By: ABP Desam | Updated at : 30 Jun 2023 09:24 PM (IST)
ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)
ఈటల రాజేందర్ కు వై ప్లస్ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపు (జూలై 1) ఉదయం నుంచి హుజురాబాద్ ఎమ్మెల్యే రాజేందర్ కు వై ప్లస్ స్టేట్ కేటగిరి భద్రత ఏర్పాటు చేయనున్నారు. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తో పాటు 16 మంది సెక్యూరిటీ సిబ్బంది ఈటల రాజేందర్ వెంట ఉండనున్నారు. భద్రతకు సంబంధించి నిన్న (జూన్ 29) మేడ్చల్ డీసీపీ సందీప్ రావు నిన్న ఈటల రాజేందర్ ను కలిసి వివరాలు సేకరించారు. ప్రాణహానికి సంబంధించిన వివరాలను ఈటల నుంచి సేకరించారు. దీనికి సంబంధించి డీజీపీకి సీల్డు కవర్లో డీసీపీ సందీప్ నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా ఈటలకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎమ్మెల్యే ఈటల హుజురాబాద్తో పాటు ఇతర జిల్లాల పర్యటనల్లో అనుమానాస్పద రీతిలో కార్లు తిరుగుతున్నాయని ఈటల రాజేందర్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఈటల మీడియాకు వెల్లడించిన వెంటనే మంత్రి కేటీఆర్ దీనిపై స్పందించారు. స్వయంగా చొరవ తీసుకొని డీజీపీకి ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఈటల రాజేందర్ ను కలిసి వివరాలను సేకరించినట్లుగా మేడ్చల్ డీసీపీ సందీప్ రావు తెలిపారు.
TS TET: తెలంగాణ 'టెట్' పేపర్-1లో 36.89 శాతం, పేపర్-2లో 15.30 శాతం ఉత్తీర్ణత
Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన
Hyderabad Traffic Restrictions: గురువారం హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం, ట్రాఫిక్ ఆంక్షలు ఇలా
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Revanth Reddy: చంద్రబాబు జాతీయ నేత, నిరసనలకు అనుమతి ఇవ్వరా? కేటీఆర్పై రేవంత్ రెడ్డి ఫైర్
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్కోట్ వన్డేలో టీమ్ఇండియా ఓటమి
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం
Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్
/body>