అన్వేషించండి

Kishan Reddy on CM KCR : రా రైస్ ఇస్తే చివరి గింజ వరకూ కొంటాం, రైతుల కోసం ఆ నష్టాన్ని భరించలేరా? : కిషన్ రెడ్డి

Kishan Reddy : ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ కేంద్రంపై చేసిన విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Kishan Reddy on Paddy Procurement : టీఆర్ఎస్, బీజేపీ మధ్య వరి వార్ రోజు రోజుకీ ముదురుతోంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ దిల్లీలో రైతు దీక్ష చేపట్టి కేంద్రం ప్రభుత్వానికి 24 గంటల అల్టిమేటమ్ ఇచ్చారు. కేంద్రం తెలంగాణ ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. టీఆర్ఎస్ విమర్శలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దిల్లీలో మాట్లాడిన ఆయన... సీఎం కేసీఆర్ మొండి వైఖరి వీడాలన్నారు. టీఆర్ఎస్ తెలంగాణ రైతాంగాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేంద్రం విద్యుత్ మోటర్లకు మీటర్లు పెట్టబోతోందని ఇందిరా పార్క్ దగ్గర ఉద్యమాలు చేశారన్నారు. మీటర్లపై కేంద్రం జీవో కానీ చట్టం కానీ తీసుకురాలేదన్నారు. ఎరువులపై కేంద్రం సబ్సిడీ తీసేస్తుందని చేసిన ఆరోపణలను రైతుల నమ్మలేదన్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు సమస్య ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రానికి ఉప్పుడు బియ్యం పంపించమని తెలంగాణ ప్రభుత్వమే ఒప్పందం చేసుకుందన్నారు. 

బాయిల్డ్ రైస్ ఉచితంగా ఇచ్చినా తినట్లే 

సీఎం కేసీఆర్ ఇప్పుడు రైతుల మెడ మీద కత్తి పెట్టి బెదిరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఉప్పుడు బియ్యం నిల్వలు పెరిగిపోతున్నాయన్నారు. గత మూడు నాలుగేళ్లుగా బాయిల్డ్ రైస్ వద్దని రాష్ట్రాలను ఒప్పించే ప్రయత్నాలు కేంద్రం చేస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని సమస్య తెలంగాణకు ఎందుకన్నారు. ధాన్యంపై లేని సమస్యను ఉన్నట్లుగా సీఎం కేసీఆర్ చూపిస్తోందని విమర్శించారు. బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని కేంద్రానికి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారన్నారు. బాయిల్డ్‌ రైస్‌ను ఎక్కడా వినియోగించడంలేదన్నారు. బాయిల్డ్‌ రైస్‌ను ఉచితంగా పంచినా ప్రజలు తినే పరిస్థితి లేదన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని బాయిల్డ్‌ రైస్‌ సేకరణకు ఎఫ్‌సీఐ నిలిపివేసిందన్నారు. సీఎం కేసీఆర్‌ లేని సమస్యను సృష్టించి, వాస్తవాలను వక్రీకరించి ధర్నాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం 

తెలంగాణ రైతు భవిష్యత్ కల్వకుంట్ల కుటుంబం చేతిలో నలిగిపోతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. దేశంలో వేరువేరు విధానాలు లేవన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం ఉందన్నారు. దేశంలో భూకంపం సృష్టిస్తామని కేసీఆర్ అంటున్నారు. టీఆర్ఎస్ లో భూకంపం రాకుండా చూసుకోండన్నారు. టీఆర్ఎస్ నేతలు పోటీలు పడి విమర్శిస్తున్నారన్నారు. గత సీజన్‌లో ఎఫ్‌సీఐకి 62 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇస్తామని తెలంగాణ ఒప్పందం చేసుకుందన్నారు. గత సీజన్‌లో ఇస్తామన్న బాయిల్డ్‌ రైస్‌ను రాష్ట్రం ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. ఇంకా 8.34 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి పంపలేదని కిషన్ రెడ్డి అన్నారు. బాయిల్డ్‌ రైస్‌ కాకుండా రా రైస్ సరఫరా చేస్తే కేంద్రం తీసుకుంటుందన్నారు. రా రైస్‌గా ఇస్తే చివరి గింజ వరకూ కేంద్రం కొంటుందని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రానికి రా రైస్‌ సరఫరా చేస్తే నూకల రూపంలో కొంత నష్టం వస్తుందన్నారు. రైతుల కోసం కొద్ది నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించలేరా అని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ రాజకీయ భవిష్యత్ సీఎం కేసీఆర్ అనవసర రాద్ధాంతం చేస్తున్నామన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో రక్తపాతం.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో రక్తపాతం.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
Breaking News: బాసర ఆలయ అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి జూపల్లి ఆదేశం
బాసర ఆలయ అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి జూపల్లి ఆదేశం
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున సిటీ - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Horror: పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో రక్తపాతం.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో రక్తపాతం.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున సిటీ - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
US Iran War: ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
Papaya Leaf Juice : బొప్పాయి ఆకుల జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. ఎలా తీసుకోవాలి? ఎంత మోతాదులో తాగాలి?
బొప్పాయి ఆకుల జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. ఎలా తీసుకోవాలి? ఎంత మోతాదులో తాగాలి?
Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
Drinks to Refresh Your Body : హైడ్రేషన్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. వీకెండ్‌(Weekend)లో హెల్త్ రీసెట్ చేసుకునేందుకు బెస్ట్
హైడ్రేషన్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. వీకెండ్‌(Weekend)లో హెల్త్ రీసెట్ చేసుకునేందుకు బెస్ట్
Secrets of Tirumala: 'వేంకటేశ్వర' పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
'వేంకటేశ్వర' ఈ పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
Embed widget