అన్వేషించండి

Bhatti Vikramarka: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం, బీఆర్ఎస్ నేతల్లో వణుకు - భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో నడిచిందని చెప్పుకున్న బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారని అన్నారు.

Bhatti Vikramarka Comments on BRS Leaders: తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై త్వరలోనే తాము శ్వేత పత్రం విడుదల చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఒక ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. మొత్తానికి నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడారని.. ఇప్పుడు తాము వారి పాలనపై, రాష్ట్ర స్థితిగతులపై శ్వేత పత్రం విడుదల చేస్తామని అనడంతో బీఆర్ఎస్ నేతలు వణికిపోతున్నారని భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.  బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో నడిచిందని చెప్పుకున్న బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పలు శాఖల్లో అక్రమాలు, ఫైల్స్ మాయం అవుతున్న ఘటనలు జరుగుతున్నాయని అన్నారు.

ఇదే సమయంలో తాము శ్వేత పత్రం విడుదల చేస్తామని చెప్పడంతో వారిలో ఆందోళన నెలకొంది. మధిర నియోజకవర్గ ప్రజల అండతోనే నేను ఈ ఉన్నతమైన పదవిని చేపట్టాను. ఒక చారిత్రక విజయం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది’’ అని భట్టి విక్రమార్క అన్నారు

ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన భట్టి విక్రమార్క ఆ హోదాలో తొలిసారిగా తన సొంత నియోజకవర్గం మధిరకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భట్టి.. భద్రాచల రాములవారిని దర్శించుకున్నారు. దీనిపై ఓ పోస్టు చేస్తూ.. రాములవారి ఆశీర్వాదంతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగిందని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సారిగా శ్రీరాముడిని సందర్శించడం ఎంతో గొప్ప అనుభూతి ఇచ్చిందని భట్టి విక్రమార్క చెప్పారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని భట్టి దర్శించుకునే సమయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు. 

వారికి ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు దేవస్థానం సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాముడి కంటే గొప్పగా ప్రజాపాలన అందించే దేవుడు లేడని అన్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించే వారికి రాముడే ఆదర్శం అని.. ప్రజలు కోరుకున్నది అందించే ఏకైక రాజు శ్రీరామచంద్రమూర్తి అని తెలిపారు. కాబట్టి రాముడిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజాపాలన అందిస్తామని అన్నారు. 

మతసామరస్యానికి కూడా పేరుగాంచిన దేవాలయం భద్రాద్రి రామాలయం అని కొనియాడారు. ఆనాటి ముస్లిం రాజు అయిన తానీషా, హిందూ దేవుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి ముత్యాల తలంబ్రాలు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటువంటి లౌకికవాదానికి ప్రతీకగా నిలిచిన రామాలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో సంపద పెంచుతామని, ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందిస్తామని చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.