాల సలహాదారుడిగా జితేందర్ రెడ్డి నియమితులయ్యారు. 
Image

వరుసగా రెండు ఎన్నికల్లో నో టికెట్.. 
2019 ఎన్నికల సమయంలో జితేందర్ రెడ్డికి అప్పటి సీఎం కేసీఆర్ టిక్కెట్ నిరాకరించారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో వెంటనే బీజేపీలో చేరారు. బీజేపీ అప్పటికే డీకే అరుణకు టిక్కెట్ ఖరారు చేసింది. దీంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా డీకే అరుణ కోసం ప్రచారం చేశారు. స్వల్ప తేడాతో డీకే అరుణ ఓడిపోయారు. అయితే ఆ తర్వాత ఎంపీ టిక్కెట్ కోసం ఇద్దరు నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఒకరిని అసెంబ్లీకి పోటీ చేయించేందుకు హైకమాండ్ ప్రయత్నించింది. కానీ ఇద్దరూ పోటీ చేయలేదు. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డికి చాన్సిచ్చారు. ఆయన ఓటమిచెందారు. ఈ క్రమంలో పాలమూరు ఎంపీ టిక్కెట్ కోసం కూడా జితేందర్ రెడ్డి ప్రయత్నించినా.. అధిష్టానం డీకే అరుణ వైపు మొగ్గుచూపింది. గత ఎన్నికల్లో డీకే అరుణ స్వల్ప తేడాతోనే ఓటమి చెందడంతో మరోసారి ఆమెకు ఛాన్స్ ఇచ్చింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court :  టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
Kancha Gachibowli Land Case: కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Preity Zinta Celebrations | PBKS vs KKR మ్యాచ్ లో ప్రీతి జింతా సెలబ్రేషన్స్ వైరల్Narine Bat Inspection vs PBKS IPL 2025 | పంజాబ్ మ్యాచ్ లో నరైన్ కి షాక్ ఇచ్చిన అంపైర్లుPBKS vs KKR Match Chahal Bowling | IPL 2025 లో సంచలన బౌలింగ్ తో పంజాబ్ కు సెన్సేషనల్ విక్టరీPBKS Highest lowest IPL 2025 | వరుస మ్యాచుల్లో రెండు వేరియేషన్స్ చూపించిన పంజాబ్ కింగ్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court :  టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
Kancha Gachibowli Land Case: కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
Kavitha Lokesh Politics:  లోకేష్ బాటలోనే  కవిత రాజకీయాలు  - పాదయాత్ర కూడా చేస్తారా ?
లోకేష్ బాటలోనే కవిత రాజకీయాలు - పాదయాత్ర కూడా చేస్తారా ?
AP DSC Notification: అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
Akshaya Tritiya 2025 Date : అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా పిచ్చితనం మరొకటి లేదా!
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా పిచ్చితనం మరొకటి లేదా!
Next Chief Justice: భారత తదుపరి చీఫ్ జస్టిస్‌గా బీఆర్ గవాయ్ - సిఫారసు చేసిన కొలీజియం
భారత తదుపరి చీఫ్ జస్టిస్‌గా బీఆర్ గవాయ్ - సిఫారసు చేసిన కొలీజియం
Embed widget