అన్వేషించండి

Telangana Congress : లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహాత్మక ప్రయత్నాలు - తెలంగాణ కీలక నేతలకు బాధ్యతలు !

Lok Sabha Seats : తెలంగాణలోని లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ ఇంచార్జుల్ని నియమించింది. హైకమాండ్ సైతం ప్రత్యేక దృష్టి పెట్టింది.

Telangana Congress Lok Sabha incharges :  అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు గెల్చుకునేందుకు పట్టుదలగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా.. కొత్తగా ఇంచార్జుల్ని నియమించారు.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ అత్యధిక పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ నియమించింది. తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డిని అధిష్టానం నియమించింది. ఈ కమిలో రేవంత్ రెడ్డితో పాటు మొత్తం 25 మంది ఉన్నారు. మరో ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. తాజాగా   పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా కో-ఆర్డినేటర్లను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.


తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఏఐసీసీ నియమించిన కో-ఆర్డినేటర్లు వీరే 

అదిలాబాద్ (ఎస్టీ) – డి. అనసూయ (సీతక్క)
పెద్దపల్లి (ఎస్సీ) – డి. శ్రీధర్ బాబు
కరీంనగర్ – పొన్నం ప్రభాకర్
నిజామాబాద్ – టి. జీవన్ రెడ్డి
జహీరాబాద్ – పి. సుదర్శన్ రెడ్డి
మెదక్ – దామోదర్ రాజనర్సింహ
మల్కాజిగిరి – తుమ్మల నాగేశ్వరరావు
సికింద్రాబాద్ – మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్ – మల్లు భట్టి విక్రమార్క
చేవెళ్ల – రేవంత్ రెడ్డి
మహబూబ్ నగర్ – రేవంత్ రెడ్డి
నాగర్ కర్నూల్ (ఎస్సీ) – జూపల్లి కృష్ణారావు
నల్గొండ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
భువనగిరి – కోమిరెడ్డి వెంకట్ రెడ్డి
వరంగల్ (ఎస్సీ) – కొండా సురేఖ
మహబూబాబాద్ (ఎస్టీ) – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్న కాంగ్రెస్ పార్టీ.. క్లస్టర్ల వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. దేశంలోని రాష్ట్రాలు/యూటీలను 5 క్లస్టర్లుగా విభజించి.. కమిటీలను నియమించింది. శుక్రవారం ఈ మేరకు కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ   కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. తెలంగాణతో పాటు సౌతిండియాలోని కర్నాటక, తమిళనాడు, కేరళ, లక్ష్యద్వీప్, పుదుచ్చేరిలను క్లస్టర్ –1లో చేర్చింది.             

పార్టీలోని సీనియర్‌ నేతలతో పాటు మంత్రులను, నేతలను సమన్వయం చేసుకునేలా త్వరలోనే ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.  త్వరలో లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. ఏఐసీసీ అగ్రనేతలతోపాటు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంత్రులు, పార్టీలోని ముఖ్యనేతలతో సమావేశమై వ్యూహాలపై చర్చించనున్నారు.               

 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పార్టీ సీనియర్‌ నేతలతో సమావేశాన్ని కూడా నిర్వహించింది. ఈ ఎన్నికల్లో అభ్యర్థులను ఎవరిని బరిలో దింపాలనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టుగా సమాచారం. అయితే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ త్యాగం చేసిన వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే ఎమ్మెల్యే టికెట్‌ కోసం రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలామంది సీనియర్‌ నేతలు ఆశావహులుగా ఉన్నారు.          

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Raashi Khanna : గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
Happy Dussehra 2024 : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
Embed widget