అన్వేషించండి

Disha Case : ఎన్‌కౌంటర్‌ కేసులో ముందుగా విచారించొద్దు.. దిశ కమిషన్‌పై కోర్టుకెళ్లిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ !

దిశ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపుతున్న కమిషన్‌ తమను ఇప్పుడే ప్రశ్నించవద్దని ఇద్దరు పోలీసు అధికారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. సాక్షులను ప్రశ్నించిన తర్వాతనే తమను విచారించాలని వారు కోరుతున్నారు.

తెలంగాణ పోలీసులకు దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఘటన ఆందోళన కలిగిస్తున్నట్లుగా ఉంది. ఆ ఎన్‌కౌంటర్‌పై నిజానిజాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణ వేగంగా సాగుతోంది. అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సహా ఆ ఎన్‌కౌంటర్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన వారందర్నీ కమిషన్ ప్రశ్నిస్తోంది. అయితే ఈ కమిషన్ విచారణ తీరుపై ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు హైకోర్టులో పిటిషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. 

Also Read : తెలంగాణలో డ్రగ్స్ కలకలం... రూ. 2 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం... స్టూడెంట్స్ లక్ష్యంగా దందా...!

దిశ కేసులో జస్టిస్ సిర్ఫూర్కర్ కమిషన్ ముందుగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్‌ను ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ విచారణ అధికారి ఏసీపీ సురేందర్, మరో అధికారి నర్సింహారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అధికారులను ముందుగా విచారణ చేయడం నిబంధనలకు విరుద్దమని ఈ అధికారులు ఇద్దరూ తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అధికారుల తరపున సీనియర్ కౌన్సెల్ వివేక్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. ముందుగా సాక్ష్యులను విచారించాలని.. ఆ తర్వాతే విచారణ అధికారులను ప్రశ్నించాలని వివేక్ రెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అయితే  జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ మాత్రం  సాక్షుల కంటే ముందే విచారణ అధికారులు అయిన పిటిషనర్లను ప్రశ్నించాలని అనుకుంటోందని .. ఆ విచారణపై స్టే ఇవ్వాలి కోరారు. సాక్షులను విచారించిన తర్వాత విచారణ అధికారులను పిలిచేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలు విన్న తర్వాత విన్న హైకోర్టు తీర్పు రీజర్వ్ చేసింది. 

Also Read: బిడ్డ తన పోలికలతో పుట్టలేదని చంపేసిన తండ్రి.. అనంతరం మరో ఘోరం

జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ చురుగ్గా విచారణ చేపడుతోంది. ఈ విచారణలో అధికారులపై సూటిగా ప్రశ్నలు సంధిస్తోంది. ఎన్ కౌంటర్ విషయంలో ఉన్న అనుమానాలు, ఆరోపణలు, ప్రచారాలు అన్నింటినీ ప్రస్తావిస్తూ.. పోలీసులు అబద్దాలు చెబుతున్నారన్న దాన్ని ఎక్స్‌పోజ్ చేస్తోందని జాతీయ మీడియాలోనూ కథనలు వచ్చాయి. ఈ క్రమంలో సజ్జనార్ విచారణ జరిగిన తీరు.. శంషాబాద్ డీసీపీ కూడా పొంతన లేని సమాధానాలు చెప్పారని మీడియాలో వచ్చిన తరుణంలో ఇద్దరు పోలీసు అధికారులు తమ విచారణ ఇప్పుడే వద్దంటూ హైకోర్టులో పిటిషన్ వేయడం ఆశ్చర్యకరంగా మారింది. 

Also Read : మాజీ ఎమ్మెల్యే కొడుకు ఐఏఎస్.. కానీ ఆయన చేసిన పనే కేస్ అయింది !

2019లో ఎన్‌కౌంటర్ జరిగినప్పుడే సుప్రీంకోర్టు జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కానీ కోవిడ్ కారణంగా కమిషన్ వచ్చి విచారణ జరపలేకపోయింది. ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించడంతో కమిషన్ విచారమ ప్రారంభించారు. మరో వారంలో విచారణ పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టుకు సిర్పూర్కర్ కమిషన్ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. 

Also Read : ప్రపోజ్ చేస్తే ఒప్పుకోని యువతికి గంజాయి గిఫ్టుగా ఇచ్చాడు.. తర్వాత ట్విస్టు మామూలుగా లేదు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Embed widget