అన్వేషించండి

Telangana Congress : లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహాత్మక ప్రయత్నాలు - తెలంగాణ కీలక నేతలకు బాధ్యతలు !

Lok Sabha Seats : తెలంగాణలోని లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ ఇంచార్జుల్ని నియమించింది. హైకమాండ్ సైతం ప్రత్యేక దృష్టి పెట్టింది.

Telangana Congress Lok Sabha incharges :  అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు గెల్చుకునేందుకు పట్టుదలగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా.. కొత్తగా ఇంచార్జుల్ని నియమించారు.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ అత్యధిక పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ నియమించింది. తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డిని అధిష్టానం నియమించింది. ఈ కమిలో రేవంత్ రెడ్డితో పాటు మొత్తం 25 మంది ఉన్నారు. మరో ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. తాజాగా   పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా కో-ఆర్డినేటర్లను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.


తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఏఐసీసీ నియమించిన కో-ఆర్డినేటర్లు వీరే 

అదిలాబాద్ (ఎస్టీ) – డి. అనసూయ (సీతక్క)
పెద్దపల్లి (ఎస్సీ) – డి. శ్రీధర్ బాబు
కరీంనగర్ – పొన్నం ప్రభాకర్
నిజామాబాద్ – టి. జీవన్ రెడ్డి
జహీరాబాద్ – పి. సుదర్శన్ రెడ్డి
మెదక్ – దామోదర్ రాజనర్సింహ
మల్కాజిగిరి – తుమ్మల నాగేశ్వరరావు
సికింద్రాబాద్ – మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్ – మల్లు భట్టి విక్రమార్క
చేవెళ్ల – రేవంత్ రెడ్డి
మహబూబ్ నగర్ – రేవంత్ రెడ్డి
నాగర్ కర్నూల్ (ఎస్సీ) – జూపల్లి కృష్ణారావు
నల్గొండ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
భువనగిరి – కోమిరెడ్డి వెంకట్ రెడ్డి
వరంగల్ (ఎస్సీ) – కొండా సురేఖ
మహబూబాబాద్ (ఎస్టీ) – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్న కాంగ్రెస్ పార్టీ.. క్లస్టర్ల వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. దేశంలోని రాష్ట్రాలు/యూటీలను 5 క్లస్టర్లుగా విభజించి.. కమిటీలను నియమించింది. శుక్రవారం ఈ మేరకు కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ   కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. తెలంగాణతో పాటు సౌతిండియాలోని కర్నాటక, తమిళనాడు, కేరళ, లక్ష్యద్వీప్, పుదుచ్చేరిలను క్లస్టర్ –1లో చేర్చింది.             

పార్టీలోని సీనియర్‌ నేతలతో పాటు మంత్రులను, నేతలను సమన్వయం చేసుకునేలా త్వరలోనే ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.  త్వరలో లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. ఏఐసీసీ అగ్రనేతలతోపాటు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంత్రులు, పార్టీలోని ముఖ్యనేతలతో సమావేశమై వ్యూహాలపై చర్చించనున్నారు.               

 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పార్టీ సీనియర్‌ నేతలతో సమావేశాన్ని కూడా నిర్వహించింది. ఈ ఎన్నికల్లో అభ్యర్థులను ఎవరిని బరిలో దింపాలనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టుగా సమాచారం. అయితే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ త్యాగం చేసిన వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే ఎమ్మెల్యే టికెట్‌ కోసం రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలామంది సీనియర్‌ నేతలు ఆశావహులుగా ఉన్నారు.          

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

హైదరాబాద్‌ స్టేడియాలను అంతర్దాతీయ స్థాయిలోకి మారుస్తా..: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ స్టేడియాలను అంతర్దాతీయ స్థాయిలోకి మారుస్తా..: సీఎం రేవంత్ రెడ్డి
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Telangana Assembly: తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులకు షాక్ -వేతనంలో 15 శాతం కోతకు తెలంగాణ సర్కార్ చట్టం
తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులకు షాక్ -వేతనంలో 15 శాతం కోతకు తెలంగాణ సర్కార్ చట్టం

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB Vs SRH Result Update: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
CM Revanth Reddy: 2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Embed widget