అన్వేషించండి

KCR Maharashtra Tour: సోలాపూర్ చేరుకున్న కేసీఆర్, రాత్రికి అక్కడే బస - రేపటి షెడ్యూల్ ఇదీ

దాదాపు 600 కార్లు, రెండు బస్సులతో ర్యాలీ తరహాలో కేసీఆర్ మహారాష్ట్రకు తరలివెళ్లారు.

KCR Maharashtra Tour: మహారాష్ట్రకు రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం (జూన్ 26) సోలాపూర్‌కు చేరుకున్నారు. రేపు సీఎం పండరీపురం, ధారాశివ్ జిల్లాలోని తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తారు. ఇక్కడ శక్తిపీఠం కొలువై ఉంది. నేడు రాత్రి కేసీఆర్ సహా వెంట వెళ్లిన నేతలు అందరూ సోలాపూర్ లోనే బస చేయనున్నారు. నేడు ఉదయం రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఎం కేసీఆర్ బయలుదేరిన సంగతి తెలిసిందే.

దాదాపు 600 కార్లు, రెండు బస్సులతో ర్యాలీ తరహాలో కేసీఆర్ మహారాష్ట్రకు తరలివెళ్లారు. మధ్యాహ్నం దారి మధ్యలో ధారాశివ్‌ జిల్లా ఒమర్గాలో లంచ్ చేశారు. ఆ తర్వాత సాయంత్రం సోలాపూర్‌కు చేరుకున్నారు. అక్కడ ఈ మధ్య బీఆర్‌ఎస్‌ లో చేరిన స్థానిక నేతలు సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ బీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు.

రేపటి షెడ్యూల్ ఇదీ

రేపు మంగళవారం (జూన్ 27) ఉదయం 8 గంటలకే సీఎం కేసీఆర్ పండరీపురానికి బయలుదేరి వెళ్తారు. అక్కడ రుక్మిణీ సమేత విఠలశ్వరస్వామివారి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత సోలాపూర్‌ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ సంబంధిత కార్యక్రమానికి హాజరు అవుతారు. సోలాపూర్ జిల్లా నేత, ఎన్సీపీకి చెందిన భగీరథ్‌ బాల్కే సహా పలువురు నాయకులు సీఎం సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో రేపు మధ్యాహ్నం చేరనున్నారు. ఈ సందర్భంగానే కేసీఆర్ ప్రసంగిస్తారు.

అక్కడే భోజనాలు ముగించుకొని.. మధ్యాహ్నం 1.30 గంటలకు ధారాశివ్‌ జిల్లాలో కొలువుదీరిన శక్తిపీఠం తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకుంటారు. సుమారు 3.30 గంటలకు అక్కడ ప్రత్యేక పూజలు చేయించి, ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలోనే తిరుగు ప్రయాణం అవుతారు. సాయంత్రం 4.30 గంటలకు ఆ ఆలయం నుంచి బయలుదేరి రాత్రి 10 గంటలకు ప్రగతి భవన్‌కు చేరతారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. 

ఇప్పటికే 4 సార్లు మహారాష్ట్రలో పర్యటన

సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటికి 4 సార్లు మహారాష్ట్రలో పర్యటించారు. తొలుత ఫిబ్రవరి 5న నాందేడ్‌లో భారీ బహిరంగ సభ, మార్చి 14న కంధహార్ బహిరంగ సభ నిర్వహించారు. మే 19న మరోసారి నాందేడ్ లో పర్యటించారు. అక్కడ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు జరగదని ప్రజలు ఆలోచించేలా అక్కడి నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల జూన్ 15న నాగ్‌పుర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. త్వరలో ఔరంగాబాద్‌, పుణెలో పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. తాజాగా రెండు రోజుల మహారాష్ట్ర పర్యటన ఐదోసారి అవుతుంది.

ఒక్క సీటు వచ్చినా రాజకీయాల నుంచి తప్పుకుంటా - ఠాక్రే

మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు వచ్చినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌ రావు ఠాక్రే అన్నారు. కేసీఆర్ మహారాష్ట్ర టూర్‌తో ఒరిగేదేమీ లేదని అన్నారు. బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ టీమ్‌గా మారిందని, భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండబోదని స్పష్టం చేశారు. తెలంగాణలో దోచుకున్న సొమ్ము అంతటిని మహారాష్ట్రలో ఖర్చు పెడుతున్నారని, ఇటీవల కర్ణాటక ఎన్నికలకు కూడా డబ్బులు పంపారని ఆరోపించారు.

టాప్ హెడ్ లైన్స్

Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
CM Revanth Reddy: కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget