అన్వేషించండి

KCR RajBhavan : గవర్నర్, కేసీఆర్ మధ్య విభేదాలు పరిష్కారం అయినట్లే - చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారంలో జరిగిందేమిటంటే ?

గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్‌ మధ్య ఉన్న అభిప్రాయభేదాలు పరిష్కారం అయినట్లుగా కనిపిస్తున్నాయి. చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారానికి హాజరైన కేసీఆర్ గవర్నర్‌తో కలుపుగోలుగా మాట్లాడారు.

KCR RajBhavan : గవర్నర్‌ విషయంలో కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వాధినేత కేసీఆర్‌కు ఉన్న అసంతృప్తి తొలగిపోయినట్లుగా కనిపిస్తోంది.  తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిశై సౌందరరాజన్‌తో కలుపుగోలుగా మాట్లాడారు. గతంలో ఉన్న విభేదాల ప్రభావం కనిపించకుండా చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.   రాజ్‌భవన్‌లో జరిగన కార్యక్రమంలో మంగళవారం గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, ఉజ్జల్‌ భూయాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు.  ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మను ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. 

ప్రపంచ చరిత్రలో అతిపెద్ద స్టార్టప్ క్యాంపస్, హైదరాబాద్‌లో నేడే ప్రారంభం

అసోంకు చెందిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ 2011 అక్టోబర్‌ 17న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యారు.2019 అక్టోబర్‌ 3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 అక్టోబర్‌ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. ఆయన తండ్రి సుచేంద్రనాథ్‌ భూయాన్‌ సీనియర్‌ న్యాయవాది. అసోం అడ్వొకేట్‌ జనరల్‌గా కూడా పనిచేశారు. జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ 1964 ఆగస్టు 2న గువాహటీలో జన్మించారు. అక్కడి డాన్‌ బాస్కో ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య, కాటన్‌ కాలేజీలో ఇంటర్‌, దిల్లీలోని కిరోరి మాల్‌ కాలేజీలో డిగ్రీ చేశారు. గువాహటీ ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ, గువాహటీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌ఎం చేశారు. 1991 మే 20న అసోం న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు.

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణం, హాజరైన సీఎం కేసీఆర్
 
ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత  గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన తేనేటి విందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా త‌మిళిసైతో కేసీఆర్ ముచ్చ‌టించారు. ఇక అక్క‌డే ఉన్న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో కూడా కేసీఆర్ మాట్లాడారు. పలు అంశాలపై ఆహ్లాదంగా మాట్లాడుకున్నారు. పలుమార్లు నవ్వుతూ మాట్లాడుకోవడం  అందర్నీ ఆకర్షించింది. ప్రగతి భవన్ - రాజ్ భవన్ మధ్య ఇప్పటి వరకూ కనిపించిన గ్యాప్ ఇక ఉండదని భావిస్తున్నారు. 

గవర్నర్ రాజ్ భవన్ ముందు ఫిర్యాదుల బాక్స్ పెట్టడం, ప్రజాదర్భార్ నిర్వహించడం వంటి కారణాల వల్ల  సీఎం కేసీఆర్ గవర్నర్‌పై ఆగ్రహంతో ఉన్నారు.  ప్రోటోకాల్  కూడా కేటాయించడం లేదన్న ఆరోపణలను గవర్నర్ చేస్తున్నారు. ఈ క్రమంలో  రాజ్ భవన్‌లో జరిగిన చీఫ్ జస్టిస్ ప్రమాణానికి కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయించుకోవడమే కాదు.. ఆ కార్యక్రమంలో ఆహ్లాదంగా కలివిడిగా ఉండటం  రాజకీయ వాతావరణాన్ని సైతం తేలిక పరిచినట్లయింది. 

 

టాప్ హెడ్ లైన్స్

Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget