అన్వేషించండి

Telangana Rains: వానలొస్తున్నాయి.. ఆగస్టు 10 దాకా జరభద్రం!

కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  


భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్​లో సీఎస్, ఉన్నతాధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశమై.. వరదలు, సహాయక చర్యలపై మాట్లాడారు.


భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రానికి వరదలు పెరుగుతున్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, క్షణ క్షణం పూర్తి అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. కృష్ణా గోదావరీ పరీవాహక ప్రాంతాల్లో తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే పరిస్థితులున్నందున అందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఇక నుంచి కరవు పరిస్థితులు ఉండవని, వరద పరిస్థితులను ఎదుర్కొనే పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఉన్నతాధికారులకు తెలిపారు.


వరద పరిస్థితుల్లో ఏ విధంగా ప్రజా రక్షణ చర్యలు చేపట్టాలో తెలిసిన కొంతమందితో సమర్థవంతమైన ఫ్లడ్ మేనేజ్మెంట్ టీమ్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. వరదలు ఉత్పన్నమైన సందర్భాల్లో యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యల మీద అవగాహన కల్పించబడిన ఉన్నతాధికారులను నియమించాలని తెలిపారు. ఈ బృందాన్ని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవాలన్నారు. 
ఫ్లడ్ మేనేజ్ మెంట్ టీంలో నియమించబడే అధికారులకు ఉండాల్సిన అవగాహనను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వివరించారు. 

ఇరిగేషన్, పంచాయితీరాజ్, మున్సిపల్, ఆర్ అండ్ బీ, రెవిన్యూ, వైద్యశాఖ, జీఎడి శాఖల గురించిన అనుభవం కలిగి ఉండాలి. ఈ సభ్యుల్లో ఒకరు., లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తూ వారికి తక్షణ పునరావాస క్యాంప్ లను నిర్వహించడంలో అవగాహన ఉండాలి.
మూసీ నది వరద గురించి కేసీఆర్ ఆరా తీశారు. వరద ఉద్ధృతి పెరిగే పరిస్థితిని అంచనా వేసి.. లోతట్టులో నివసిస్తున్న ప్రజల రక్షణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. 
మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో విపరీతంగా వానలు కురుస్తున్నవి. మహాబలేశ్వరం లో 70 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఎగువ రాష్ర్ట్రాలనుంచి కృష్ణా పరీవాహక ప్రాంతంలో వరద పెరిగే పరిస్థితులు ఏర్పాడ్డాయి. రాష్ట్రంలోని కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో తక్షణమే రక్షణ చర్యలు చేపట్టేందుకు సిద్దంగా వుండాలి.
                                                                                                                                                                  - సీఎం కేసీఆర్


ఆగస్టు 10 దాకా వర్షాలు కొనసాగే పరిస్థితి వున్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ప్రజా రక్షణకోసం అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కెసిఆర్ ఆదేశించారు. ఆర్ అండ్ బీ శాఖ వరద పరిస్థితులను ముందుగానే అంచనావేసి అన్ని ఇతర శాఖలతో సమన్వయం అవుతూ...బ్రిడ్జీలు రోడ్లు పరిస్థితులను పరిశీలించి ప్రజా రవాణా వ్యవస్థను కంట్రోల్ చేసుకోవాలన్నారు. 

 

నిర్మల్ లో పరిస్థితి ఎలా ఉంది

నిర్మల్‌ జిల్లాలో వరద పరిస్థితిపై ఆరా తీసిన సీఎం కేసీఆర్‌.. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాలో చేపట్టిన సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ముంపు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

టాప్ హెడ్ లైన్స్

Nepal Flash Floods: నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
Hybrid Cyber Fraud: వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతితో విషాదం
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతితో విషాదం
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AE Nookaraju Family Suicide Case: సాధిక్‌ను సౌజన్య ట్రాప్ చేసింది, బురఖా ధరించి అతడి వెంట తిరిగింది: నిందితుడి సోదరి
సాధిక్‌ను సౌజన్య ట్రాప్ చేసింది, బురఖా ధరించి అతడి వెంట తిరిగింది: నిందితుడి సోదరి
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
Konaseema Fishermen Rescued: వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
Hybrid Cyber Fraud: వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
Nara Lokesh: మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
IND VS SL 2nd Test Day 4 UPdates: సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
Mukesh Gowda: 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
Embed widget