అన్వేషించండి

Mahabubnagar: రాజకీయాలు ఛండాలం, టీఆర్ఎస్ శాశ్వతమేం కాదు.. గులాబీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు

జడ్చర్ల శాసన సభ్యుడైన లక్ష్మా రెడ్డి ఇలా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత రాజకీయాలపై తన అభిప్రాయాన్ని ఆయన కుండబద్దలు కొడుతూ మాట్లాడారు.

మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన చర్నకోల లక్ష్మా రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా ఛండాలంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఏ రాజకీయ నేత ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉందని సీహెచ్ లక్ష్మా రెడ్డి అన్నారు. అధికారం ఏ ఒక్క పార్టీకీ శాశ్వతం కాదని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా బాధ్యతగా వ్యవహరించాల్సిందేనని లక్ష్మా రెడ్డి సూచించారు. ప్రభుత్వాలు చేసే ప్రతి పనిని విపక్షాలు విమర్శించడం సరి కాదని లక్ష్మా రెడ్డి అభిప్రాయపడ్డారు.

జడ్చర్ల శాసన సభ్యుడైన లక్ష్మా రెడ్డి ఇలా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత రాజకీయాలపై తన అభిప్రాయాన్ని ఆయన కుండబద్దలు కొడుతూ మాట్లాడారు. రాజకీయ నేతలు స్వార్థం కోసం తొండి, అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కొందరు రాజకీయ నేతలు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని లక్ష్మా రెడ్డి ధ్వజమెత్తారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, చివరికి టీఆర్‌ఎస్ పార్టీకి కూడా అధికారం శాశ్వతం కాదంటూ లక్ష్మా రెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. గతంలో అత్యధిక సంవత్సరాలు రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా శాశ్వతం ఏం కాదని అన్నారు. ఆ పార్టీ కూడా అధికారంలో నుంచి దిగిపోవాల్సి వచ్చిందని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా బాధ్యతగా ఉండాలన్నారు. 

ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్ష పాత్ర సమర్థంగా పోషించాలని అన్నారు. ప్రభుత్వం ఏం చేసినా ప్రతిపక్షాలు తప్పు అనేలా ఉండకూడదని లక్ష్మా రెడ్డి చెప్పారు. జడ్చర్లలో జరిగిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో లక్ష్మా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు గందరగోళానికి గురవకుండా ఉపాధ్యాయులే వారిలో చైతన్యం తీసుకురావాల్సి ఉంటుందని సూచించారు.

గతంలోనూ ఆసక్తికర వ్యాఖ్యలు
కొద్ది రోజుల క్రితం కూడా లక్ష్మా రెడ్డి ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తారని టీఆర్ఎస్ హామీ ఇచ్చినట్లుగా విపక్షాలు తరచూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అది సాధ్యం కాదని లక్ష్మా రెడ్డి వ్యాఖ్యానించారు. జడ్చర్ల మండలం శంకరాయపల్లి సమీపంలో నిర్మించిన పీఆర్‌టీయూ సంఘ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కోటి ఫ్యామిలీలు ఉంటే కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇవ్వగలమని లాజిక్‌తో ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే నడుస్తున్నాయని అన్నారు. ప్రజలకు ఏ పథకం పెడితే ఎన్ని ఓట్లు వస్తాయో అని ఆలోచించటం సరైనది కాదని అన్నారు. వెనుకబడిన దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ఎంతో ఆలోచించి దళిత బంధు ప్రవేశపెడితే విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, ఇది సరికాదని అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget